KTR: గతేడాది ఒక్క హైదరాబాద్లోనే లక్షన్నర ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్
కరోనా పరిస్థితులు ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్: కరోనా పరిస్థితులు ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో గత 8 ఏళ్లలో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. హైటెక్సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిందని కేటీఆర్ అన్నారు. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాలు లభిస్తే.. ఒక్క హైదరాబాద్లోనే లక్షన్నర వచ్చాయని ఆయన వివరించారు. నగరం నుంచి ఐటీ ఎగుమతులు కూడా పెరిగాయన్నారు. 2021-22 ఏడాదిలో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83లక్షల కోట్లని.. 2035 నాటికి ఈ సంఖ్యను రూ.2.9లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఐటీ, అనుబంధ పరిశ్రమల ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. జాతీయ సగటు కంటే 9 శాతం అదనంగా వృద్ధి సాధించినట్లు కేటీఆర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి