icon icon icon
icon icon icon

ఎన్నికల తర్వాత ఫిష్‌ ఫ్రై అవుతారు.. పార్టీ మారిన వారికి మంత్రి పెద్దిరెడ్డి బెదిరింపు

‘తెదేపా నుంచి వైకాపాలో చేరినవారు వారి పనులు చేసుకుని వెన్నుపోటు పొడిచి మళ్లీ తెదేపాకు వెళ్లిపోయారు. అలాంటివారు ఎన్నికల తర్వాత ‘ఫిష్‌ ఫ్రై’ అవుతారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.

Published : 23 Apr 2024 06:08 IST

పీలేరు బృందం, న్యూస్‌టుడే: ‘తెదేపా నుంచి వైకాపాలో చేరినవారు వారి పనులు చేసుకుని వెన్నుపోటు పొడిచి మళ్లీ తెదేపాకు వెళ్లిపోయారు. అలాంటివారు ఎన్నికల తర్వాత ‘ఫిష్‌ ఫ్రై’ అవుతారు’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సోమవారం మంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇలా బెదిరించేలా మాట్లాడారు. దీనికి తోడు మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, మైకందుకుని మైనారిటీలంతా వైకాపాకే ఓటు వేయాలని ప్రసంగాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img