icon icon icon
icon icon icon

వైకాపా ప్రచారంలో ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్‌

దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు.

Updated : 02 May 2024 08:53 IST

ఓ బాలుడి పరిస్థితి విషమం

పెదపాడు, న్యూస్‌టుడే: దెందులూరు వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి ప్రచార ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ముందు వరుసలో రామ్మోహనరావు అనే డ్రైవర్‌ ట్రాక్టర్‌ ఇంజిన్‌పై ముగ్గురు పిల్లలను కూర్చోబెట్టుకొని అత్యుత్సాహంతో రౌండ్లు వేయాలని చూశాడు. దీంతో అది పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి, బోల్తా పడింది. వెంటనే కార్యకర్తలు చెరువులోకి దూకి వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తొందూరు నిఖితేశ్వర్‌, గుండుబోయిన దుర్గశ్రీ మణికంఠలు అపస్మారక స్థితికి చేరారు. అబ్బయ్యచౌదరి అక్కడికి చేరుకొని బాలురను తన కారులో ఏలూరులో ఆసుపత్రికి తరలించారు. నిఖితేశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని మణిపాల్‌ ఆసుపత్రికి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img