రూ.1,200 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం
కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు
మంత్రి పీ.కే.శేఖర్బాబు
కాంచీపురంలో ఆలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి
కాంచీపురం, న్యూస్టుడే: కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. ఈనేపథ్యంలో శేఖర్బాబు ఆదివారం రాత్రి కాంచీపురానికి చేరుకుని ఆక్రమణలో ఉన్న ఆలయ ఆస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంచీపురం కామరాజర్ వీధిలో సుమారు 100 ఏళ్ల క్రితం జీవసమాధి అయిన లింగాయతుల సమాజానికి చెందిన ఆలయం ఉందని, రెవెన్యూ శాఖ రికార్డుల్లో కల్మటం (రాతిమటం) అని ఉన్నట్లు దీనికి సంబంధించి కోర్టుల్లో కేసులు నడిచాయని తెలిపారు. ఈ ఆలయం వ్యక్తిగతంగా ఒకరికి సొంతమైనదా? లేక లింగాయతుల సమాజానికి చెందినదా అని వారిచ్చే ఆధారాల్ని బట్టి నిర్ణయిస్తామని తెలిపారు. కోర్టు తీర్పులు ఉన్నందున దేవాదాయ శాఖ న్యాయ విభాగంచే పర్యవేక్షిస్తామని తెలిపారు. మదురై వీరవసంత నాయకర్ మంటపానికి రూ.19 కోట్ల వ్యయంతో మరమ్మతులు జరగుతున్నాయని తెలిపారు. మంత్రి వెంట కాంచీపురం ఎంపీ జీ.సెల్వం, ఎమ్మెల్యేలు కే. సుందర్, సీవీఎంపీ ఎళిలరసన్, దేవాదాయ శాఖ జాయింటు కమిషనరు పొన్ జయరామన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
[ 02-05-2024]
కన్నియాకుమరి జిల్లా పూదప్పాండికి చెందిన సురేష్కుమార్ (46). ఇతనికి వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సురేష్కుమార్కి మద్యం అలవాటు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. -
సన్ పిక్చర్స్కు ఇళయరాజా నోటీసు
[ 02-05-2024]
రజనీకాంత్ నటిస్తున్న ‘కూలి’ చిత్రం టైటిల్ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడినట్టు సన్ పిక్చర్స్కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. -
కునుకు పాట్లు..
[ 02-05-2024]
చేసెందుకు పనెక్కువ ఉంటుంది. శరీరం సహకరించదు, కళ్లు మూసుకుపోతుంటాయి, ఎప్పుడు కునుకేద్దామా అని మనసు లాగేస్తుంటుంది. అటు పని.. ఇటు కాస్తయినా నిద్రపోతే బాగుండనే ఆలోచనలు. -
వృద్ధాప్యం విజయానికి అడ్డుకాలేదు
[ 02-05-2024]
ఆటలాడేందుకు వృద్ధాప్యం అడ్డుకాదని, ముసలితనం శరీరానికేగాని ఆత్మవిశ్వాసానికి కాదని చాటిచెప్పుతున్నారు 76 ఏళ్ల సెల్వరాజ్. ఈ వయసులోనూ ఆయన ఆత్మవిశ్వాసంతో యువకుడిలా క్రీడల్లో సత్తాచాటుతున్నారు. -
పరమత్తిలో 42.5 డిగ్రీలు
[ 02-05-2024]
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వేడిగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. తమిళనాట ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. -
ఎదురెదురుగా ఢీకొన్న కార్లు ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం
[ 02-05-2024]
కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన ఈరోడ్లో చోటుచేసుకుంది. -
మెట్రో రెండోదశలో 300 మలుపులు
[ 02-05-2024]
నగరంలోని మెట్రో రెండోదశలో మూడు వేర్వేరు మార్గాల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూనమల్లి నుంచి పోరూరు కూడలి వరకు ట్రాక్ పనులు ప్రారంభమయ్యాయి. -
వీక్లీ ప్రత్యేక రైళ్లు
[ 02-05-2024]
తాంబరం - సంత్రాగచ్చికి వేసవి రద్దీ కారణంగా వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే మంగళవారం ఓప్రకటనలో తెలిపింది. -
వాహన చోదకులకు మజ్జిగ సరఫరా
[ 02-05-2024]
వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చడంతో పలువురు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాంచీపురం ట్రాఫిక్ పోలీసు విభాగం తరఫున వాహన చోదకుల కోసం బుధవారం పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. -
బన్రుట్టి బస్టాండులో దాహం కేకలు
[ 02-05-2024]
కడలూర్ జిల్లా బన్రుట్టి నుంచి చెన్నై, కుంబÅకోణం, తంజావూర్, విళుపురం, నాగపట్టిణం, పేరావూరణి, చిదంబరం, సీర్గాళి, వేలూర్, చిత్తూరు, తిరువణ్ణామలై, తిరుచ్చి తదితర ప్రాంతాలకు సుమారు 200కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు లు నడుస్తున్నాయి. -
రాతి క్వారీలో పేలుడు
[ 02-05-2024]
విరుదునగర్ జిల్లా కారియాపట్టి సమీప ఆవియూర్ కడంబన్కుళంలో అదే ప్రాంతానికి చెందిన సేతు, రాజపాళయం శ్రీరామ్లకు చెందిన రాళ్ల క్వారీ ఉంది. -
మళ్లీ విశాల్, ముత్తైయ కాంబో?
[ 02-05-2024]
‘మరుదు’లో కలసి పనిచేసిన నటుడు విశాల్, దర్శకుడు ముతైయ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు కోలీవుడ్ సమాచారం.