LS polls: ‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
అసన్సోల్ లోక్సభ స్థానం నుంచి టీఎంసీ తరఫున బిహారీ బాబు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha), సర్దార్జీగా పేరొందిన భాజపా సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)లు తలపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తోన్న భాజపా.. లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అసన్సోల్ స్థానంపై దృష్టిసారించింది. నల్ల బంగారానికి (బొగ్గు గనులకు) నిలయమైన ఈ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక్కడినుంచి టీఎంసీ తరఫున బిహారీబాబుగా పేరొందిన బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా (Shatrughan Sinha) బరిలోఉండగా, సర్దార్జీగా పేరొందిన సీనియర్ నేత సురేంద్రజీత్ సింగ్ (SS Ahluwalia)ను భాజపా బరిలో దింపింది. దీంతో ఈ స్థానంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
మైనింగ్తోపాటు పారిశ్రమలకు నిలయమైన అసన్సోల్ పార్లమెంటు స్థానం కింద రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవన్నీ బొగ్గు గనులు, ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి. ఝార్ఖండ్కు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో హిందీ మాట్లాడేవారే ఎక్కువ. ఇక్కడి గనులు, పరిశ్రమల్లో పనిచేసేవారు ఎక్కువగా బిహార్, యూపీ నుంచి వచ్చినవారే. దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. మూడు దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల చేతుల్లో ఉన్న ఈ స్థానాన్ని మునుపటి రెండుసార్లు (2014, 19 ఎన్నికల్లో) భాజపా కైవసం చేసుకుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకుంది.
ఫ్యాన్ ఫాలోయింగ్..
బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా పట్నాకు చెందినవారు. బిహారీ బాబుగా పేరొందిన ఆయన్ను తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బరిలో నిలిపింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపా తరఫున రెండుసార్లు ఇక్కడినుంచి గెలిచిన బాబుల్ సుప్రియో.. 2021 చివర్లో తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఆ తర్వాత 2022లో జరిగిన ఉప ఎన్నికలో శత్రుఘ్నసిన్హా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈసారి మళ్లీ ఆయన్నే టీఎంసీ పోటీలో నిలిపింది. బాలీవుడ్ అగ్ర నాయకుల్లో ఒకరైన శత్రుఘ్నసిన్హా 1979లో వచ్చిన ‘కాలా పత్తర్’ సినిమాలో అమితాబ్తో కలిసి నటించారు. అసన్సోల్కు సమీపంలో ఉన్న చస్నాలా బొగ్గు గనిలో చోటుచేసుకున్న విషాదం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ ప్రాంతంలో శత్రుఘ్నసిన్హాకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు స్థానిక నేతలు చెబుతున్నారు.
తీవ్ర పోటీ..
అసన్సోన్ స్థానికుడైన సురేంద్రజీత్ సింగ్ అహ్లూవాలియాను భాజపా పోటీలో నిలిపింది. రాజ్యసభ మాజీ ఎంపీ అయిన సింగ్.. 2014లో దార్జీలింగ్, 2019లో బర్ధమాన్-దుర్గాపుర్ నుంచి గెలుపొందారు. ఈసారి తొలుత భోజ్పురి గాయకుడు పవన్సింగ్ను ఇక్కడినుంచి పోటీ చేయిస్తున్నట్లు భాజపా ప్రకటించినప్పటికీ.. పోటీ నుంచి ఆయన తప్పుకోవడంతో సర్దార్జీకి కేటాయించింది. అయితే, ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు శాసనసభ స్థానాల్లో ఐదు టీఎంసీ చేతిలోనే ఉండటంతో అహ్లూవాలియా గట్టి పోటీ ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.
సీపీఎం నుంచి ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. స్థానికంగా ఉన్న తాగునీటి సమస్యను లేవనెత్తిన ఆయన.. శత్రుఘ్నసిన్హా, సుప్రియోలు వీటిపై కనీస శ్రద్ధ వహించలేదన్నారు. ఇక్కడి పరిశ్రమలు ఎంతోకాలంగా మూతపడటం, అక్రమ మైనింగ్ జోరుగా సాగుతుండటం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎంపీగా ఉన్న ఇద్దరు నేతలు.. వారి సిటింగ్ స్థానాలకు ఏం చేశారని ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మే 13న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు. -
గెలవకున్నా.. గెలుపోటములను శాసిస్తారు!
ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు.
తాజా వార్తలు
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!