ప్రతిష్ఠాత్మకం.. పక్కా వ్యూహం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి.
క్రియాశీలకంగా ప్రత్యేక విభాగాలు
కీలకంగా వార్రూంలు..
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక ఎన్నికలు కావడంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అప్పటి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నాయి. ప్రతి అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. క్షేత్ర స్థాయి కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ బూత్స్థాయి నుంచి పకడ్బందీగా వ్యూహాలను రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నాయి. వివిధ ప్రత్యేక విభాగాలను క్రియాశీలం చేయడంతోపాటు అంతర్గత వ్యూహాలను పక్కాగా అమలు చేస్తున్నాయి.
బూత్ కమిటీలకు దిశానిర్దేశం
ఎన్నికల్లో అత్యంత కీలకం బూత్ కమిటీలే. ఓటర్లను పోలింగ్ కేంద్రం వరకూ తీసుకెళ్లేవి ఇవే. దీంతో వీటిపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. రాష్ట్రంలో 35 వేలకుపైగా బూత్లు ఉండగా.. ప్రధాన పార్టీల ఆధ్వర్యంలో సుమారు 33 వేల బూత్ కమిటీల చొప్పున పనిచేస్తున్నాయి. వీటిపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగేలా అన్ని పార్టీలు యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ల ద్వారా బూత్ కమిటీల కార్యక్రమాలను పరిశీలించే బాధ్యతను ఆ యంత్రాంగం నిర్వహిస్తోంది. కాంగ్రెస్, భాజపాలు ఇప్పటికే రాష్ట్ర స్థాయి బూత్ కమిటీల సమావేశాలను నిర్వహించి పార్టీ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశాయి. బూత్ కమిటీలు ఇచ్చే సమాచారంతోనే క్షేత్ర స్థాయిలో పార్టీ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసుకుంటూ..లోటుపాట్లను సరిదిద్దుకుంటూ అధిష్ఠానాలు ముందుకెళ్తున్నాయి.
ఆ నివేదికలే కీలకం..
రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసుకున్న వార్ రూంలను పార్టీలు వ్యూహాల అమలుకు వినియోగిస్తున్నాయి. పార్టీ నేతలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్న స్వతంత్ర వ్యవస్థలు అయిన వార్ రూంలు పార్టీలకు బాగా ఉపకరిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని పార్టీలకు వివరించడంలో ఇవి కీలక భూమిక పోషిస్తున్నాయి. పార్టీకి సానుకూలతలు ఏమిటి? వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న అంశాలు, అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్న విధానం, పార్టీ నేతల వ్యవహారశైలి, ప్రచారానికి దూరంగా ఉంటున్న కీలక నేతలు, ప్రత్యర్థి పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సహా ఏ రోజుకారోజు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులపై కీలక నేతలకు నివేదికలను అందజేస్తున్నాయి. వాటి ఆధారంగా వారు పరిస్థితిని చక్కదిద్దుకుంటూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.
ప్రత్యేకంగా వ్యూహ కమిటీలు
ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా వ్యూహ (స్ట్రాటజీ) కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ రోజువారీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా ఉన్న కీలక నాయకులతో ఈ కమిటీలు పనిచేస్తున్నాయి. భాజపా, కాంగ్రెస్, భారాస ముఖ్య నేతలతో వ్యూహ కమిటీలు తరచూ సమావేశమవుతూ పార్టీ బలాబలాలు, ప్రభావితం చూపుతున్న అంశాలు, దృష్టిసారించాల్సిన అంశాలను వివరిస్తున్నాయి. వీటితోపాటు ఎన్నికల నిర్వహణ కమిటీలు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ కమిటీల బాధ్యులు మూణ్నాలుగు రోజులకోసారి బూత్ కమిటీలు, మండల, అసెంబ్లీ, లోక్సభ స్థానాల వారీగా ఉన్న బాధ్యులతో చర్చిస్తూ ముందుకు వెళ్తున్నారు.
చురుగ్గా సామాజిక మాధ్యమాల విభాగాలు
ప్రతి పార్టీ ప్రత్యేకంగా సామాజిక మాధ్యమ విభాగాలను నిర్వహిస్తోంది. వందలమందితో పనిచేస్తున్న ఈ విభాగాలు పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థుల ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్