ఓట్ల ‘దక్షిణ’ ఎవరికో?
దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది.
కన్నడనాట పోరు రసవత్తరం
కొత్త నాయకులను విజయం వరించేనా..
ద్విముఖ పోటీలో పైచేయి ఎవరిది?
26న 14 నియోజకవర్గాల్లో పోలింగ్
ఈనాడు, బెంగళూరు: దేశవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఈ నెల 26వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా, జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి. కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది. భౌగోళిక, సామాజిక పరిస్థితుల పరంగా చూస్తే ఉత్తర కర్ణాటకకు భిన్నమైనది దక్షిణ కర్ణాటక ప్రాంతం. ఇక్కడ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలూ భిన్నంగానే ఉంటాయి. ఆ కారణంగా పార్టీలు ఈ ప్రాంతానికి ప్రత్యేక వ్యూహాన్ని రచించి వాటిని ఆచరణలో పెడుతుంటాయి.
నియోజక వర్గాలు
ఉడుపి-చిక్కమగళూరు, హాసన, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ (ఎస్సీ), తుమకూరు, మండ్య, మైసూరు-కొడగు, చామరాజనగర (ఎస్సీ), బెంగళూరు గ్రామీణం, బెంగళూరు ఉత్తర, బెంగళూరు కేంద్ర, బెంగళూరు దక్షిణ, చిక్కబళ్లాపుర, కోలారు (ఎస్సీ)
కొత్తవారి జోరు
పొత్తు కారణంగా కోలారు, హాసన, మండ్య స్థానాలను జేడీఎస్కు వదిలేసి మిగిలిన 11 చోట్ల భాజపా పోటీ చేస్తోంది. ఇందులో 8 మంది సిటింగ్లను పక్కనబెట్టింది. ఉడుపి- చిక్కమగళూరు సిటింగ్ ఎంపీ శోభా కరంద్లాజెను బెంగళూరు ఉత్తరకు మార్చింది. మొత్తం 10 చోట్ల కొత్తవారు పోటీ చేస్తుండగా, నలుగురు సిటింగ్లు మరోసారి బరిలో దిగారు.
ప్రభావిత అంశాలు..
2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలే ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రధాన బలం. రాష్ట్రవ్యాప్తంగా ఈ గ్యారంటీలను అమలు చేసిన ఆ పార్టీకి ప్రధాని మోదీ ప్రభావం ఎప్పటిలాగే గట్టి పోటీ ఇవ్వనుంది.
- ఈ ఏడాది రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న కరవు పరిస్థితులు భాజపాకు అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. కరవు పరిహారం కోసం రాష్ట్ర సర్కారు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించినా ఇంతవరకూ సాయం చేయలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు, జీఎస్టీ పరిహారం చెల్లించలేదని అంటోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నివేదికలు ఇవ్వలేదని, రాష్ట్రానికి చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన ఆర్థిక సంఘం తుది నివేదికలో లేదని కేంద్ర సర్కారు వాదిస్తోంది. ఈ అంశాలే ప్రచారంలో కీలకంగా మారాయి.
- బెంగళూరుకు తాగునీరు లేకున్నా తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం, ఇక్కడి మౌలిక సదుపాయాలు, పాత మైసూరు ప్రాంతంలోని 4 స్థానాల్లో జేడీఎస్, భాజపాల పొత్తు, ఒక్కలిగ ఓటర్లు, బెంగళూరులో బాంబుల మోత, హిందువులపై దాడులు ఈ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి.
కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదీ..
కోలారు
కోలారు కాంగ్రెస్కు గట్టి పట్టున్న ప్రాంతమే అయినా 2019లో భాజపా గెలిచింది. ఇక్కడి నుంచి గతంలో 6సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి కేహెచ్ మునియప్ప గత ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈసారి టికెట్ తన అల్లుడికి ఇప్పించుకోవాలని ఆయన చివరి వరకూ పోరాడినా పార్టీలో విభేదాల కారణంగా బయటి వ్యక్తికి దక్కింది. బెంగళూరుకు చెందిన కేవీ గౌతమ్కు టికెట్ రాగా.. ఆయనకు మునియప్ప వర్గం నుంచి మద్దతు కరవైంది. జేడీఎస్ నుంచి అంతగా పేరులేని మల్లేశ్ బాబుకు టికెట్ దక్కింది. సిటింగ్ ఎంపీ మునిస్వామితోపాటు భాజపా నేతల మద్దతుపై ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. తాగునీరు, నిలిచిపోయిన బంగారు గనుల తవ్వకం, ఉపాధి, కాలుష్యం, మౌలిక వసతులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.
ఓటర్లు: 16,31,850
బెంగళూరు గ్రామీణం
కాంగ్రెస్, భాజపాల్లోని కీలక నేతల వ్యక్తిగత ప్రతిష్ఠకు బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం వేదిక. ఇక్కడ గత 17 ఎన్నికల్లో 13 సార్లు కాంగ్రెస్, 3 సార్లు జేడీఎస్, ఒకసారి భాజపా గెలిచాయి. అభ్యర్థులిద్దరూ ఒక్కలిగ వర్గానికి చెందినవారు కావడం.. ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ సోదరుడు డీకే సురేశ్తో మాజీ ప్రధాని దేవెగౌడ అల్లుడు మంజునాథ్ పోటీ పడుతుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. రాజకీయ అనుభవం లేకపోవడం మంజునాథ్ బలహీనత కాగా, మోదీ ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థికి అడ్డంకిగా మారనుంది.
ఓటర్లు: 27,63,910
మండ్య
మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి బరిలో ఉండటంతో ఇక్కడ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఒక్కలిగల సామ్రాజ్యంగా పరిగణించే మండ్యలో 2004 వరకూ కాంగ్రెస్ అప్రతిహతంగా విజయం సాధిస్తూ వచ్చింది. 2009 నుంచి జేడీఎస్కు ఇది కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ రాజకీయ అరంగేట్రం చేసినా స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఓడిపోయారు. భాజపాతో పొత్తులో భాగంగా ఈసారి కుమార స్వామి నేరుగా బరిలోకి దిగారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బిలియనీర్ వెంకటరమణ గౌడ పోటీ చేస్తున్నారు. దాదాపు 8 లక్షలకు పైగా ఒక్కలిగ ఓట్లున్న ఈ స్థానంలో గెలుపు ఎన్డీయే నేతలకు ఎంతో కీలకం.
ఓటర్లు: 17,10,901
మైసూరు-కొడగు
మైసూరు మహారాజుల వంశస్థుడు, సాధారణ కార్యకర్త మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. మైసూరు యువరాజు యదువీర్ ఒడెయార్ స్వయంగా బరిలోకి దిగడంతో ఈ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత జిల్లా కావడంతో ఈ స్థానంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాదాపు 4.7 లక్షల మంది ఒక్కలిగలున్న ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 47ఏళ్ల తర్వాత ఆ వర్గానికి టికెట్ ఇచ్చింది. రాజ వంశీకులు సాధారణ రాజకీయ నేతగా రాణిస్తారా.. అని ఓటర్లింకా సంశయంతోనే ఉన్నా అవినీతికి పాల్పడక పారదర్శకంగా వ్యవహరిస్తారన్న విశ్వాసం ప్రజలకు ఉండటం యదువీర్ బలం.
ఓటర్లు: 20,92,222
హాసన
జేడీఎస్ అధినేత హెచ్.డి.దేవెగౌడ రాజకీయ పుట్టిల్లుగా పరిగణించే హాసనలో పోటీ రసవత్తరంగా మారింది. ఇదే స్థానం నుంచి వరుసగా 5 సార్లు గెలిచిన దేవెగౌడ 2019లో మనవడి కోసం త్యాగం చేశారు. ఈసారి ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. దేవెగౌడతో గతంలో పోటీ పడిన పుట్టస్వామి గౌడ మనవడు శ్రేయస్ పాటిల్ తలపడుతున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ ఉద్దండుల వారసులు ఈసారి పోటీ చేస్తుండటం ఆసక్తికరం. 2019 లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ సాధించిన ఏకైక స్థానం హాసనే. ఇక్కడ భాజపా, జేడీఎస్ కార్యకర్తలు బద్ధ శత్రువులుగా ఉంటారు. ఈ పార్టీలు ఇప్పుడు మిత్రులుగా మారడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ రెండు పార్టీల కుమ్ములాట నుంచి కాంగ్రెస్ లాభపడే అవకాశం లేకపోలేదు.
ఓటర్లు: 17,24,908
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
- ప్రాంతాలు: దక్షిణ కర్ణాటక, పాత మైసూరు, కరావళి
- లోక్సభ స్థానాలు: 14
- మొత్తం ఓటర్లు: 2,85,42,534
రెండో విడత ఎన్నికలు జరిగే నియోజక వర్గాలు
2019 ఫలితాలు
- భాజపా: 11
- కాంగ్రెస్: 1, జేడీఎస్: 1
- స్వతంత్రులు: 1
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంలో చివరిదే గానీ.. చిన్నది కాదు: ప్రజల మాటే ఈ ‘నోటా’
ఎన్నికల్లో అభ్యర్థులందరూ అందరే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏకైక ఆయుధం నోటా. 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజలు దీనిని వాడారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం. -
కమలం కోటతో కాంగ్రెస్ ఢీ
ముంబయి మరాఠాలు, హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో లింగాయత్లు భాజపాకు వెన్నుదన్నుగా ఉంటారు. -
పచ్చని ఎన్నికలు తోడుంటే..
దేశవ్యాప్తంగా ఎన్నికలు యమజోరుగా సాగుతున్నాయి. భారీ ర్యాలీలు, సభలతో నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. -
పాత తీర్పా? మార్పా?
విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్సభ నియోజకవర్గం ఆదిలాబాద్. -
కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. -
ఓటింగ్కు వడదెబ్బ?
ఎన్నికల్లో ఓటింగ్ను పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఓటేయడానికి ప్రజలు బద్ధకిస్తున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. -
పది స్థానాలపై పట్టు బిగించేలా!
రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. -
ఉత్తర కర్ణాటకలో ‘కొత్త’ రాజకీయం
కన్నడనాట లోక్సభ ఎన్నికల మలి విడత పోలింగ్కు ఉత్తర కర్ణాటక సిద్ధమవుతోంది. 14 నియోజకవర్గాల్లో మే 7న పోలింగ్ జరగనుంది. దక్షిణ కర్ణాటకతో పోలిస్తే ‘ఉత్తర’లో భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు వారసులే. -
తేల్చేది ఆ మూడే!
కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ముఖ్యమైన రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్తోపాటు బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లే దాదాపుగా విజేతను తేలుస్తాయి. ఉత్తర్ ప్రదేశ్ను పక్కనబెడితే 25శాతం సీట్లున్న మిగిలిన 3 రాష్ట్రాల్లో ఏ పార్టీకి మొగ్గు ఉంటుందనేది చెప్పడం కష్టం. -
‘దశ’ తిరిగేనా..
యాదవుల కోటలో మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. ఓబీసీలు (వీరిలో యాదవులు ఎక్కువ) అధికంగా ఉండే ఉత్తర్ ప్రదేశ్లోని 10 లోక్సభ నియోజకవర్గాలకు మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
పాలమూరులో ఎవరిదో పాగా?!
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.
తాజా వార్తలు
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!