ప్రతిష్ఠాత్మకం.. పక్కా వ్యూహం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి.
క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు
కీలకంగా వార్రూంలు..
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. క్షేత్ర స్థాయి కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బూత్స్థాయి నుంచి పకడ్బందీగా వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాయి. వివిధ ప్రత్యేక విభాగాలను క్రియాశీలం చేయడంతోపాటు అంతర్గత వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి.
బూత్ కమిటీలకు దిశానిర్దేశం
ఎన్నికల్లో అత్యంత కీలకం బూత్ కమిటీలే. ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకూ తీసుకెళ్లేవి ఇవే. దీంతో వీటిపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. రాష్ట్రంలో 35 వేలకుపైగా బూత్లు ఉండగా.. ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో సుమారు 33 వేల బూత్ కమిటీల చొప్పున పనిచేస్తున్నాయి. వీటిపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగేలా అన్ని పార్టీలు యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ల ద్వారా బూత్ కమిటీల కార్యక్రమాలను పరిశీలించే బాధ్యతను ఆ యంత్రాంగం నిర్వహిస్తోంది. కాంగ్రెస్, భాజపాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి బూత్ కమిటీల సమావేశాలను నిర్వహించి పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశాయి. బూత్ కమిటీలు ఇచ్చే సమాచారంతోనే క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసుకుంటూ..లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అధిష్ఠానాలు ముందుకెళ్తున్నాయి.
ఆ నివేదికలే కీలకం..
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసుకున్న వార్ రూంలను పార్టీలు వ్యూహాల అమలుకు వినియోగిస్తున్నాయి. పార్టీ నేతలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్న స్వతంత్ర వ్యవస్థలు అయిన వార్ రూంలు పార్టీలకు బాగా ఉపకరిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీలకు వివరించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి. పార్టీకి సానుకూలతలు ఏమిటి? వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న అంశాలు, అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, పార్టీ నేతల వ్యవహారశైలి, ప్రచారానికి దూరంగా ఉంటున్న కీలక నేతలు, ప్రత్యర్థి పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సహా ఏ రోజుకారోజు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై కీలక నేతలకు నివేదికలను అందజేస్తున్నాయి. వాటి ఆధారంగా వారు పరిస్థితిని చక్కదిద్దుకుంటూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
ప్రత్యేకంగా వ్యూహ కమిటీలు
ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా వ్యూహ (స్ట్రాటజీ) కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ రోజువారీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఉన్న కీలక నాయకులతో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్, భారాస ముఖ్య నేతలతో వ్యూహ కమిటీలు తరచూ సమావేశమవుతూ పార్టీ బలాబలాలు, ప్రభావితం చూపుతున్న అంశాలు, దృష్టిసారించాల్సిన అంశాలను వివరిస్తున్నాయి. వీటితోపాటు ఎన్నికల నిర్వహణ కమిటీలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ కమిటీల బాధ్యులు మూణ్నాలుగు రోజులకోసారి బూత్ కమిటీలు, మండల, అసెంబ్లీ, లోక్సభ స్థానాల వారీగా ఉన్న బాధ్యులతో చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు.
చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు
ప్రతి పార్టీ ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ విభాగాలను నిర్వహిస్తోంది. వందలమందితో పనిచేస్తున్న ఈ విభాగాలు పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థుల ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంలో చివరిదే గానీ.. చిన్నది కాదు: ప్రజల మాటే ఈ ‘నోటా’
ఎన్నికల్లో అభ్యర్థులందరూ అందరే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏకైక ఆయుధం నోటా. 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజలు దీనిని వాడారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం. -
కమలం కోటతో కాంగ్రెస్ ఢీ
ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో లింగాయత్లు భాజపాకు వెన్నుదన్నుగా ఉంటారు. -
పచ్చని ఎన్నికలు తోడుంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికలు యమజోరుగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. -
పాత తీర్పా? మార్పా?
విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్సభ నియోజకవర్గం ఆదిలాబాద్. -
కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. -
ఓటింగ్కు వడదెబ్బ?
ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఓటేయడానికి ప్రజలు బద్ధకిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. -
పది స్థానాలపై పట్టు బిగించేలా!
రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. -
ఉత్తర కర్ణాటకలో ‘కొత్త’ రాజకీయం
కన్నడనాట లోక్సభ ఎన్నికల మలి విడత పోలింగ్కు ఉత్తర కర్ణాటక సిద్ధమవుతోంది. 14 నియోజకవర్గాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ‘ఉత్తర’లో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు వారసులే. -
తేల్చేది ఆ మూడే!
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్తోపాటు బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లే దాదాపుగా విజేతను తేలుస్తాయి. ఉత్తర్ ప్రదేశ్ను పక్కనబెడితే 25శాతం సీట్లున్న మిగిలిన 3 రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు ఉంటుందనేది చెప్పడం కష్టం. -
‘దశ’ తిరిగేనా..
యాదవుల కోటలో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఓబీసీలు (వీరిలో యాదవులు ఎక్కువ) అధికంగా ఉండే ఉత్తర్ ప్రదేశ్లోని 10 లోక్సభ నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
పాలమూరులో ఎవరిదో పాగా?!
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.
తాజా వార్తలు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!