icon icon icon
icon icon icon

పెద్దిరెడ్డి ప్రమేయంతో వైకాపా గూండాల దాడి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్‌.రామకృష్ణ ఆరోపించారు.

Updated : 02 May 2024 07:29 IST

పూర్వ జడ్జి రామకృష్ణ ఆరోపణ

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షగట్టి తన ఇంటిపై దాడికి వైకాపా గూండాలను పురికొల్పారని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన పూర్వ జడ్జి ఎస్‌.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దిరెడ్డి కుటుంబీకుల అవినీతి, అక్రమాలను బయటపెడుతున్నానన్న అక్కసుతోనే తనపై దాడి చేస్తున్నారని, భయాందోళనల మధ్య జీవించాల్సి వస్తోందని వాపోయారు. క్రిమినల్‌ కేసు పెట్టాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో తాను గతంలో ఫిర్యాదునిచ్చినా కేసు నమోదు చేయలేదని.. దీంతో జిల్లా ఎస్పీని ఆశ్రయించానని తెలిపారు. ఈ విషయంలో తనపై కోపం పెంచుకున్న పెద్దిరెడ్డి కుటుంబీకులు ప్రస్తుతం తన ఇంటిపై దాడి చేయించినట్లు కన్పిస్తోందని అన్నారు. రామకృష్ణ మంగళవారం రాత్రి ఇంటి మిద్దెపై నిద్రిస్తున్నప్పుడు కింద పెద్దఎత్తున శబ్దాలు వినిపించాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అరుస్తూ అంతస్తు కిటికీ, కారు అద్దాలను ధ్వంసం చేశారు. కిటికీ దగ్గర యాసిడ్‌ పోసిన గుర్తులున్నాయి. తనతోపాటు కుటుంబీకులను చంపడానికి యాసిడ్‌ తెచ్చారని రామకృష్ణ అనుమానిస్తున్నారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ సూర్యనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img