Chandrababu: కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు
జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
సర్వేపల్లి: జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ఐదుగురు అవినీతి పరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్, విజయసాయి, పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి దోచుకుంటుంటే ఆరో వ్యక్తి కాకాణి దోపిడీ యథేచ్చగా జరుగుతోందన్నారు.
‘‘ ఎండల బాదుడు కంటే వైకాపా బాదుడే ఎక్కువ. రాజకీయ వేడి ముందు వేసవి వేడి కొట్టుకుపోతోంది. మే 13న వైకాపా మాడి మసై పోతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అహంకార ప్రభుత్వం కూలిపోవాలి. కేజీఎఫ్ -1, కేజీఎఫ్-2 చూడాలంటే కోలార్ పోవాలి. కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి. కాకాణి దోచిన వనరులే ఆయన్ను రాజకీయ సమాధి చేస్తాయి. మైనింగ్ మాఫియాతో కొండలు, గుట్టలు ఏమీ మిగల్లేదు. క్వార్ట్జ్లో రూ.4,500 కోట్ల కుంభకోణం జరిగింది. విద్యాశాఖకు జగన్ తెగులు పట్టించారు. విద్యావ్యవస్థ భ్రష్టుపట్టే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు.. క్యాష్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి జగన్ ఊరికో ప్యాలెస్ నిర్మించుకున్నారు. తెదేపా వచ్చాక పేదలకు ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తాం. వాలంటీర్లు ఎన్నికల్లో భాగస్వామ్యం కావొద్దని ఈసీ చెప్పింది. సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయవచ్చు.. అలా చేయకుండా వృద్ధులను ఎండలో తిప్పి ఇబ్బంది పెట్టారు. పెంచిన పింఛన్లు ఏప్రిల్ నుంచి ఇంటి వద్దే ఇస్తాం. దివ్యాంగులకు నెలకు రూ.6వేలు పింఛను ఇస్తాం. గొడ్డలి వేటు, కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడుతున్నారు. గులకరాయి వేయించి హత్యాయత్నం చేశానని చెబుతున్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా మళ్లీ మళ్లీ చెబుతున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాచమల్లు.. బూతుల జల్లు!
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. -
ఇంకెంత మంది వృద్ధులను పొట్టన పెట్టుకుంటారు?
వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకేమొచ్చిందని ప్రశ్నించారు. -
పోస్టల్ బ్యాలట్ జాబితాలో పేర్లు గల్లంతు
పోస్టల్ బ్యాలట్ కోసం ఉద్యోగులు ఫాం-12 సమర్పించినా కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలట్ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి. అనంతపురం జిల్లాలో చాలాచోట్ల శుక్రవారం ఫాం-12 సమర్పించిన వారికి బ్యాలట్లు రాలేదు. -
జగన్ ఒక ముఖ్య‘కంత్రీ’
విశాఖలో జగన్ అండ్ కో సృష్టించిన అరాచకాలు కోకొల్లలు. విలువైన భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. -
అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
వైకాపా తీసుకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని, ఇసుక మీద రూ.40వేల కోట్లు, మద్యం మీద రూ.41వేల కోట్లు వాళ్లు దోచేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. -
ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపుతా
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి... భాజపా అభ్యర్థి సత్యకుమార్ను ఉద్దేశిస్తూ బెదిరింపులు, దూషణలకు దిగారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
రాష్ట్రప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల ఆస్తులు, భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. -
ఎన్డీయే ఖాతాలో శ్రీసత్యసాయి జిల్లా?
అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న పుట్టపర్తి కేంద్రంగా ఉన్న శ్రీ సత్యసాయి జిల్లాలో ఓటర్లు ఈసారి ఎన్డీయేకు జై కొడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి, అక్రమాల ఆరోపణలే వీరికి బలంగా మారాయి. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
అయిదేళ్లుగా ఉత్తుత్తి బటన్లు నొక్కి.. అలసిపోయిన జగన్ను ఈ నెల 13న అందరూ రెండే రెండు బటన్లు నొక్కి ఇంటికి సాగనంపాలని తెదేపా రాష్ట్ర నేత వంగవీటి రాధాకృష్ణ, గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు పిలుపునిచ్చారు. -
ఏ1 జగన్రెడ్డి.. ఏ2 జవహర్రెడ్డి
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో గత నెల 33 మంది, ఈ నెలలో ఒక్క రోజే ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డే కారణమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
సింహపురి.. కూటమి గెలుపు బరి!
సింహపురి అంటే వైకాపాకు కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు (2014, 2019) ఎన్నికల్లోనూ నెల్లూరు లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. -
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
160కి పైగా అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలు కూటమివే: చంద్రబాబు
తాజా ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఖరారు
ఏపీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. -
మన భూములపై జగన్ పెత్తనం.. అరాచకానికి పరాకాష్ట: చంద్రబాబు
రాష్ట్రంలో పింఛనుదారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ఏంటీ దారుణం.. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా?: పవన్
వైకాపా ప్రభుత్వం యువతను గంజాయి మత్తుకు బానిస చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు
మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదైంది. -
ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో..: షర్మిల ఎద్దేవా
ఏటా సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ అని జగన్ అన్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 5 సంక్రాంతులొచ్చాయి.. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
పింఛన్ల పంపిణీ.. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని టార్గెట్ పెట్టుకున్నారా?: వైఎస్ షర్మిల
వృద్ధులకు పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
తాజా వార్తలు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు