Chandrababu: మళ్లీ వైకాపా వస్తే మీ భూములు వదులు కోవాల్సిందే: చంద్రబాబు
నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
కడప: నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. వైకాపా నేతలు ప్రజల ఆస్తులు, భూములపై కన్నేశారన్న చంద్రబాబు.. ఇడుపులపాయలో 360 ఎకరాలు కొట్టేసింది ఎవరని ప్రశ్నించారు. తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వకపోవడంతో... జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ అయిందని ఎద్దేవా చేశారు. అన్నా..చెల్లి ఇంట్లో పోరాడుకోవాలికానీ, ఓట్లు చీల్చడం సరికాదని హితవు పలికారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లేనని వ్యాఖ్యానించారు. స్థానిక ఎమ్మెల్యే, మేయర్ సురేష్, రవీంద్రనాథ్రెడ్డి.. ఈ ముగ్గురు మారీచులు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ నవరత్నాల్లో ఇసుక, గంజాయి, భూ మాఫియా, మైనింగ్, హత్యా రాజకీయాలు, ప్రజల ఆస్తులు కబ్జా, సెటిల్మెంట్లు, దాడులు-కేసులు, శవరాజకీయాలు ఉన్నాయన్నారు. వైకాపా మళ్లీ గెలిస్తే ప్రజల భూములపై ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. రెండు సార్లు శంకుస్థాపన చేసిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు అంగుళమైనా కదిలిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డాం.. కానీ, తండ్రి అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని జగన్ సంతకాల సేకరణ చేపట్టారని విమర్శించారు. నేరాలు చేయడంలో పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. మధ్యాహ్నం ఈసీ ముందుకు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. -
పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే మద్దాళికి ఘోర పరాభవం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్కు మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
వైకాపా నేతలకు.. తిరుపతి ఎస్పీ భయపడుతున్నారు
వైకాపా నేతలను చూసి తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం: చంద్రబాబు
విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొనియాడారు. -
భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలోని పది అసెంబ్లీ, ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారక్లు రాష్ట్ర నాయకత్వానికి నివేదించారు. -
తెదేపా కార్యకర్త పీక కోసిన వైకాపా అరాచకం
ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పీక కోసేందుకు కొందరు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. -
ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల ఆ పార్టీని వీడి, తెదేపాలో చేరారు. -
పిన్నెల్లి సోదరుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మూకలు పెద్దఎత్తున అరాచకం సృష్టించాయని... 119 విధ్వంస ఘటనలు చోటుచేసుకొన్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (9)
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం కొల్హాపుర్, షిర్డీల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానంలో కొల్హాపుర్ చేరుకుని మహాలక్ష్మీ అమ్మవారిని సందర్శిస్తారు. -
చర్యలు మొదలయ్యాయి!
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చర్యలు మొదలయ్యాయని.. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్గుప్తాల్ని దిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ చెప్పినట్లు ఎన్డీయే నేతలు వెల్లడించారు. -
పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత
తిరుపతి గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. -
సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. -
నన్ను కాపాడింది అతడే.. లేదంటే ప్రాణాలు పోయేవి: పులివర్తి నాని
తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని వెల్లడించారు. -
ఓటమి ఖాయమని తెలిసే ప్లాన్ బీ అమలు చేశారు: వర్ల రామయ్య
ఎన్నికల్లో వైకాపా సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం
-
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
-
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
-
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!