Chandrababu: హంతకుల గుండెల్లో నిద్రపోతా: చంద్రబాబు
వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు.
నందికొట్కూరు: వైకాపా హయాంలో కూల్చివేతలు, దాడులు తప్ప ఇంకేం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికల్లో జగన్కు శిక్షవేసే బాధ్యత ప్రజలదేనన్నారు.
‘‘ ప్రజల జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్. డ్రైవింగ్ తెలియని వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టారు. ఆయన రివర్స్లో డ్రైవింగ్ చేస్తున్నారు. జగన్కు సంపద సృష్టించడం తెలియదు. బటన్ నొక్కింది ఎంత? బొక్కింది ఎంత? రాజకీయం అంటే సేవాభావం. ప్రజలకు అండగా ఉండటం. అంతేగాని, వారిని అణగదొక్కడం కాదు. పేదరికం లేని సమాజాన్ని చూడటమే నా ఆశయం. ఈ ముఖ్యమంత్రి డ్రామాల రాయుడు. సానుభూతితో ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు. ఆయన్ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిదే. రాజకీయాలంటే హత్యలు కాదు. హంతకుల గుండెల్లో నిద్రపోతా. అలాంటి ఆలోచన రావడానికే భయపడేలా చేస్తా.
మేం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు, హోంగార్డులకు జీతాలు పెంచుతాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీలు ఇస్తాం. జే బ్రాండ్, గంజాయి వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్ చేసిన ఘోరాలు చెప్పుకొంటూ పోతే ఐదేళ్లైనా సరిపోదు. సమర్థవంతమైన నాయకుడంటే పరిశ్రమలు తీసుకురావాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే. కాంగ్రెస్, భాజపాతో ఉండనని చెబుతున్న జగన్.. కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారో చెప్పాలి? నేరాలు.. ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్డీ చేశారు కానీ, ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి. దోచుకోవడం.. దాచుకోవడంలో మాత్రం మంచి ఎక్స్పర్ట్’’ అని చంద్రబాబు విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరికీ థాంక్స్.. సినీ కుటుంబ సభ్యుల ప్రేమ కదిలించింది: పవన్ లేఖ
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. -
పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు.. మరికొందరిపైనా ఈసీ కొరడా
ఏపీలో పోలింగ్ రోజు, తర్వాత హింస చెలరేగడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గొడవలు అరికట్టండి.. సీఎస్, డీజీపీ, సీఈవోకు హైకోర్టు ఆదేశాలు
ఏపీలో హింసాత్మక ఘటనలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లు జరగకుండా సీఎస్, డీజీపీని ఆదేశించాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు -
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి సీఎస్, డీజీపీ వివరణ
కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హాజరయ్యారు. -
వైకాపా రౌడీల దౌర్జన్యం.. తెదేపాకు ఓటు వేశారని దాడి!
పోలింగ్ పూర్తయినా వైకాపా రౌడీమూకల ఆగడాలు ఆగట్లేదు. విశాఖపట్నం నూకాలమ్మ ఆలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
పల్నాడును వైకాపా నేతలు రావణకాష్ఠంలా మార్చారు: యరపతినేని
ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైకాపా నేతలు పల్నాడును రావణకాష్ఠంలా మార్చారని గురజాల తెదేపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం.. ప్రధాన నిందితులు అరెస్ట్
చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. -
135 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం: మాజీ మంత్రి సోమిరెడ్డి
ఓటమి భయంతోనే వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. మధ్యాహ్నం ఈసీ ముందుకు..
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా దిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. -
పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు గుర్తించారు. -
తెదేపా నేత నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
తెదేపా నేత నక్కా ఆనందబాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్ల వెళ్లకుండా వసంతరాయపురంలోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు. -
తప్పించారా.. తప్పించుకున్నారా?: పులివర్తి నానిపై దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం
చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి పాల్పడిన దుండగులు తప్పించుకున్నారా లేక పోలీసులు తప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలింగ్ బూత్లో మాజీ ఎమ్మెల్యే మద్దాళికి ఘోర పరాభవం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్కు మహిళల నుంచి ఘోర పరాభవం ఎదురైన ఘటన సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
వైకాపా నేతలకు.. తిరుపతి ఎస్పీ భయపడుతున్నారు
వైకాపా నేతలను చూసి తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ భయపడుతున్నారని తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి విమర్శించారు. -
ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరిస్తాం: చంద్రబాబు
విదేశాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి స్వరాష్ట్రానికి వచ్చి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనన్యసామాన్యమని తెదేపా అధినేత చంద్రబాబు ప్రవాసాంధ్రులను కొనియాడారు. -
భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయం
రాష్ట్రంలోని పది అసెంబ్లీ, ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ విస్తారక్లు రాష్ట్ర నాయకత్వానికి నివేదించారు. -
తెదేపా కార్యకర్త పీక కోసిన వైకాపా అరాచకం
ఏలూరు నగరానికి చెందిన ఓ యువకుడు తెదేపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పీక కోసేందుకు కొందరు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించారు. -
ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే
ఆంధ్రప్రదేశ్లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన దిల్లీలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. -
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఇటీవల ఆ పార్టీని వీడి, తెదేపాలో చేరారు. -
పిన్నెల్లి సోదరుల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?
పోలింగ్ సమయంలో, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మూకలు పెద్దఎత్తున అరాచకం సృష్టించాయని... 119 విధ్వంస ఘటనలు చోటుచేసుకొన్నాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (9)
తెదేపా అధినేత చంద్రబాబు గురువారం కొల్హాపుర్, షిర్డీల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి విమానంలో కొల్హాపుర్ చేరుకుని మహాలక్ష్మీ అమ్మవారిని సందర్శిస్తారు.
తాజా వార్తలు
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!