కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది.
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఏడు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ, పెద్దాపురం, కాకినాడ పట్టణం, జగ్గంపేట ఇలా అన్ని అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరిలోవే కావడం గమనార్హం.
ఓటర్లు: 2024 ఓటర్ల జాబితా ప్రకారం.. ఇక్కడ 15.99 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 7.88 లక్షల మంది పురుషులు, 8.10 లక్షల మంది మహిళలు, 179 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్పై వైకాపాకి చెందిన వంగా గీతా విశ్వనాథ్ 25,738 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సునీల్కు 42.04 శాతం ఓట్లు రాగా.. గీత 44.16 శాతం ఓట్లు సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి మరోసారి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు బరిలో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండల కేంద్రానికి చెందిన ఉదయ్ శ్రీనివాస్ ‘టీ టైం’ సంస్థ అధినేత. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేశారు. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి స్వదేశానికి వచ్చారు. దేశీ టీ టైం స్టాల్స్ శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించారు. 3,300 శాఖల వరకు ఉన్నాయి. ఇక వైకాపా కాకినాడ లోక్సభ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నాలుగోసారి బరిలో దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఎం.పల్లంరాజు 2004, 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి, కేంద్ర మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది.
- ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీళ్లే!
- 1952 - చెలికాని. వెంకట రామారావు (సీపీఐ)
- 1957 - బయ్య. సూర్యనారాయణ మూర్తి (కాంగ్రెస్)
- 1962 - మొసలిగంటి. తిరుమల రావు (కాంగ్రెస్)
- 1967 - మొసలిగంటి. తిరుమల రావు (కాంగ్రెస్)
- 1971 - ఎం.ఎస్. సంజీవి రావు (కాంగ్రెస్)
- 1977 - ఎం.ఎస్. సంజీవి రావు (కాంగ్రెస్)
- 1980 - ఎం.ఎస్. సంజీవి రావు (కాంగ్రెస్)(ఐ)
- 1984 - తోట. గోపాల కృష్ణ (తెదేపా)
- 1989 - ఎం.ఎం. పల్లం రాజు (కాంగ్రెస్)
- 1991 - తోట. సుబ్బారావు (తెదేపా)
- 1996 - తోట. గోపాలకృష్ణ (తెదేపా)
- 1998 - కృష్ణం రాజు (భాజపా)
- 1999 - ముద్రగడ పద్మనాభం (తెదేపా)
- 2004 - ఎం.ఎం. పల్లంరాజు (కాంగ్రెస్)
- 2009 - ఎం.ఎం. పల్లంరాజు (కాంగ్రెస్)
- 2014 - తోట. నరసింహం (తెదేపా)
- 2019 - వంగా గీత (వైకాపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి