icon icon icon
icon icon icon

Chandrababu: వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు: చంద్రబాబు

తెదేపా హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 28 Apr 2024 14:03 IST

నెల్లూరు: తెదేపా హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరులోని షాదీ మంజిల్‌లో ఆయన ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడి చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

‘‘మా హయాంలో హైదరాబాద్‌లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశాం. హజ్‌ హౌస్‌ నిర్మించి పలువురిని మక్కా పంపించాం. కడప, విజయవాడలో హజ్‌హౌస్‌లు నిర్మించాం. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్‌ కట్టించాం. ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క భవనమైనా నిర్మించారా? మీకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరిగాయి. నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారు. తెదేపా హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండగ చేశాం. అబ్దుల్‌ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశాం. వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయి’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img