గోపిరెడ్డి.. డబ్బు, రౌడీయిజంతో గెలవాలని చూస్తున్నారు: అమూల్య భావోద్వేగం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్లుగా తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అరవింద్బాబు నిలబడ్డారు. ఆర్థికంగా మా కుటుంబం ఎంతో నష్టపోయింది. నాకు, మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా కలిసికట్టుగా రౌడీయిజాన్ని అడ్డుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర సిరాతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు: ముకేశ్కుమార్ మీనా
ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా హెచ్చరించారు. -
2 నుంచి 3 లక్షల మెజారిటీతో గెలుస్తా: పెమ్మసాని చంద్రశేఖర్
‘రాష్ట్రంలో 130 నుంచి 140 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకొని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా 20 నుంచి 23 ఎంపీ స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటారు. -
వైకాపా పంచిన చీరలను తిరస్కరించిన మహిళలు
డాక్టరు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో శనివారం రాత్రి వైకాపా నాయకులు పంచిన చీరలను మహిళలు తిరస్కరించారు. కూటమి అభిమానుల ఇళ్లకు సైతం వెళ్లి గుమ్మంలో చీరలు ఉంచి వెళ్లిపోయారు. -
అత్తమామలనే మోసగించిన దుర్మార్గుడు మంత్రి ఉష భర్త శ్రీచరణ్: అత్త నాగవేణి ఆరోపణ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి కేవీ ఉష భర్త శ్రీచరణ్ తమను మోసం చేశారని ఆయన మేనమామ జగన్నాథ్ భార్య నాగవేణి ఆరోపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ప్రచార పర్వంలో కొడాలి నానికి చేదు అనుభవం
ఎన్నికల ప్రచార పర్వం చివరి రోజున గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి సొంత పార్టీ వర్గాల నుంచే ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆయన ప్రచారాన్ని మధ్యలో ఆపేసి వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా శనివారం నాని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు బస్టాండ్సెంటర్కు చేరుకున్నారు. -
పవన్ సభలో వైకాపా కార్యకర్త హల్చల్
కొద్ది నిమిషాల్లో కాకినాడలోని సభాస్థలికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకుంటారన్న తరుణంలో ఓ వైకాపా కార్యకర్త అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు. సభ జరిగే నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముసుగు తొలగించారు. -
మనిషిగా ఓడిన జగన్
‘ఎన్నికల్లో ఓటమిని ముందే గ్రహించిన జగన్మోహన్రెడ్డి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధమయ్యారని ఆయన సొంత చెల్లెలు షర్మిల విమర్శించారు. -
ఓటుతో అరాచక శక్తులపై వేటు వేయాలి
వైకాపా భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని, ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని కాటు వేసిన వైకాపా ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు ఓటుతో వేటు వేయాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
పవన్కు నితిన్ మద్దతు
జనసేన అధినేత పవన్కల్యాణ్కు సినీ నటుడు నితిన్ మద్దతు తెలిపారు. ‘మీ రాజకీయ ప్రయాణం కీలకంగా ఉన్న సమయంలో ఓ వీరాభిమానిగా మద్దతు తెలుపుతున్నా. -
చింతపల్లిపాడులో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఉద్రిక్తత
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా కార్యకర్తలు ప్రచారం చేసుకుంటుండగా అదే సమయంలో ఆ వైపు వచ్చిన వైకాపా బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
అన్నమయ్య జిల్లాలో వైకాపా నేతల వీరంగం
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. మండలంలోని పాపక్కగారిపల్లె ఎస్సీ కాలనీలో ఓటర్లకు నగదు పంచేందుకు శనివారం ఆ పార్టీ నేతలు వెళ్లారు. ఐదేళ్లుగా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదని.. తమకు వైకాపా నాయకులు ఇచ్చే డబ్బు అవసరం లేదని దళితులు తేల్చి చెప్పారు. -
మాఫియాలా తయారైన వైకాపా ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ నుంచి అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వైసీపీలో సి అంటేనే అవినీతి (కరప్షన్) అని స్పష్టం చేశారు. ప్రభుత్వం కుంభకోణాలు, మోసాలకు పాల్పడటమే కాకుండా మాఫియాలా తయారైందని విమర్శించారు. -
హంతకుల్ని జగన్ వెనకేసుకురావడం బాధాకరం
పార్టీలకతీతంగా తమ న్యాయ పోరాటానికి మద్దతునిచ్చి, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత కోరారు. రాష్ట్ర ప్రజల్లో భయం గూడుకట్టుకుందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అది తగ్గిపోయిందన్నారు. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో లక్ష ఉద్యోగాలు
తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో లక్ష మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ విభాగం వెల్లడించింది. -
ఏపీలో ఎన్డీయేకు మంచి మెజారిటీ
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఎన్డీయేకు మంచి మెజారిటీ వస్తుందని, తెలంగాణలో భాజపాకు సానుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. విశాఖపట్నంలో తాను ప్రచారం చేశానని, అక్కడి ప్రజల నుంచి ఎన్డీయే కూటమికి సంపూర్ణ మద్దతు లభించిందని తెలిపారు. -
మోదీని పల్లెత్తు మాటైనా అనలేదేం జగన్?
ఏపీలో అవినీతి సర్కారు నడుస్తోందని, ఎక్కడ తన అక్రమాలు బయట పడతాయోననే భయంతోనే మోదీని సీఎం జగన్ ఒక్క మాటా అనడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. -
తెదేపాకు 17 ముస్లిం సంఘాల మద్దతు
ఈ ఎన్నికల్లో 17 ప్రాంతీయ, జాతీయ ముస్లిం సంఘాలు తెదేపాకు మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీకి ఏకపక్షంగా ఓటు వేసి గెలిపించాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. -
దిల్లీ పెద్దలతో కలసి చంద్రబాబు కుట్ర
‘‘అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కితే ఆ సొమ్ము ఖాతాలకు పడకుండా ఏకంగా చంద్రబాబు దిల్లీ పెద్దలతో కలిసి కుట్ర చేసి అడ్డుకుంటున్నారు. ఈ డబ్బులు ఎన్నికలు అయిపోయాక 14వ తేదీన ఇస్తారట. ఇది కుట్ర కాదా?’’ అని సీఎం జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. -
తల్లి మద్దతు షర్మిలకే
రాజశేఖరరెడ్డిని ఎలా ఆదరించారో కడప నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న ఆయన ముద్దుబిడ్డ షర్మిలనూ అలాగే ఆశీర్వదించాలని విజయమ్మ కడప ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్కు సరిగ్గా 48 గంటల ముందు అమెరికా నుంచి ఆమె వీడియో సందేశం విడుదల చేయడం సీఎం జగన్కు ఊహించని షాక్గా పరిణమించింది. -
జగన్ గెలిస్తే భవిష్యత్తు ఉండదు
ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోకపోతే మళ్లీ వచ్చేది జగనే.. వైకాపా గూండాలే. ప్రజలు బలంగా నిలబడి వైకాపా ప్రభుత్వాన్ని మట్టిలో తొక్కకపోతే భవిష్యత్తు ఉండదు. నేరగాళ్లు రాజకీయాల్లో ఉండకూడదు. -
ఐదేళ్ల పాలనకు విజన్ డాక్యుమెంట్
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని జగన్ ఊరూరా తిరిగి మాయమాటలు చెబుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ కంటే రెండింతలు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు.