kishan reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం

నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్‌ని ప్రారంభించారు.

Published : 29 Jan 2024 11:03 IST

హైదరాబాద్‌: నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో స్థానిక అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని వారు చెప్పడంతో కిషన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే స్ట్రీట్ లైట్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని