ECI: అమాంతం పెరిగిన వీక్షకులు.. ఈసీ వెబ్సైట్ క్రాష్..!
Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం వెబ్సైట్ను వీక్షించేవారి సంఖ్య అమాంతం పెరిగింది.
దిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Assembly Election Results) ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం.. పెద్ద సంఖ్యలో ఎన్నికల సంఘం (EC) వెబ్సైట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈసీ వెబ్సైట్పై లోడ్ పడింది. దానివల్ల వెబ్సైట్ క్రాష్ అయినట్లు తెలుస్తోంది. దానిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. తమకు వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని పోస్టులు పెడుతున్నారు. దాంతో ఫలితాల ప్రారంభ సరళి వెంటనే తెలియడం లేదని చెప్తున్నారు. ఈ పోస్టులు ఎన్నికల సంఘం దృష్టికి చేరాయి. ఈ సమస్యను ఈసీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.