ఇంతింతై వటుడింతై..!
భారతీయ జనతా పార్టీ (భాజపా) తన తొలి సార్వత్రిక సమరంలో పోరాడి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది.
2 నుంచి 303 సీట్లకు ఎదిగిన భాజపా
ఈనాడు, దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) తన తొలి సార్వత్రిక సమరంలో పోరాడి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో తొలిసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ, సికింద్రాబాద్ స్థానాల్లో బరిలో దిగిన కమలదళం.. హనుమకొండలో గెలిచింది. అక్కడ పార్టీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావుపై 54,198 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సికింద్రాబాద్లో టి.అంజయ్య (కాంగ్రెస్) చేతిలో బండారు దత్తాత్రేయ 8,474 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో భాజపా గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మెహ్సాణా.
రాష్ట్రాలపై పట్టు బిగించి..
గుజరాత్లో 1984లో 18.64% ఓట్లతో కాంగ్రెస్కు భాజపా సవాలు విసిరింది. ఆ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (29.99%), రాజస్థాన్ (23.69%), హిమాచల్ప్రదేశ్ (23.27%), దిల్లీ (18.85%)ల్లోనూ మెరుగ్గా ఓట్లు రాబట్టుకుంది. మహారాష్ట్రలో 10.07%, హరియాణాలో 7.54%, మణిపుర్లో 6.96%, బిహార్లో 6.92%, ఉత్తర్ప్రదేశ్లో 6.42%, కర్ణాటకలో 4.68%, పంజాబ్లో 3.39%, కేరళలో 1.75%, ఒడిశాలో 1.18%, త్రిపురలో 0.77%, తమిళనాడులో 0.07%, పశ్చిమబెంగాల్లో 0.40%, అస్సాంలో 0.37% ఓట్లు దక్కించుకుంది. క్రమంగా బలం పెంచుకుంటూ.. 1990లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్లలో, 1991లో ఉత్తర్ప్రదేశ్లో, 1993లో దిల్లీలో, 1995లో గుజరాత్, మహారాష్ట్ర(శివసేనతో కలిసి)లలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలిగింది. తొలి ఎన్నికల్లో 10%కిపైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కాషాయ దళం తొలి పదేళ్లలోనే ప్రభుత్వాలు ఏర్పాటుచేసి రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది.
ఆరెస్సెస్ అండ
భాజపా ఎదుగుదలకు ఆ పార్టీ సూక్ష్మదృష్టితోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత బలం బాగా కలిసొచ్చింది. కమలదళం స్థానిక కుల, మత, ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికనూ ఒక సవాల్గా తీసుకొని పోరాడింది. ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగానో, మిత్రపక్షాలతో కలిసో ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.
రామ జన్మభూమి ఉద్యమంతో..
గత నాలుగు దశాబ్దాల్లో కమలదళం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే. ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని 1989 జూన్లో హిమాచల్లోని పాలంపుర్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని 1990 సెప్టెంబరు 25న ఎల్కే ఆడ్వాణీ గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు. అక్టోబర్ 30 నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబరు 23న బిహార్లోని సమస్తీపుర్లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. ఆడ్వాణీని అరెస్ట్ చేసి 5 వారాలపాటు నిర్బంధించింది. అది దేశవ్యాప్తంగా భాజపా విస్తరణకు బాటలు వేసింది. దాని ఫలితం 1991 నాటి యూపీ ఎన్నికల్లో కనిపించింది. అక్కడ భాజపా తొలిసారి విజయం సాధించి కల్యాణ్సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలిగింది.
కేంద్ర సర్కారు ఏర్పాటు స్థాయికి..
1984 నుంచి 2004 వరకు వాజ్పేయీ, ఆడ్వాణీ భాజపాను ముందుండి నడిపించారు. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టారు. ఆ పార్టీ ఆధిపత్యానికి గండికొట్టారు. తర్వాత హిందుత్వవాదాన్ని భుజాన వేసుకొని భాజపా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఓటుబ్యాంకును పెంచుకుంది. వ్యక్తులపై ఆధారపడకుండా, సంస్థాగతంగా బలోపేతమైంది. తన వ్యూహాలను, భావాలను ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లేలా అంతర్గతంగా పటిష్ఠ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసుకుంది. ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి, అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలచుకుంటూ ఓట్లు రాబట్టుకొనే నేర్పు సాధించింది. 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేయగలిగింది.
మోదీ రాకతో ఉరకలు
2004 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. ఆపై అనారోగ్యంతో వాజ్పేయీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. అప్పట్నుంచి ఆడ్వాణీ ఒంటరి పోరాటం చేశారు. అయితే 2009 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతం 20%లోపునకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన భాజపా నాయకత్వం.. 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకొచ్చి దూకుడు ప్రదర్శించడంతో ఆ పార్టీకి తిరుగులేని విజయాలు దక్కాయి. 2004-2014 మధ్య కాంగ్రెస్ చేసిన పొరపాట్లు, 2జీ, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాలు, అన్నా హజారే చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, దిల్లీలో నిర్భయ ఘటన వంటివి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆ అవకాశాన్ని ఒడిసిపట్టుకొని భాజపాను దిల్లీ పీఠంవైపు మోదీ సులభంగా నడిపించగలిగారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి భాజపాకు ప్రత్యామ్నాయం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరికో ‘వరం’గల్..!
సాంస్కృతిక రాజధాని.. పర్యాటక కేంద్రాల నిలయం.. కాకతీయులు ఏలిన గడ్డ ఓరుగల్లులో లోక్సభ పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్లో ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో త్రిముఖపోరు నెలకొంది. -
గులాబీకి.. సవాలే
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమిపాలైన భారాసకి.. వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికలు సవాలుగా మారాయి. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్
మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. -
కులం చూసి.. టికెట్ కేటాయింపు!
అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు. -
కీలక నేతలకు అగ్ని పరీక్ష
కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు. -
చిన్న నియోజకవర్గాల్లో పెద్ద పోరు
దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. -
కంచుకోటలో కొత్త గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ 2004 నుంచి వరుసగా మూడుసార్లు తాను ప్రాతినిధ్యం వహించిన అమేఠీ సీటును కాదని ఇప్పుడు రాయ్బరేలీని ఎంచుకోవడంతో అందరి దృష్టీ ఆ నియోజకవర్గంపైకి మళ్లింది. -
మెతుకు సీమలో మెరిసేదెవరో..?
మంజీర నీటితో రాజధాని గొంతులో అమృతాన్ని నింపిన సింగూరు డ్యాం.. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్చెరు.. ప్రఖ్యాత చర్చి.. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తూ.. ‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. -
ప్రచారం వాడీ…వేడిగా
‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది. -
ఈవీఎంలో చివరిదే గానీ.. చిన్నది కాదు: ప్రజల మాటే ఈ ‘నోటా’
ఎన్నికల్లో అభ్యర్థులందరూ అందరే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు ఏకైక ఆయుధం నోటా. 2019 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజలు దీనిని వాడారు. ఈసారి ఎన్నికల్లో ఇది మరింత పదునెక్కే అవకాశం ఉంది. -
కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీలో హోరాహోరీ.. రాహుల్ వర్సెస్ దినేశ్..!
రాహుల్ రాయ్బరేలీ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గాంధీ కుటుంబం తమ కంచుకోటలోని ‘పంచవటి’ నేతతో తలపడనుంది. -
హస్తానికి తిరుగుబాటు తలపోట్లు
పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు మిత్రపక్షాలతో కలిసి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్సింగ్ లవ్లీ ఇటీవల షాకిచ్చారు. -
ఈవీఎంలో ఓటెలా పడుతుందంటే..
ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత. దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలన్నా.. ప్రగతిపథాన పయనించాలన్నా ప్రతి ఓటరూ తన విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడం అత్యంత కీలకం. -
దిగ్గజాల బరి
మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాల పోటీ నడుమ మధ్యప్రదేశ్లోని 9 నియోజకవర్గాలు మూడో విడతలో భాగంగా 7వ తేదీన పోలింగ్కు సిద్ధమవుతున్నాయి. -
భువనగిరి కోట ఎవరి పరం..!
భువనగిరి లోక్సభ స్థానం ఎన్నిక ఆసక్తికరంగా ఉంది. పట్టు బిగించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత అభ్యర్థి గత ఎన్నికల్లో ఓటమి పొందడాన్ని సానుభూతిగా మలుచుకునేందుకు భాజపా కసరత్తు చేస్తోంది. -
‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు. -
నాకు చెప్పకుండానే ఎంపీ టికెట్.. ఒకప్పటి మోదీ స్థానంలో మన్కీబాత్ కుర్రాడు..!
ఎనిమిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీబాత్లో ఓ యువ కళాకారుడి పేరు ప్రస్తావించారు. తాజాగా ఆ కుర్రాడికే ఒకప్పుడు తాను పోటీ చేసిన వడోదర టికెట్ ఇచ్చారు. -
‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు. -
ఖర్చు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ధన సునామీ దిశగా 2024 ఎన్నికలు..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు భారత్లో జరుగుతున్నాయి. ఈసారి ఖర్చులు సరికొత్త రికార్డులు సృష్టించనున్నట్లు పరిస్థితులు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఎన్నికల్లో ట్రెండ్ ఎలా మారుతోందో చూద్దాం..! -
అన్నదాతే గెలుపు నిర్ణేత
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం.. భారీ సంఖ్యలో అభ్యర్థులు, అందులో అత్యధికంగా రైతులు బరిలోకి దిగి 2019 ఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించిన స్థానం.
తాజా వార్తలు
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
-
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం