భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదు
కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అభివాదం చేస్తున్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సుంకరి వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
మహబూబాబాద్, న్యూస్టుడే: కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలనే కుటిల యత్నాలు చేస్తున్న భాజపా నుంచి దేశ ప్రజలకు రక్షణ కల్పించేందుకు వామపక్ష పార్టీల్లో ఒక్కటైన సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామ్యమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ విజయానికి మద్దతు తెలుపుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర, సమైక్యత కోసం కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సీపీఎం ముందుకు వచ్చిందన్నారు. రెండు పర్యాయాలు దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయి అప్పులపాలైందన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, భారాసలకు గుణపాఠం తప్పదన్నారు.
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య మాట్లాడుతూ మతతత్వ భాజపా, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన భారాస చెప్పే మాటలను నమ్మడానికి వీలు లేదన్నారు. ఇద్దరు భారాస ఎంపీలు ఈ ప్రాంత సమస్యలపై ఏనాడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించలేదన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుంకరి వీరయ్య మాట్లాడుతూ పదేళ్లు దేశాన్ని పాలించిన ప్రధాని మోదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. దేశంలో ఏ వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు గుణపాఠం చెప్పాలన్నారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వరంగల్, ములుగు జిల్లాలో సీపీఎం కార్యదర్శులు సీహెచ్.రంగయ్య, తుమ్మల వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు సూర్నపు సోమయ్య, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, గునిగంటి రాజన్న పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది
[ 02-06-2024]
కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన వరంగల్ లేబర్కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి దిశానిర్దేశం
[ 02-06-2024]
ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పదేళ్ల వయసున్న చిన్న పాప లాంటిది. రాబోయే పదేళ్లకల్లా తెలంగాణ నవ యవ్వనంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలి. స్వరాష్ట్రం సాకారమై దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ సంతోష క్షణాల్లో ‘విజన్ ఓరుగల్లు- 2034’కు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. -
రాష్ట్రావతరణ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖిలా వరంగల్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం 8.15 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అమరవీరులకు నివాళులర్పించనున్నారు. -
310 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
[ 02-06-2024]
నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని, సుమారు 310 కిలోల విత్తనాలు, నిషేధిత గడ్డి నివారణ మందును వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
జిల్లాలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్, జడ్పీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్లోని టౌన్హాల్, పోలీసు కమిషనరేట్తో పాటు మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆవిర్భావ వేడుకలకు వేళాయే..
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కలెక్టరేట్లో అన్ని శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా చేతులమీదుగా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. -
ముస్తాబైన కలెక్టరేట్
[ 02-06-2024]
జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల పరదాలతో భవనాన్ని అలంకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పల్లెకు దూరంగా ఆర్టీసీ సేవలు
[ 02-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పలు చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా గ్రామాల్లో బస్సులు ఆగకుండానే వెళుతున్నాయి. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. -
భూమి చదును చేస్తుండగా అడ్డుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
[ 02-06-2024]
తన పట్టా భూమిని చదును చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధి పెద్దవెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
ట్యాంక్బండ్పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?
-
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భద్రత పెంపు
-
ప్రిన్సెస్ డయానా.. వేలానికి వ్యక్తిగత లేఖలు!