TS High Court: హైకోర్టును ఆశ్రయించిన సర్పంచులు.. స్టే ఇచ్చేందుకు నిరాకరణ

తెలంగాణలో జనవరి 31తో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 31 Jan 2024 17:55 IST

హైదరాబాద్: తెలంగాణలో జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సర్పంచులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే తమ పదవీ కాలం పొడిగించేలా సూచించాలని, ప్రత్యేక అధికారులను నియమించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని