బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.
ధాన్యం తూకంలో రైతులకు అన్యాయం
న్యూస్టుడే, బాలసముద్రం
కోమటిపల్లి ప్రాంతం కపురతండా శివారులో ధాన్యం తూకం వేస్తున్న హమాలీలు
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం తూకంలో జరుగుతున్న మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ కోమటిపల్లి, కపురతండా, దేవన్నపేట, ఉనికిచెర్ల గ్రామాల్లో అదనంగా తూకం వేస్తూ రైతులను దగా చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తే ఈ విషయం తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
500 గ్రాములు అదనం
గతంలో 70 కిలోలు నింపే ధాన్యం సంచి బరువు 900 గ్రాములు ఉండేది. బస్తా బరువు మోయలేమని హమాలీలు కోరడంతో దాన్ని 40 కిలోలకు కుదించారు. 40 కిలోల ధాన్యం సంచి 540 గ్రాముల బరువు ఉంటుంది. రైతుల కల్లాల్లో 40 కిలోల ధాన్యంతో పాటు అదనంగా మరో కిలో తూకం వేస్తున్నారు. వాస్తవంగా 40 కిలోల ధాన్యంతో పాటు 540 గ్రాములు సంచి బరువుతో తూకం వేయాలి. కొనుగోలు కేంద్రాల సిబ్బంది 41 కిలోలు తూకం వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
తాలు పేరుతో అదనపు తూకం
ఈసారి భూగర్భ జలాలు అడుగంటడంతో సకాలంలో పంటలకు సాగునీరు అందలేదు. దీంతో వరి ధాన్యం కొంత మేరకు తాలు ఏర్పడింది. వరికోత యంత్రాలతో ధాన్యం కుప్పలు వేసే క్రమంలో తాలు బయటకు వెళ్లి మేలురకం వచ్చింది. కొందరు రైతులకు తాలు కలవడంతో తూర్పార పట్టి కుప్పలు పోశారు. మరికొందరు ఎండల తీవ్రత కారణంగా తూర్పార పట్టలేకపోయారు. ఇదే అదనుగా తాలు కలిసిందనే కారణంతో 1.500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారు.
20 రోజలుగా నిరీక్షణ..
గత నెల మొదటి వారం నుంచే వరి కోతలు మొదలు పెట్టారు. కోమటిపల్లి, దేవన్నపేట, ఉనికిచెర్ల, కపురతండా తదితర పుర విలీన గ్రామాల్లో నెల రోజుల నుంచి వరిధాన్యం కోసి కుప్పలు పోసి ఉంచారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది సకాలంలో ప్రణాళిక చేసుకోకపోవడంతో రైతులకు ఆలస్యంగా టోకెన్లు జారీ చేశారు. మిల్లర్ల కేటాయింపు, సంచులు అందని కారణంగా కొనుగోలు కోసం రైతులు 20 రోజులుగా నిరీక్షించారు. ఇటీవల అకాల వర్షాలు కురిస్తే ఒక్కో రైతు రూ.10 వేలు వెచ్చించి పరదాలు కొనుగోలు చేసి ధాన్యం తడవకుండా కాపాడుకున్నారు. రైతులు ఆందోళన చేస్తే ఐదు రోజుల కిందట కొనుగోళ్లు ప్రారంభించారు.
- ప్రభుత్వ నిబంధనల మేరకు 40 కిలోల 700 గ్రాముల ధాన్యం తూకం వేయాలి.. అంతకు మించి ఎక్కడైనా అధిక తూకం వేసినట్లు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా సహకార అధికారి నాగేశ్వర్రావు చెప్పారు.
దిగుబడి తగ్గింది.. నష్టం పెరిగింది
గతంలో ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి వచ్చేది. ప్రస్తుతం సకాలంలో నీరు అందక దిగుబడి తగ్గి 21 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే వచ్చింది. 40 కిలోల సంచులతో సరి చూస్తే 56 నుంచి 60 బస్తాలు చేతికొచ్చాయి. ఒక్కో బస్తాకు 500 గ్రాముల ధాన్యం అదనంగా తూకం వేస్తే ఎకరాకు రూ.250 మేర రైతులకు నష్టం కలుగుతుంది. తాలు పేరుతో అదనంగా కిలో తూకం వేస్తే ఎకరాకు మరో రూ.693 వరకు నష్టం వస్తుంది. ప్రస్తుతం క్వింటాలు ధాన్యం రూ.2203 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
గన్ని సంచి బరువు 540 గ్రాములు ఉంటే.. అదనంగా కిలో తూకం వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలో గన్ని సంచి సరి చూస్తే 540 గ్రాములు చూపిస్తున్న చిత్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూపాయి గొడవ.. ప్రాణం తీసింది
[ 02-06-2024]
కేవలం ఒక్క రూపాయి విషయంలో జరిగిన గొడవలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన వరంగల్ లేబర్కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి దిశానిర్దేశం
[ 02-06-2024]
ఎందరో అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పదేళ్ల వయసున్న చిన్న పాప లాంటిది. రాబోయే పదేళ్లకల్లా తెలంగాణ నవ యవ్వనంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలి. స్వరాష్ట్రం సాకారమై దశాబ్దం పూర్తి చేసుకున్న ఈ సంతోష క్షణాల్లో ‘విజన్ ఓరుగల్లు- 2034’కు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. -
రాష్ట్రావతరణ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖిలా వరంగల్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆదివారం ఉదయం 8.15 గంటలకు కలెక్టర్ ప్రావీణ్య అమరవీరులకు నివాళులర్పించనున్నారు. -
310 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
[ 02-06-2024]
నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని, సుమారు 310 కిలోల విత్తనాలు, నిషేధిత గడ్డి నివారణ మందును వరంగల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
జిల్లాలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టరేట్, జడ్పీ కార్యాలయం, పబ్లిక్ గార్డెన్లోని టౌన్హాల్, పోలీసు కమిషనరేట్తో పాటు మండల కేంద్రాల్లోనూ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. -
ఆవిర్భావ వేడుకలకు ముస్తాబు
[ 02-06-2024]
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆవిర్భావ వేడుకలకు వేళాయే..
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కలెక్టరేట్లో అన్ని శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కలెక్టర్ భవేశ్ మిశ్రా చేతులమీదుగా జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. -
ముస్తాబైన కలెక్టరేట్
[ 02-06-2024]
జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా కలెక్టరేట్ ముస్తాబైంది. జాతీయ జెండాను పోలిన మూడు రంగుల పరదాలతో భవనాన్ని అలంకరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
పల్లెకు దూరంగా ఆర్టీసీ సేవలు
[ 02-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో పలు చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. చాలా గ్రామాల్లో బస్సులు ఆగకుండానే వెళుతున్నాయి. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. -
భూమి చదును చేస్తుండగా అడ్డుకున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
[ 02-06-2024]
తన పట్టా భూమిని చదును చేసుకుంటుంటే అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి పంచాయతీ పరిధి పెద్దవెంకటాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఓట్ల లెక్కింపు తర్వాత భారాస ఖాళీ: కోమటిరెడ్డి
-
మొన్న నంబర్ 1పై.. నేడు నంబర్ 2పై విజయం.. టాప్ - 10లోకి ప్రజ్ఞానంద
-
గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
మోదీ బిజీ బిజీ.. ఒక్కరోజే ఏడు రివ్యూలు.. ‘100 రోజుల అజెండా’పై దృష్టి!
-
అరుణాచల్లో మళ్లీ భాజపా సర్కార్.. ఎస్కేఎందే సిక్కిం..
-
పోలీసులు రివాల్వర్తో భయపెట్టారు: గులకరాయి కేసు నిందితుడు