వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.
కుమారుడి నియోజకవర్గానికే ఆమె పరిమితం
(జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ)
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆమె తన కుమారుడు దుశ్యంత్ సింగ్ పోటీ చేస్తున్న ఝాలావాడ్-బారా నియోజకవర్గంలో ప్రచారానికే పరిమితమయ్యారు.
- ధోల్పుర్ మాజీ మహారాణి అయిన వసుంధర రాజె ఝాలావాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పటికే నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ఆమె కుమారుడు ఐదోసారి గెలిచి తల్లి రికార్డును సమం చేయాలని చూస్తున్నారు.
- రాష్ట్ర రాజకీయాల్లోకి రాకముందు కేంద్ర మంత్రిగా పని చేసిన వసుంధర 24 నియోజకవర్గాలకు ప్రచారానికే వెళ్లడం లేదు. ఒక్క నియోజకవర్గానికే పరిమితమయ్యారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలైన ఆమెను పార్టీ ప్రచార తారగా కూడా ఎంపిక చేయలేదు. కంటి తుడుపుగా మేనిఫెస్టో కమిటీలో సభ్యురాలిగా వేశారు.
- లోక్సభ ఎన్నికల్లో వసుంధర రాజె మద్దతు దారుల్లో పలువురికి భాజపా టికెట్లు దక్కలేదు. అభ్యర్థుల ఎంపికలో ఆమెను పెద్దగా సంప్రదించలేదు.
- 2019లో దుశ్యంత్ నాలుగో సారి గెలిచాక కేంద్ర పదవి ఇవ్వాలని వసుంధర ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో మోదీ, అమిత్ షాలతో ఆమెకు విభేదాలు తలెత్తాయి.
- గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వసుంధర అనుయాయులు 45 మంది ఎన్నికయ్యారు. అయినా ఆమెను కాదని తొలిసారి ఎమ్మెల్యే అయిన భజన్లాల్ శర్మకు భాజపా అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.
- ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జైపుర్కు వచ్చినప్పుడూ వసుంధరకు అవమానమే ఎదురైంది. ఆమెకు ఒక చిట్టీ ఇచ్చి భజన్లాల్ శర్మ పేరును చదవాల్సిందిగా సూచించారు. అప్పటి నుంచీ ఆమె పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం. -
కమలం కోటతో కాంగ్రెస్ ఢీ
ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో లింగాయత్లు భాజపాకు వెన్నుదన్నుగా ఉంటారు. -
పచ్చని ఎన్నికలు తోడుంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికలు యమజోరుగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. -
పాత తీర్పా? మార్పా?
విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్సభ నియోజకవర్గం ఆదిలాబాద్. -
కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. -
ఓటింగ్కు వడదెబ్బ?
ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఓటేయడానికి ప్రజలు బద్ధకిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. -
పది స్థానాలపై పట్టు బిగించేలా!
రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. -
ఉత్తర కర్ణాటకలో ‘కొత్త’ రాజకీయం
కన్నడనాట లోక్సభ ఎన్నికల మలి విడత పోలింగ్కు ఉత్తర కర్ణాటక సిద్ధమవుతోంది. 14 నియోజకవర్గాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ‘ఉత్తర’లో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు వారసులే. -
తేల్చేది ఆ మూడే!
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్తోపాటు బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లే దాదాపుగా విజేతను తేలుస్తాయి. ఉత్తర్ ప్రదేశ్ను పక్కనబెడితే 25శాతం సీట్లున్న మిగిలిన 3 రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు ఉంటుందనేది చెప్పడం కష్టం. -
‘దశ’ తిరిగేనా..
యాదవుల కోటలో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఓబీసీలు (వీరిలో యాదవులు ఎక్కువ) అధికంగా ఉండే ఉత్తర్ ప్రదేశ్లోని 10 లోక్సభ నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
పాలమూరులో ఎవరిదో పాగా?!
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. -
ప్రచారంలో బలగం
ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్ నేతలు.. ఈ లోక్సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు.
తాజా వార్తలు
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?