HYD News: మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు

హైదరాబాద్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Updated : 07 Apr 2024 11:50 IST

దిల్లీ: హైదరాబాద్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. ‘‘మాధవీలతా జీ. మీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు’’ అంటూ మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్‌ పునఃప్రసారాన్ని అందరూ చూడాలని కోరారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కొంపెల్ల మాధవీలతకు ఈ సారి భాజపా హైదరాబాద్‌ టికెట్‌ను కేటాయించింది. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం వై-ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించింది. లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె.. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు