వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు.
కోటబొమ్మాళి, సారవకోట, న్యూస్టుడే: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు రెండు వందల కుటుంబాలు తెదేపాలో చేరాయి. సంతబొమ్మాళి మండలం మేఘవరం పంచాయతీ వాసులు, బోరుభధ్ర పంచాయతీ గొదలాం గ్రామ ఉప సర్పంచి కూన భాస్కరరావు, మరికొందరితో పాటు నలభై కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరాయి. టెక్కలి మండలం అయోధ్యపురం నుంచి వార్డు సభ్యులు కంచరాన యోగి, బగాది శ్రీనివాసరావు, వాలంటీర్లు చిన్నారావు, బగాది ప్రదీప్, కంచరాన కవిత, సహకార డైరెక్టర్ అశోక్కుమార్ తదితరులతో పాటు నలభై కుటుంబాలు, ముఖలింగాపురానికి చెందిన వాలంటీరు జెన్ని కాంతారావుతో పాటు 25 కుటుంబాలు చేరాయి. కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ ప్రకాష్నగర్ కాలనీకు చెందిన యాభై మంది యువకులు, కురుడు పంచాయతీ ఎరకయ్యపేటకు చెందిన సూర్యనారాయణ తదితరులతో పాటు 25 కుటుంబాలు తెదేపాలో చేరాయి.
సారవకోట మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు రావాడ చెంచయ్యతో పాటు కేలవలస ఉప సర్పంచి చింతు లక్ష్మణరావు పంచాయతీకి చెందిన 150 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.
త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం..
సారవకోట, న్యూస్టుడే: మండలంలోని వాండ్రాయి, చిన్నగుజ్జువాడ, బెజ్జి, మూగుపురం, కొమ్ముసరియాపల్లి తదితర గ్రామాల్లో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞానవేదిక సత్రాం కమిటీ అధ్యక్షుడు గుండ జనార్దనరావు ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచార కార్యక్రమం సోమవారం జరిగింది. సభ్యులు లక్ష్మీకుమారి, తాతయ్య, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల వాన
[ 02-06-2024]
జిల్లాలో పలుచోట్ల శుక్రవారం రాత్రి ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలాస డివిజన్లో అత్యధికంగా, శ్రీకాకుళంలో సాధారణ వర్షం కురిసింది. -
తవ్వకాలతో ముప్పు.. కలగదా కనువిప్పు..?
[ 02-06-2024]
ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మందస మండలాలకు సంబంధించి 50 వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించడానికి రెండు నదులపై వివిధ ప్రాజెక్టులు నిర్మించారు. -
ఎన్నికల ఫలితాల ప్రకటనలో అలసత్వం వద్దు
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న చేపట్టే ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాల ప్రకటన విషయంలో సంబంధిత అధికారులు ఎలాంటి అలసత్వం వహించవద్దని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. -
ఈసారీ ఎదురుచూపులేనా..?
[ 02-06-2024]
ఇంటర్ విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేకుండా చదువు సాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా సరఫరా చేసేవారు. -
గంటలోనే ముగించేశారు..!
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులో ఉండటం, ఓట్ల లెక్కింపు ప్రభావం జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంపై పడింది. -
ఆంక్షలు ఇవీ.. గమనించండి..!
[ 02-06-2024]
జిల్లాలో ఈ నెల 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వాహనాల రాకపోకలకు సంబంధించి ఆంక్షలు విధించారు. -
ఆర్భాటమే మిగిలింది
[ 02-06-2024]
మండలం పరిధి బూర్జపాడులో పాలకేంద్రం నిర్మాణమిది. పునాదులు వేసి పిల్లర్ల నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేశారు. బిల్లుల మంజూరులో జాప్యం నెలకొంది. -
ఇచ్చేది గోరంత.. కోరేది కొండంత
[ 02-06-2024]
శిక్షణలో వంటల తయారీకి నూనె ఎంత వేయాలి, పప్పు దినుసులు, మసాలా ఎంత వాడాలో చెబుతున్నారు. మెలకువలు నేర్పిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!
-
బ్రేకింగ్: ఏపీ ఎగ్జిట్ పోల్స్... మై యాక్సిస్ ఇండియాటుడే అంచనాలివే
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు