సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది.
ఇప్పటిదాకా 130 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన భాజపా
ఈనాడు, దిల్లీ: భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. మధ్యప్రదేశ్లో ఐదుగురు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ముగ్గురు చొప్పున ఎంపీలు అసెంబ్లీకి ఎన్నికవడంతో వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకొచ్చింది. హరియాణా, మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్లలో ఒక్కో సిట్టింగ్ ఎంపీ కన్నుమూశారు. రాజస్థాన్లో ఒకరు, హరియాణాలో మరొకరు భాజపాకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. దాంతో ఆయా స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించింది. పశ్చిమబెంగాల్లో ఇద్దరిని, దిల్లీ, కర్ణాటకల్లో ఒక్కో సిట్టింగ్ ఎంపీని ఒక స్థానం నుంచి మరో స్థానానికి మార్చింది. ఈ 20 సీట్లను మినహాయిస్తే.. మిగిలిన 110 చోట్ల సిట్టింగ్లకు టికెట్ నిరాకరించి, కొత్తవారిని రంగంలోకి దించింది.
11 మంది కేంద్రమంత్రులకు మొండిచేయి
స్థానిక సామాజిక పరిస్థితులు, విజయావకాశాలు, పనితీరు సరిగా లేకపోవడం, అనారోగ్యం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తదితర కారణాలతో భాజపా ఈ దఫా 11 మంది కేంద్రమంత్రులకు టికెట్ నిరాకరించింది. ఈ జాబితాలో అశ్వినీకుమార్ చౌబే, జనరల్ వీకే సింగ్, దర్శనావిక్రమ్ జర్దోస్, మీనాక్షి లేఖి, సోమ్ప్రకాశ్, రామేశ్వర్ తేలీ, ఎ.నారాయణ స్వామి, ప్రతిమాభౌమిక్, రాజ్కుమార్ రంజన్సింగ్, బిశ్వేశ్వర్ టుడు, మంజుపారా మహేంద్రభాయ్ ఉన్నారు. పంజాబ్లోని హోశియార్పుర్లో కేంద్రమంత్రి సోమ్ప్రకాశ్ను పక్కనపెట్టినప్పటికీ.. ఆ స్థానంలో ఆయన సతీమణికి అవకాశం కల్పించారు.
360 డిగ్రీల పరిశీలన
ఈ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం.. అభ్యర్థుల ఎంపికలో 360 డిగ్రీల పరిశీలన చేపట్టింది. ఏ చిన్న కోణాన్నీ వదిలిపెట్టకుండా అంతర్గత సర్వేలు, ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో పార్టీకి మొత్తం 26 మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. వారిలో ఏకంగా 14 మందిని ఇంటికి సాగనంపింది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోనూ భారీగానే సిట్టింగ్లకు మొండిచేయి చూపింది. భాజపా నాయకత్వ వ్యవహారశైలిని వ్యతిరేకించే విధంగా పత్రికల్లో వ్యాసాలు రాసినందుకు వరుణ్గాంధీని, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతానన్నట్లు వ్యవహరించిన రీటా బహుగుణను, 400కుపైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్నందుకు అనంతకుమార్ హెగ్డేను, చట్టసభలో మైనార్టీ ఎంపీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు రమేష్ బిధూరీని పార్టీ పక్కనపెట్టింది. మొత్తంగా భాజపా ఇప్పటివరకు 433 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తానికి తిరుగుబాట తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం. -
కమలం కోటతో కాంగ్రెస్ ఢీ
ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో లింగాయత్లు భాజపాకు వెన్నుదన్నుగా ఉంటారు. -
పచ్చని ఎన్నికలు తోడుంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికలు యమజోరుగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. -
పాత తీర్పా? మార్పా?
విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్సభ నియోజకవర్గం ఆదిలాబాద్. -
కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. -
ఓటింగ్కు వడదెబ్బ?
ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఓటేయడానికి ప్రజలు బద్ధకిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. -
పది స్థానాలపై పట్టు బిగించేలా!
రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. -
ఉత్తర కర్ణాటకలో ‘కొత్త’ రాజకీయం
కన్నడనాట లోక్సభ ఎన్నికల మలి విడత పోలింగ్కు ఉత్తర కర్ణాటక సిద్ధమవుతోంది. 14 నియోజకవర్గాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ‘ఉత్తర’లో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు వారసులే. -
తేల్చేది ఆ మూడే!
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్తోపాటు బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లే దాదాపుగా విజేతను తేలుస్తాయి. ఉత్తర్ ప్రదేశ్ను పక్కనబెడితే 25శాతం సీట్లున్న మిగిలిన 3 రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు ఉంటుందనేది చెప్పడం కష్టం. -
‘దశ’ తిరిగేనా..
యాదవుల కోటలో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఓబీసీలు (వీరిలో యాదవులు ఎక్కువ) అధికంగా ఉండే ఉత్తర్ ప్రదేశ్లోని 10 లోక్సభ నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
పాలమూరులో ఎవరిదో పాగా?!
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. -
ప్రచారంలో బలగం
ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్ నేతలు.. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు. -
నిగూఢ సైన్యం!
సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీలకు, నేతలకు నిరుద్యోగ ఇంజినీర్లు, ఎంబీఏ పట్టభద్రులు నిగూఢ సైన్యంగా పని చేస్తున్నారు. తమ డేటా నైపుణ్యాలతో అతి తక్కువ సమయంలో నేతల ప్రచారంలోని రాజకీయ సమస్యలను పరిష్కరిస్తున్నారు.