యూపీలో కొడితేనే కేంద్రంలో అధికారం
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ ఫలితాలు ఎంత ముఖ్యమో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
చరిత్ర చెబుతున్న సత్యమిదే..!
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్తర్ప్రదేశ్ ఫలితాలు ఎంత ముఖ్యమో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1951 నుంచి 1971 వరకు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో దిల్లీలో సంపూర్ణ మెజార్టీతో జవహర్లాల్ నెహ్రూ, లాల్బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల నేతృత్వంలో పటిష్ఠ ప్రభుత్వాలు ఏర్పడగలిగాయి. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఆత్యయిక పరిస్థితి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అప్పటివరకు యూపీలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్.. 1977లో అక్కడ సున్నాకు పడిపోయి కేంద్రంలో తొలిసారి అధికారాన్ని చేజార్చుకొంది. నాటి ఎన్నికల్లో భారతీయ లోక్దళ్ గుర్తుపై పోటీ చేసిన జనతా పార్టీ యూపీలో 85 సీట్లు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 295 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్కు ఆ ఎన్నికల్లో దక్కిన 154 సీట్లలో అత్యధిక వాటా ఆంధ్రప్రదేశ్(41)దే.
‘బోఫోర్స్’ ఆరోపణలతో..
1980 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీలో మళ్లీ బలపడింది. అక్కడ 51 సీట్లు గెల్చుకోవడంతో.. ఇందిరాగాంధీ నేతృత్వంలో మరోసారి సంపూర్ణ మెజార్టీతో దిల్లీలో అధికారం చేపట్టింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్కు ఏకంగా 83 సీట్లు వచ్చాయి. దాంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ 414 స్థానాలు దక్కించుకొని.. రాజీవ్గాంధీ నేతృత్వంలో స్వతంత్ర భారతదేశంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. రాజీవ్గాంధీ పరిపాలనపై విమర్శలు, బోఫోర్స్ కుంభకోణం ఆరోపణలు చుట్టుముట్టడంతో 1989 నాటికి యూపీలో కాంగ్రెస్ 15 స్థానాలకు పడిపోయింది. దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 197కు పడిపోయింది. కేంద్రంలో సొంతంగా సర్కారును ఏర్పాటుచేయలేని పరిస్థితి వచ్చింది. 143 స్థానాలు గెల్చుకున్న జనతాదళ్.. ఇతర పక్షాల మద్దతుతో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 1989 ఎన్నికల్లో యూపీలో జనతాదళ్ 54 సీట్లు దక్కించుకుంది.
కమలదళం బలపడి..
1991 రాజీవ్గాంధీ హత్యకు ముందే యూపీలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 5 సీట్లకే పరిమితమైంది. భాజపా 51 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రాజీవ్ హత్యానంతరం ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో హస్తం పార్టీకి మంచి ఫలితాలొచ్చాయి. దేశవ్యాప్తంగా అది 232 సీట్లు గెల్చుకొని పీవీ నరసింహారావు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ యూపీలో 5 సీట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 140కి తగ్గింది. ఉత్తర్ప్రదేశ్లో భాజపా ఏకంగా 52 స్థానాలు గెల్చుకొని.. దేశవ్యాప్త బలాన్ని 161కి పెంచుకుంది. వాజ్పేయీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే రెండు వారాల్లోపే ఆ సర్కారు కూలిపోయింది. తర్వాత దేవెగౌడ, ఐకే గుజ్రాల్ల నాయకత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభుత్వాలు మెజార్టీని నిరూపించుకోలేక కూలిపోవడంతో 1998లో జరిగిన ఎన్నికల్లో భాజపా మరోసారి యూపీలో 50కిపైగా సీట్లు గెల్చుకుంది. 182 సీట్లతో దేశంలో వరుసగా రెండోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. నాడు వాజ్పేయీ నేతృత్వంలో ఏర్పడ్డ సర్కారు ఏడాదిన్నరలోపే కూలిపోవడంతో 1999లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఎన్నికల్లో యూపీలో కమలదళం బలం 29కే పరిమితమైనా, మిగిలిన రాష్ట్రాల్లో బలం పుంజుకుంది. దానికితోడు తెలుగుదేశం పార్టీ వంటి పక్షాల మద్దతుతో ఎట్టకేలకు వాజ్పేయీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. 1999 ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీ 29, బీఎస్పీ 14, కాంగ్రెస్ 10 సీట్లు గెల్చుకున్నాయి.
మోదీ హవాతో..
2004 ఎన్నికల్లో భాజపా యూపీలో 10 సీట్లకు పడిపోవడంతో దేశవ్యాప్తంగా దాని సంఖ్యాబలం 138కి పరిమితమైంది. యూపీలోని ప్రధాన పార్టీలుగా అవతరించిన ఎస్పీ, బీఎస్పీల సహకారంతో మన్మోహన్సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2009లో ఉత్తర్ప్రదేశ్లో 21 సీట్లు దక్కించుకొని.. కాంగ్రెస్ మరోసారి సంకీర్ణ సర్కారును ఏర్పాటుచేయగలిగింది. 2014, 2019ల్లో మోదీ హవా కారణంగా భాజపా యూపీలో తిరుగులేని సంఖ్యలో సీట్లు గెలుచుకొని.. కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM