కదన రంగంలోకి వైఎస్ కుటుంబం!
మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది.
ఇప్పటికే వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్ తరఫున ప్రచారం
తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ రంగప్రవేశం
మే 1 నుంచి కడప నియోజకవర్గంలోనే షర్మిల
వైకాపా ఇంటింటి ప్రచారంలో జగన్ సతీమణి భారతి
ఈనాడు, కడప వేంపల్లే, న్యూస్టుడే: మాజీ మంత్రి వివేకా హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమారుడు సీఎం జగన్, కుమార్తె షర్మిల రెండు వర్గాలుగా విడిపోయి సార్వత్రిక ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని, అందుకు జగనే కారణమంటూ ప్రజాక్షేత్రంలోకి షర్మిలతో కలిసి సునీత దిగారు. న్యాయం.. ధర్మం నినాదంతో ఎన్నికల్లో తలపడటానికి వారిద్దరూ సిద్ధమయ్యారు. కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతుండగా.. వైకాపా నుంచి సీఎం జగన్.. వైఎస్ అవినాష్రెడ్డిని రంగంలోకి దింపారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల.. తన అన్న జగన్తో పాటు అవినాష్రెడ్డిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన ఆమె రాష్ట్రంలో ప్రచారానికి పీసీసీ అధ్యక్షురాలి హోదాలో వెళ్లారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్ పూర్తయ్యేవరకు ఇక్కడే మకాం వేయాలని నిర్ణయించారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఊరూవాడా ప్రచారం చేస్తుండగా, తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్ శనివారం నుంచి రంగంలోకి దిగారు.
షర్మిలకు మద్దతుగా అనిల్కుమార్ సమావేశాలు
క్రైస్తవ మత ప్రబోధ]కుడిగా పేరుతెచ్చుకున్న షర్మిల భర్త బ్రదర్ అనిల్కుమార్.. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా తిరిగి వైకాపాకు మద్దతుగా క్రిస్లియన్లను కూడగట్టే ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు. ఇప్పుడు ఆయనే వైకాపాకు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా వైయస్ఆర్ జిల్లాలో పాస్టర్లు, క్రైస్తవులతో సమావేశమవుతున్నారు. కడపలోని పలు చర్చిల్లో ఆదివారం జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన.. ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు. తన పార్టీ ఓట్లు చీలి పోతాయనే భయంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్ బహిరంగంగా విమర్శలు చేశారు. సీఎం అనుమానాలు నిజం చేసేవిధంగా బ్రదర్ అనిల్కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రొద్దుటూరులో శనివారం ఆయన పాస్టర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. బహిరంగంగా ఓట్లు అడగకపోయినప్పటికీ.. పాస్టర్లు మాత్రం మనమంతా హస్తం గుర్తుకు ఓటేయాలని కోరడం వినిపించింది. కడపలో జరిగిన ఓ చర్చిలో బోధనలు చేస్తూ.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని క్రీస్తు సందేశాన్ని వినిపించారు. మా కుటుంబంలో జరిగిన ఘటనల కారణంగా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నామని, న్యాయం కోసం పోరాడుతున్నామని అన్నారు. న్యాయం జరగాలని, జరిగి తీరుతుందని ఆవేశపూరితంగా ప్రసంగించారు.
ఇంటింటి ప్రచారంలో భారతి
సీఎం జగన్ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో ఆదివారం వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొండూరు మండలం ఇనగనూరులో ఇంటింటి ప్రచారం చేపట్టగా.. ఆమె వెంట అవినాష్రెడ్డి సతీమణి సమత ఉన్నారు. సమత తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా జగన్, ఎంపీగా అవినాష్రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు.
సునీత ప్రచారంలో వైకాపా కవ్వింపు చర్యలు
పులివెందుల మండలంలో ఆదివారం వివేకా కుమార్తె సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద రంగాపురంలో ఆమె ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వివేకా హత్య గురించి ఇక్కడ మాట్లాడవద్దని వైకాపా కార్యకర్తల ఆందోళన చేపట్టగా.. వారికి ధీటుగా సునీత సమాధానం ఇచ్చారు. ఎందుకు వివేకా హత్య గురించి మాట్లాడకూడదంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో పోలీసులు స్పందించి వైకాపా కార్యకర్తలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ విజయంపై తెదేపా ధీమా
ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తడం, ఉదయం పోలింగ్ కేంద్రాలు తెరిచే సమయానికే ఓటర్లు బారులు తీరడం.. గంటల తరబడి ఓపికగా క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేయడం.. రాత్రి 10 గంటల సమయానికి కూడా అనేక చోట్ల పెద్ద క్యూలు ఉండటం.. -
జనం మనసు దోచుకున్న జనసేన
ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ గెలుపు సాధ్యమని జనసేన అంచనా వేసింది. 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 18 చోట్ల గెలుపు తథ్యమని, 3 చోట్ల గట్టిపోటీ ఉందని పార్టీ అంతర్గత అంచనాలు పేర్కొంటున్నాయి. -
110-120 సీట్లతో గెలుస్తాం
‘అసెంబ్లీ ఎన్నికల్లో 110- 120 సీట్లు వస్తాయి.. దీనికి కొంత వరకు తగ్గినా కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వైకాపా ధీమా వ్యక్తం చేస్తోంది. -
కమలం విజయం పక్కా
ఎన్నికల్లో గెలుపుపై భాజపా అభ్యర్థులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. వైకాపా ఐదేళ్ల ప్రజావ్యతిరేక పాలన, కూటమి మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు... ఓటర్లను బాగా ప్రభావితం చేసినట్లు పేర్కొన్నారు. -
గుంటూరు జిల్లాలో వైకాపా బెదిరింపులు
గుంటూరు జిల్లాలో నాలుగు చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రత్తిపాడులో పోలీసుస్టేషన్ ఎదుట ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద తెదేపా మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరామప్రసాద్పై వైకాపా నాయకులు దాడికి ప్రయత్నించారు. -
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - ఎన్ని గంటలకు ఎంత శాతం ఓట్లు పోలయ్యాయంటే?
AP Elections Voter Turnout: ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు శాతం, జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు మీ కోసం... -
కూటమి విజయం తథ్యం.. ఓటరు తీర్పు సుస్పష్టం : పవన్ కల్యాణ్
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం తథ్యమని, ఓటర్లు ఈ దిశగా స్పష్టమైన తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. -
కడపలో రణ రంగం.. వైకాపా శ్రేణుల రాళ్లదాడిలో పలువురికి గాయాలు
కడప నగరంలోని గౌస్ నగర్లో సోమవారం రాత్రి వైకాపా కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటరులోనూ కనిపించింది: చంద్రబాబు
పోలింగ్ సరళిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. -
ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఏపీలో పోటెత్తిన ఓటరు.. అర్ధరాత్రి దాటినా పలుచోట్ల కొనసాగుతోన్న పోలింగ్!
ఏపీలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ప్రజలు.. అర్ధరాత్రి తర్వాతా పలుచోట్ల ఓటేసేందుకు క్యూలైన్లలో వేచిఉన్నారు. -
నాటు బాంబులతో వైకాపా దాడులు.. తంగెడలో యుద్ధవాతావరణం
తంగెడలో వైకాపా శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో దాడులకు తెగబడ్డారు. -
రెచ్చిపోయిన మంత్రి అంబటి అనుచరులు.. పోలింగ్ కేంద్రంపైనే దాడి
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చీమలమర్రిలో మంత్రి అంబటి రాంబాబు అనచరులు రెచ్చిపోయారు. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం .. క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం
హింసాత్మక ఘటనల మధ్య తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. -
సాయంత్రం 5 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ శాతం ఎంతంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరుగుతోంది. -
తెదేపా అభ్యర్థి అరవిందబాబు కారుపై వైకాపా శ్రేణుల దాడి
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా వర్గీయులు హల్చల్ చేశారు. -
ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. ఈ సంకల్పం రాష్ట్రానికి మేలు చేస్తుంది: చంద్రబాబు
రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓట్లు వేసిన వారికి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అరాచకం
పోలింగ్ వేళ కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. -
వైకాపా దారుణాలపై పోలీసులు చర్యలు తీసుకోట్లేదు.. ఈసీకి భాజపా ఫిర్యాదు
ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా దారుణాలపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. -
ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు: తెదేపా నేత కనకమేడల
ఉదయం నుంచి ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని తెదేపా మాజీ ఎంపీ కనక మేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఈసీ
గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
తాజా వార్తలు
-
వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన జీవీ ప్రకాశ్, సైంధవి దంపతులు
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం