AP PRC: అప్పటివరకు చర్చల్లేవ్.. మంత్రుల కమిటీకి లేఖ అందజేత
ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. ఉద్యమ కార్యాచరణపై ఇవాళ భేటీ అయిన పీఆర్సీ సాధన సమితిలోని ఉద్యోగ సంఘాల నేతలు పలు విషయాలపై చర్చించారు. చర్చలకు రావాలంటూ జీఏడీ ముఖ్య కార్యదర్శి ఆహ్వానించిన నేపథ్యంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో జీవోలు రద్దు చేయాలని కోరుతూ మంత్రుల కమిటీకి లేఖ రాశారు.
అనంతరం మంత్రుల కమిటీ ఆహ్వానం నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు ఆస్కార్ రావు, వైవీ రావు, హృదయరాజు, శివారెడ్డి తదితరులు సచివాలయానికి వెళ్లారు. ఈ మేరకు మంత్రుల కమిటీకి తమ నిరసన లేఖను అందజేశారు. ఆ లేఖలో ప్రధానంగా మూడు అంశాలను తమ డిమాండ్లుగా పేర్కొన్నారు. పీఆర్సీ జీవోల రద్దు, ఉద్యోగులకు పాత జీతాలు చెల్లింపు, పీఆర్సీపై అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలనే డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు.
తదుపరి కార్యాచరణ కొనసాగుతుంది: ఆస్కార్రావు
లేఖ అందజేసిన అనంతరం స్టీరింగ్ కమిటీ నేత ఆస్కార్ రావు మీడియాతో మాట్లాడారు. మూడు ప్రధానాంశాలను పరిష్కరిస్తేనే చర్చలకు వస్తామని మంత్రుల కమిటీకి తెలిపామన్నారు. చర్చల ప్రక్రియ ఇవాళ జరగలేదని.. తమ తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకుండా చర్చలకు వెళ్లేది లేదని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు