‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్
పెందుర్తిలో సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్బాబును గజమాలతో సత్కరిస్తున్న నాయకులు
పెందుర్తి, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ తెదేపా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం 96వ వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ.. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు భరోసా కల్పించేలా మ్యానిఫెస్టో రూపొందించామన్నారు. సీఎం రమేశ్ మాట్లాడుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే భారత్ వెలిగిపోతుందన్నారు. పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి పంచకర్లను, కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేశ్ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. 96వ వార్డు తెదేపా అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గజమాలతో సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖపట్నంలో ఈదురుగాలులతో భారీ వర్షం
[ 02-06-2024]
నగరంలో ఆదివారం ఉదయం ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలాయి. -
అధికార పార్టీ అండ.. అడ్డులేని దందా..
[ 02-06-2024]
అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు.. మున్సిపల్ నేత పేరు చెప్పి మరికొందరు ఎలమంచిలిలో అక్రమంగా ఇసుక, కంకర వ్యాపారం చేస్తూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. -
భీమిలి తీరంలో విధ్వంసం ‘విజయ’వంతం
[ 02-06-2024]
ఆయన హయాంలో సీఆర్జెడ్ నిబంధనలపై నీతి వాక్యాలు వల్లె వేశారు. ఇప్పుడు తానే భీమిలి తీరంలో విధ్వంసానికి తెరలేపారు. ఎన్నికల కోడ్ విధుల్లో అధికారులుంటే, చాకిరేవు గెడ్డ పోరంబోకు భూ ఆక్రమణల్లో సదరు నేత నిమగ్నమయ్యారు. -
ఉద్యానానికి ‘‘ఉపాధి’’ ఊతం
[ 02-06-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం మొదలుకానుంది. ఇకపై ఉపాధిహామీ పథకం కింద చెరువుల్లో పూడికతీత పనులు తగ్గించి జూన్ నుంచి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు. -
విఘాతం కలిగిస్తే సహించం
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా అన్ని పార్టీల నేతలు సహకరించాలని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు. శనివారం ఇక్కడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శాంతిభద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. -
ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు
[ 02-06-2024]
ఈ నెల నాలుగున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మురుగు సొగసు కనుమా!
[ 02-06-2024]
సాధారణంగా వర్షాకాలం వచ్చేలోపే జీవీఎంసీ అధికారులు గెడ్డలు, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించి పూడికలు తీయాలి. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా మొదలు కావడంతో ఇప్పటికీ చాలా చోట్ల పూడిక పనులు పూర్తికాలేదు. -
పోస్టల్ బ్యాలట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితం
[ 02-06-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి పోలైన ఓట్లను ఈనెల 4న ఉదయం 8 గంటల నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని 21 హాళ్లలో లెక్కిస్తామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జిల్లావాసులకు వర్షంతో ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో నగరం దద్దరిల్లింది. శుక్రవారం రాత్రి విశాఖలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. -
సింగపూర్కు ‘ఐఎన్ఎస్ శివాలిక్’ నౌక
[ 02-06-2024]
భారత నౌకాదళానికి చెందిన రక్షణ నౌక ‘ఐఎన్ఎస్ శివాలిక్’ సింగపూర్ పర్యటనకు వెళ్లిందని శనివారం నేవీ వర్గాలు తెలిపాయి. దక్షిణ చైనా పసిఫిక్ సముద్ర గస్తీ విధుల్లో భాగంగా శివాలిక్ నౌక -
సరకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
[ 02-06-2024]
సరకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు సృష్టించిందని ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ‘ఈ ఏడాది మార్చిలో 201 నౌకల ద్వారా 76,22,732 మెట్రిక్ టన్నుల సరకు రవాణా ఇప్పటి వరకు రికార్డుగా ఉండేది. -
3వ తేదీన విశాఖ- గుణుపురం రైలు రద్దు
[ 02-06-2024]
నౌపడా-గుణుపురం మార్గంలో తిరుగుతున్న విశాఖ- గుణుపురం రైలు ఈ నెల 3వ తేదీన రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితమంటే అదే.. అలాంటివాటికి దూరంగా పారిపోను: హార్దిక్ పాండ్య
-
ఏపీలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేశ్కుమార్ మీనా సమీక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైంది: కేసీఆర్
-
ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ.. అంబానీని వెనక్కి నెట్టి తొలిస్థానానికి
-
పార్టీ నేతలకు కేజ్రీవాల్ సందేశం..ఏమన్నారంటే..