icon icon icon
icon icon icon

Congress: కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 20 Apr 2024 11:54 IST

కడప: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి అర్పించారు. నామినేషన్‌ పత్రాలను అక్కడ ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కడప నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img