అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు.
లోక్సభకు ఒకలా.. అసెంబ్లీకి మరోలా తీర్పు
ఝార్ఖండ్లోని 3 స్థానాలకు 20న పోలింగ్
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. ఈ రాష్ట్రంలోని 3 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలో భాజపా, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ) కలిసి పోటీ చేస్తున్నాయి. అటు ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి ఇండియా కూటమిగా బరిలోకి దిగాయి. గతంలో మాదిరిగానే ఈ రాష్ట్రంలో ఫలితాల్ని అంచనా వేయడం కష్టం. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం, మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యలు. ప్రభుత్వం ఈ సమస్యలపై ఎలా స్పందిస్తుందన్న అంశాలను బట్టే ఓటింగ్ సరళి ఉంటుంది. తాజాగా ఎన్డీయే, ఇండియా కూటములు అభివృద్ధి, ఉద్యోగ కల్పన ఎజెండాగానే ప్రచారం చేస్తున్నాయి.
గ్రామీణ పేదరికం
ఎస్సీలు, ఎస్టీలు, అత్యంత వెనుకబడిన వర్గాల వారు అధికంగా ఉండే చత్రా నియోజకవర్గం ఝార్ఖండ్ ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది గ్రామీణ పేదలు. వారిలో ఎక్కువ మంది ఎస్సీలే. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు ఆర్జేడీకి పట్టుండేది. ఇక్కడ ఎస్సీలు 27%, ఎస్టీలు 21%, ముస్లింలు 10శాతం ఉంటారు.
2014, 2019లలో భాజపా రికార్డు మెజారిటీతో గెలిచింది. ఈసారి 22 మంది బరిలో ఉన్నారు. భాజపా తరఫున కాళీ చరణ్ సింగ్, కాంగ్రెస్ తరఫున కృష్ణానంద్ త్రిపాఠీ పోటీ చేస్తున్నారు.
నల్ల బంగారం
- అపార బొగ్గు నిల్వల కేంద్రం హజారీబాగ్. ఇక్కడ ఉత్తర కరణ్పుర, చార్హి, కుజు, ఘటోటాండ్, బర్కాగావ్ ప్రాంతాలు బొగ్గు గనులకు ప్రసిద్ధి. ఇవే ఇక్కడి ప్రజలకు జీవనాధారం. హజారీబాగ్ ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. పర్యాటక ప్రాంతంగానూ పేరుంది. వెనుకబడిన ప్రాంతమైనా ఈ నియోజకవర్గంలో 70శాతానికి పైగా అక్షరాస్యత ఉంది. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఇది పట్టున్న ప్రాంతం.
- 2014, 2019లలో భాజపా నేత, యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా భారీ మెజారిటీలతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 15శాతం, ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 12శాతం ఉంటారు. ఈసారి జయంత్ సిన్హాకు భాజపా టికెట్ ఇవ్వలేదు. మనీశ్ జైశ్వాల్ను పార్టీ అభ్యర్థిగా భాజపా నిర్ణయించింది. కాంగ్రెస్ తరఫున జై ప్రకాశ్ భాయ్ పటేల్ పోటీ చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న జయంత్ సిన్హా ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీలో విప్గా ఉన్న జై ప్రకాశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరి బరిలోకి దిగారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇవి రెండు భాజపాపై ప్రభావం చూపించే అవకాశముంది.
మైకా గని
- కోడర్మా ప్రాంతంలో ప్రపంచంలోనే పేరొందిన రూబీ మైకా దొరుకుతుంది. దేశంలోనే తొలి సైనిక పాఠశాల ఈ ప్రాంతంలోనే ఏర్పాటైంది. కోడర్మా కలాకంద్ అత్యంత ప్రసిద్ధి చెందింది. దీనిని దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ నియోజకవర్గాన్ని ఝార్ఖండ్కు గేట్వేగా కూడా పిలుస్తారు. కోడర్మాకు మైకా సిటీ అని పేరు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉంది.
- ఈ నియోజకవర్గంలో 17 లక్షల మంది ఓటర్లున్నారు. 1977లో ఇది ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం సంప్రదాయకంగా భాజపాకు అండగా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఏడుసార్లు ఆ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ రెండుసార్లు, ఝార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) ఒకసారి విజయం సాధించాయి.
- 2019లో ఇక్కడి నుంచి అన్నపూర్ణాదేవి 4.5 లక్షలకుపైగా మెజారిటీతో గెలిచారు. 2014లో రవీంద్ర కుమార్ రే విజయం సాధించారు. ఈసారి భాజపా నుంచి సిటింగ్ ఎంపీ అన్నపూర్ణాదేవి, ఇండియా కూటమి తరఫున సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్, లిబరేషన్) అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో 19శాతం మంది ముస్లింలు, 14 శాతం మంది ఎస్సీలు, 8శాతం మంది ఎస్టీలు ఉన్నారు. ఉద్యోగాల కల్పన, ధరల నియంత్రణ, అభివృద్ధిపై భాజపా ఇచ్చిన హామీలు నెరవేరలేదన్న అసంతృప్తి ఈ ప్రాంతంలో ఉంది. సంప్రదాయ బలంపై భాజపా ఆధారపడుతుండగా.. హేమంత్ సోరెన్పై సానుభూతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఇండియా కూటమి నమ్ముకుంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
ఆమె కోసం హత్య కేసులో ఇరుకున్న దర్శన్.. ఎవరీ పవిత్ర గౌడ..?
-
‘ఐదేళ్లు కళ్లు మూసుకున్నాం.. మరో ఐదేళ్లు కళ్లు మూసుకోండి’ జగన్ కామెంట్స్ వైరల్
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్ వారెంట్
-
చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ
-
సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారుల ప్రయత్నాలు
-
నీ లేఖ నా మనసును హత్తుకుంది: నారా రోహిత్ లేఖకు చంద్రబాబు రిప్లై