KTR: ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’: కేటీఆర్
‘కరెంట్ ఇస్తారా.. సబ్స్టేషన్లో మొసలిని వదలాలా?’ అంటూ కర్ణాటకలోని కొందరు రైతులు వినూత్న నిరసన తెలిపారు.
ఇంటర్నెట్డెస్క్: సకాలంలో విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్కు ట్రాక్టర్లో ఓ మొసలిని తీసుకొచ్చారు. ‘కరెంట్ ఇస్తారా.. సబ్స్టేషన్లో మొసలిని వదలాలా?’ అంటూ సిబ్బందిని ప్రశ్నించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తాజాగా ఈ వీడియోను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘ ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ రాసుకొచ్చారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వడం వల్ల పొలాలకు వెళ్లడం ఇబ్బందిగా మారిందని కర్ణాటకలోని రైతులు ఆరోపిస్తున్నారు. పొలానికి వెళ్తున్నప్పుడు స్థానిక కాలువల నుంచి మొసలి పిల్లలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వన్యప్రాణులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పొలానికి వెళ్లిన సమయంలో దొరికిన మొసలిని ట్రాక్టర్లో సబ్స్టేషన్కు తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం వద్దకు వచ్చిన అటవీశాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించి సంరక్షణకేంద్రానికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు