రూ.1,200 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం
కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు
మంత్రి పీ.కే.శేఖర్బాబు
కాంచీపురంలో ఆలయాన్ని పరిశీలిస్తున్న మంత్రి
కాంచీపురం, న్యూస్టుడే: కాంచీపురం జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల విలువైన 129 ఎకరాల ఆలయ ఆస్తులను ఆక్రమణ దారుల నుంచి స్వాధీనం చేసుకున్నామని దేవాదాయశాఖ మంత్రి పీ.కే. శేఖర్బాబు తెలిపారు. కాంచీపురం కామరాజర్ వీధిలోని ఆలయ ఆస్తులను ఆక్రమించి టైర్ల కంపెనీ నిర్వహిస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్గా మారింది. ఈనేపథ్యంలో శేఖర్బాబు ఆదివారం రాత్రి కాంచీపురానికి చేరుకుని ఆక్రమణలో ఉన్న ఆలయ ఆస్తులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంచీపురం కామరాజర్ వీధిలో సుమారు 100 ఏళ్ల క్రితం జీవసమాధి అయిన లింగాయతుల సమాజానికి చెందిన ఆలయం ఉందని, రెవెన్యూ శాఖ రికార్డుల్లో కల్మటం (రాతిమటం) అని ఉన్నట్లు దీనికి సంబంధించి కోర్టుల్లో కేసులు నడిచాయని తెలిపారు. ఈ ఆలయం వ్యక్తిగతంగా ఒకరికి సొంతమైనదా? లేక లింగాయతుల సమాజానికి చెందినదా అని వారిచ్చే ఆధారాల్ని బట్టి నిర్ణయిస్తామని తెలిపారు. కోర్టు తీర్పులు ఉన్నందున దేవాదాయ శాఖ న్యాయ విభాగంచే పర్యవేక్షిస్తామని తెలిపారు. మదురై వీరవసంత నాయకర్ మంటపానికి రూ.19 కోట్ల వ్యయంతో మరమ్మతులు జరగుతున్నాయని తెలిపారు. మంత్రి వెంట కాంచీపురం ఎంపీ జీ.సెల్వం, ఎమ్మెల్యేలు కే. సుందర్, సీవీఎంపీ ఎళిలరసన్, దేవాదాయ శాఖ జాయింటు కమిషనరు పొన్ జయరామన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యర్థాలతో విద్యుత్తు వెలుగులు
[ 17-05-2024]
రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ తీసుకున్నా పెద్దఎత్తున చెత్తాచెదారాలు పోగవుతున్నాయి. చెన్నైలోనైతే ఇక హద్దేలేదు. ఈ వ్యర్థాలను నిల్వ చేస్తుండటంతో పెద్దఎత్తున విషవాయువులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. -
అబుదాబిలో రజనీ విశ్రాంతి
[ 17-05-2024]
‘జైలర్’ చిత్రం తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వేట్టైయన్’ చిత్రంలో రజనీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఆయన 170వ చిత్రమైన ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ తదితరులు నటించారు. -
19 జిల్లాల్లో నేడు భారీ వర్షం
[ 17-05-2024]
రాష్ట్రంలో శుక్రవారం 19 జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. గురువారం విడుదల చేసిన ప్రకటనలో.. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక సముద్రతీరంలో అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో 20 వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఇళయరాజాను కలిసిన మంత్రి
[ 17-05-2024]
ఇసైజ్ఞాని ఇళయరాజాను మర్యాదపూర్వకంగా కలిశానని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఎక్స్ పేజీలో తెలిపారు. -
20 నుంచి 26 వరకు ఐఐటీఎంలో అంతర్జాతీయ సదస్సు
[ 17-05-2024]
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో 20 నుంచి 26 వరకు ‘సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్స్’ (ఎస్పీఐసీ ఎంఏసీఏవై) 9వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. -
శస్త్రచికిత్స లేకుండా హృదయ చికిత్స
[ 17-05-2024]
పుట్టుకతో హృదయ సమస్య ఉన్న రోగికి తంజావూరు వైద్య కళాశాల ఆస్పత్రిలో శస్త్రచికిత్స లేకుండా విజయవంతంగా చికిత్స అందించారు. -
నగదు మోసం కేసులో సినీ నిర్మాత అరెస్టు
[ 17-05-2024]
కేరళలోని కొచ్చిన్కు చెందిన జానీ థామస్ మలయాళ సినీ నిర్మాత. ఇతనిపై కోవై వడవళ్లికి చెందిన ఉదయశంకర్ అనే వ్యక్తి సిటీ క్రైం బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు. -
కరెంటు తీగలపై దుస్తులు ఆరేయొద్దు
[ 17-05-2024]
వర్షాకాలంలో సంభవించే విద్యుత్తు ప్రమాదాల నియంత్రణకు విద్యుత్తుశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాలని ప్రజలను కోరింది. -
బడి ఈడులో బాల నేరస్థులుగా..
[ 17-05-2024]
చెన్నై జిల్లాలో ఏటా సరాసరి 500 మందికి పైగా బాలురు హత్య, హత్యాయత్నం, చోరీ, దోపిడీ తదితర కేసులలో అరెస్టయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ