ఆ ముగ్గురికీ అగ్నిపరీక్షే!
కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ప్రధానంగా ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్షలా మారాయి. వారు- పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి, భాజపా రాష్ట్ర సారథి బి.వై.విజయేంద్ర. మూడు పార్టీల్లోనూ వారికి ప్రస్తుతం సీనియర్లు తోడున్నా.
కన్నడనాట మెరుగైన ఫలితాలపై మూడు పార్టీల రాష్ట్రాధ్యక్షుల కన్ను
ఈనాడు, బెంగళూరు
కర్ణాటకలో లోక్సభ ఎన్నికలు ప్రధానంగా ముగ్గురు నాయకులకు అగ్నిపరీక్షలా మారాయి. వారు- పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి, భాజపా రాష్ట్ర సారథి బి.వై.విజయేంద్ర. మూడు పార్టీల్లోనూ వారికి ప్రస్తుతం సీనియర్లు తోడున్నా.. ఈ ఎన్నికల్లో తమ పక్షాల జయాపజయాలకు ప్రధానంగా బాధ్యత వహించబోయేది మాత్రం వీరేనన్నది సుస్పష్టం. భవిష్యత్తులో తాము పార్టీలను సమర్థంగా నడిపించగలమన్న విశ్వాసాన్ని ఆయా పక్షాల అధిష్ఠానాల్లో, ప్రజల్లో కల్పించాలంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు రాబట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ ముగ్గురికీ తెలుసు.
ఆశల పల్లకిలో డీకే
నిరుటి కర్ణాటక విధానసభ ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో పోటీ చేయగలుగుతోందంటే అందుకు కారణం- కన్నడనాట అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయమేనంటే అతిశయోక్తి కాదు. ఆ విజయంలో శివకుమార్ పాత్ర అత్యంత కీలకం. ఆయనపై అధిష్ఠానానికి అపార విశ్వాసం. 61 ఏళ్ల డీకే సీఎం పదవి కోసం నిరుడు సిద్ధరామయ్యతో తొలుత పోటీపడ్డారు. అయితే అధిష్ఠానం సూచనతో తాను తర్వాత వెనక్కి తగ్గినట్లు స్వయంగా పలు సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతం 78 ఏళ్ల సిద్ధరామయ్య రాజకీయ విశ్రాంతి దశకు చేరువయ్యారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టగలిగితే సీఎం సీటు డీకేకు దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒకేఒక్క స్థానానికి పరిమితమైన కాంగ్రెస్కు ఈసారి కనీసం 15 చోట్ల విజయం కట్టబెట్టేలా డీకే ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఒక్కలిగలకు తానే భవిష్యత్తు నాయకుడినని, ముఖ్యమంత్రి పదవి తన హక్కు అని ఆయన తరచూ చెబుతుంటారు. అయితే సిద్ధరామయ్య శిబిరంలోని ఎం.బి.పాటిల్, సతీశ్ జార్ఖిహొళి, కె.రాజణ్ణ, కె.జె.జార్జి, రామలింగారెడ్డిల నుంచి అంతగా సహకారం దక్కకపోవడం, బెంగళూరు ప్రాంతానికే పరిమితమైన నేతగా ముద్రపడటం డీకేకు ప్రతికూలాంశాలు. ఎన్నికల తర్వాత అధికార పంపిణీ అనివార్యమై.. దళిత, అహింద నాయకులకు సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ జోరందుకుంటే మాత్రం డీకేకు ఇబ్బందే.
కుమారస్వామి గురి కుదిరేనా!
కన్నడనాట ఈసారి జేడీఎస్ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ మూడింటినీ గెల్చుకోవడంతోపాటు పార్టీకి పట్టున్న చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ, తుమకూరు, బెంగళూరు గ్రామీణ, మైసూరుల్లోనూ ఎన్డీయే అభ్యర్థులను గెలిపించడం 64 ఏళ్ల హెచ్డీ కుమారస్వామి ముందున్న సవాల్. అప్పుడే ఆయన పేరు మారుమోగుతుంది. ప్రస్తుతానికి జేడీఎస్ ప్రచార బాధ్యతలను పార్టీ జాతీయాధ్యక్షుడు దేవెగౌడ మోస్తున్నారు. ఆయన తర్వాత పార్టీని నడిపించాల్సింది కుమారస్వామే. ఆయన సోదరుడు హెచ్.డి.రేవణ్ణ నాయకత్వం హాసన జిల్లాకే పరిమితం. తన కుమారుడు నిఖిల్గౌడను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కుమారస్వామి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో తనపై విశ్వాసాన్ని పెంచాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం కుమారస్వామికి అత్యావశ్యకం. గత ఎన్నికల్లో ఒకేఒక్క స్థానానికి పరిమితమైన జేడీఎస్ ఇప్పుడు రెండింట గెలిచినా కుమారస్వామి తన ప్రయత్నంలో విజయం సాధించినట్లే! అయితే ఇప్పటికే మూడుసార్లు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న కుమారస్వామికి ఆరోగ్యమే అతిపెద్ద అవరోధం. మరోవైపు- ఆయన ఒంటెద్దు పోకడ నచ్చక పార్టీ నుంచి ద్వితీయశ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. అవకాశవాద రాజకీయం చేస్తారన్న ముద్ర కుమారస్వామికి మరో ప్రతికూలాంశం.
విజయేంద్రకు కఠిన సవాల్
భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ 48 ఏళ్ల బి.వై.విజయేంద్ర స్వపక్షంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అధిష్ఠానం మద్దతు ఉండటం సానుకూలాంశం. ఇప్పటికీ తండ్రి బి.ఎస్.యడియూరప్పే విజయేంద్రకు బలం. ఈ ఎన్నికల్లో భాజపా శ్రేణులకు యడియూరప్ప నాయకత్వం వహిస్తున్నా.. గెలుపోటములకు విజయేంద్ర బాధ్యత వహించక తప్పదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కమలదళం కన్నడనాట 25 స్థానాలు గెల్చుకుంది. ఈసారి ఆ సంఖ్య ఏమాత్రం తగ్గినా.. విమర్శలు గుప్పించేందుకు బసవనగౌడ యత్నాళ్, సి.టి.రవి, డి.వి.సదానందగౌడ వంటి సీనియర్లు సిద్ధంగా ఉన్నారు. యడియూరప్పను విమర్శించే వారంతా.. ఈ ఎన్నికల్లో భాజపా మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతే విజయేంద్ర నాయకత్వాన్ని సవాలు చేస్తారు. పెద్దగా అనుభవం లేకపోవడం విజయేంద్రకు ప్రతికూలాంశం. గత విధానసభ ఎన్నికల్లోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. ఒకరిద్దరు సీనియర్లు మినహా ఆయనకు పార్టీలో మద్దతిచ్చేవారు దాదాపుగా లేరనే చెప్పాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్