Bonda Uma: తండ్రి హయాం నుంచి డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్: బొండా ఉమా
రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత బొండా ఉమా విమర్శించారు.
విజయవాడ: రాష్ట్ర సంపదను దోచుకోవడమే వైకాపా పనిగా పెట్టుకుందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శించారు. విజయవాడలో భాజపా నేత లంకా దినకర్, జనసేన మహిళా విభాగం నేత రాయపాటి అరుణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిపరుడికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. తండ్రి హయాం నుంచే డబ్బు రుచి మరిగిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కూటమిగా జతకట్టామన్నారు. జగన్ అవినీతిని సొంత కుటుంబమే బయటపెడుతోందని చెప్పారు. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గాడి తప్పిన పాలనను మళ్లీ దారిలో పెడతామన్నారు.
అప్పుల్లో రాష్ట్రానికి ప్రథమ స్థానం: లంకా దినకర్
వైకాపా పాలనలో అన్నిరంగాల్లో దోపిడీ జరిగిందని భాజపా నేత లంకా దినకర్ విమర్శించారు. ‘‘పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోచుకున్నారు. ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచందనం అన్నింట్లో దోపిడీనే. జగన్ పాలనలో అప్పుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి వచ్చింది. మూలధన వ్యయంలో తప్పుడు లెక్కలు చూపుతున్నారు. కేంద్ర పథకాలు, ప్రాజెక్టులకు తమ స్టిక్కర్లు వేసుకున్నారు’’ అని లంకా దినకర్ అన్నారు.
సాధ్యంకాని అంశాలతో వైకాపా మ్యానిఫెస్టో: రాయపాటి అరుణ
ఆసుపత్రులకు బకాయిల వల్ల ఆరోగ్యశ్రీ అమలు కావట్లేదని జనసేన నాయకురాలు రాయపాటి అరుణ అన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల రూ.1500 కోట్లు బకాయి పడిందని చెప్పారు. పాత అంబులెన్స్లకు రంగులేసి కొత్తవి కొన్నట్లు బిల్లులు పెట్టారని ఆరోపించారు. సాధ్యంకాని అంశాలతో వైకాపా మ్యానిఫెస్టో తీసుకొచ్చారని విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో పరిస్థితి అదుపులోనే ఉంది.. నిందితులను అరెస్టు చేస్తాం: ఎస్పీ
తిరుపతిలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. -
ఖజానా ఖాళీ చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు.. గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. -
వైకాపా విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి: డీజీపీని కోరిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైకాపా వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకం.. కారంపూడిలో భయానక వాతావరణం
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు మరోసారి రెచ్చిపోయారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఓటమి భయంతోనే వైకాపా దాడి : నారా లోకేశ్
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. -
చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైకాపా దాడులు కొనసాగుతున్నాయి. -
శాంతిభద్రతలు పునరుద్ధరణపై ఈసీ, పోలీసులు దృష్టిపెట్టాలి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైకాపా రౌడీలు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం: ముకేశ్ కుమార్ మీనా
రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ కొనసాగినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
మంత్రి బుగ్గన సహా 30 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఏపీ మంత్రి, డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. -
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్పై కేసు నమోదు
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన ఘటనలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలింగ్ పూర్తయినా.. ఆగని వైకాపా అరాచకాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయినా.. వైకాపా అరాచకాలు మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలోని పలుచోట్ల తెదేపా ఏజెంట్లు, కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారు. -
విజయవాడ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలూ కూటమికే: కేశినేని చిన్ని
వైకాపా ప్రభుత్వంపై కసి, బాధ, కోపంతో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని విజయవాడ లోక్సభ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. -
జనం మనసు దోచుకున్న జనసేన.. అత్యధిక స్థానాల్లో గెలుపుపై ధీమా
ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. -
వారణాసి చేరుకున్న చంద్రబాబు, పవన్
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు ( Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) వారణాసి చేరుకున్నారు. -
ఏం చేశారని ఓటేయాలి?: ఏపీలో పలు చోట్ల ఓటర్ల ఆగ్రహం.. పోలింగ్ బహిష్కరణ
ఏళ్లు గడుస్తున్నా తమ డిమాండ్లను ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఓటర్లు పోలింగ్ను బహిష్కరించారు. అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ఆందోళనలను విరమించి ఓటు హక్కు వినియోగిచుకున్నారు. -
కొత్త ఈవీఎంలతో ఓటింగ్లో కొంత జాప్యం
ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలు వినియోగించడంతో ఓటింగ్ ప్రక్రియ కొంత జాప్యమైంది. ఓటు వేసిన తర్వాత ఎర్ర రంగు బల్బు వెలగడం, బీప్ శబ్దం రావడానికీ కొంత ఆలస్యమైంది. -
ఎన్నికల అధికారిణితో చెవిరెడ్డి దురుసు ప్రవర్తన
ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎన్నికల అధికారిణితో దురుసుగా ప్రవర్తించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్లు వరుసల్లో ఉన్నారు. -
ఓటేస్తూ సెల్ఫోన్తో ఫొటోలు.. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడం, ఓటింగ్ ప్రక్రియను ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. -
విశాఖలో టోకెన్లు తీసుకొని నగదు పంపిణీ
ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరో వైపు వైకాపా నాయకులు టోకెన్లు ఉన్న వారికి డబ్బులు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం విశాఖలో రసాభాసగా మారింది. -
నేనొస్తా.. మీ సంగతి తేలుస్తా..!
‘రేయ్.. నీలాంటోళ్ల సంగతి చూస్తా. నేనొస్తా.. మీ అందరి సంగతి తేలుస్తా’ అంటూ కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రతిపక్ష నాయకులను హెచ్చరించారు.
తాజా వార్తలు
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!