ఇంతింతై వటుడింతై..!
భారతీయ జనతా పార్టీ (భాజపా) తన తొలి సార్వత్రిక సమరంలో పోరాడి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది.
2 నుంచి 303 సీట్లకు ఎదిగిన భాజపా
ఈనాడు, దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) తన తొలి సార్వత్రిక సమరంలో పోరాడి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ, సికింద్రాబాద్ స్థానాల్లో బరిలో దిగిన కమలదళం.. హనుమకొండలో గెలిచింది. అక్కడ పార్టీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుపై 54,198 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్లో టి.అంజయ్య (కాంగ్రెస్) చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మెహ్సాణా.
రాష్ట్రాలపై పట్టు బిగించి..
గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్కు భాజపా సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (29.99%), రాజస్థాన్ (23.69%), హిమాచల్ప్రదేశ్ (23.27%), దిల్లీ (18.85%)ల్లోనూ మెరుగ్గా ఓట్లు రాబట్టుకుంది. మహారాష్ట్రలో 10.07%, హరియాణాలో 7.54%, మణిపుర్లో 6.96%, బిహార్లో 6.92%, ఉత్తర్ప్రదేశ్లో 6.42%, కర్ణాటకలో 4.68%, పంజాబ్లో 3.39%, కేరళలో 1.75%, ఒడిశాలో 1.18%, త్రిపురలో 0.77%, తమిళనాడులో 0.07%, పశ్చిమబెంగాల్లో 0.40%, అస్సాంలో 0.37% ఓట్లు దక్కించుకుంది. క్రమంగా బలం పెంచుకుంటూ.. 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్లలో, 1991లో ఉత్తర్ప్రదేశ్లో, 1993లో దిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్ర(శివసేనతో కలిసి)లలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలిగింది. తొలి ఎన్నికల్లో 10%కిపైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కాషాయ దళం తొలి పదేళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటుచేసి రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది.
ఆరెస్సెస్ అండ
భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మదృష్టితోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. కమలదళం స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికనూ ఒక సవాల్గా తీసుకొని పోరాడింది. ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో, మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.
రామ జన్మభూమి ఉద్యమంతో..
గత నాలుగు దశాబ్దాల్లో కమలదళం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్లో హిమాచల్లోని పాలంపుర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని 1990 సెప్టెంబరు 25న ఎల్కే ఆడ్వాణీ గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబరు 23న బిహార్లోని సమస్తీపుర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. ఆడ్వాణీని అరెస్ట్ చేసి 5 వారాలపాటు నిర్బంధించింది. అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి యూపీ ఎన్నికల్లో కనిపించింది. అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కల్యాణ్సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది.
కేంద్ర సర్కారు ఏర్పాటు స్థాయికి..
1984 నుంచి 2004 వరకు వాజ్పేయీ, ఆడ్వాణీ భాజపాను ముందుండి నడిపించారు. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు. ఆ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకొని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఓటుబ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా, సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ఠ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి, అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలచుకుంటూ ఓట్లు రాబట్టుకొనే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.
మోదీ రాకతో ఉరకలు
2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్పేయీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి ఆడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం 20%లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం.. 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004-2014 మధ్య కాంగ్రెస్ చేసిన పొరపాట్లు, 2జీ, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, దిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని భాజపాను దిల్లీ పీఠంవైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్