icon icon icon
icon icon icon

గోపిరెడ్డి.. డబ్బు, రౌడీయిజంతో గెలవాలని చూస్తున్నారు: అమూల్య భావోద్వేగం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

Updated : 28 Apr 2024 19:09 IST

నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్లుగా తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అరవింద్‌బాబు నిలబడ్డారు. ఆర్థికంగా మా కుటుంబం ఎంతో నష్టపోయింది. నాకు, మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా కలిసికట్టుగా రౌడీయిజాన్ని అడ్డుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img