Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. గురుపౌర్ణమికి అరుణాచలం వెళ్తారా? టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ(Arunachalam Giri Pradakshina) చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్న్యూస్ చెప్పింది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదక్షిణకు భక్తుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. జూలై 3న అరుణాచలంలో జరిగే గిరి ప్రదర్శనకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడపాలని TSRTC నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కమల వికాసంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: జేపీ నడ్డా
మోదీ పాలనలో దేశం పురోగమిస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన భాజపా నవసంకల్ప సభలో నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. భాజపా సమావేశంలో తుపాకీ మోత..!
బిహార్లోని మాధేపుర జిల్లాలో నిర్వహించిన భాజపా సమావేశం రణరంగంగాన్ని తలపించింది. పార్టీలోని రెండు వర్గాల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో ఇరు పక్షాల నేతలు, కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. అంతటితో ఆగకుండా.. పంకజ్ పటేల్ అనే కార్యకర్త తన వద్దనున్న లైసెన్స్ గన్తో పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు.. లైసెన్స్ ఇస్తే చాలని మస్క్.. వేలానికే అంబానీ మొగ్గు!
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం వీలైనంత త్వరగా భారత్లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్టార్లింక్ సేవలను భారత్లో ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. స్టార్లింక్తో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవచ్చని ఈ సందర్భంగా మస్క్ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. సీన్ రిపీట్.. 62 ఏళ్ల తర్వాత రెండు మహానగరాలకు ఒకేసారి రుతుపవనాలు
దేశ రాజధాని దిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai) నగరాలను వర్షాలు మంచెత్తుతున్నాయి. రుతుపవనాల కారణంగా ఈ రెండు మహానగరాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. దాదాపు 62 సంవత్సరాల తర్వాత ఈ రెండు మహానగరాలను ఒకేసారి రుతుపవనాలు పలకరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఎల్లలు దాటిన తండ్రీకూతురి అనుబంధం.. మనసులు కరిగిస్తున్న వీడియో
సాధారణంగా తండ్రికి కొడుకు కంటే కూతురిపైనే ఎక్కువ ప్రేమ ఉంటుందని చెబుతుంటారు. ఆమెకి ఏ చిన్న ఆపదొచ్చినా..తట్టుకోలేడు. అలాంటిది దేశం కాని దేశంలో ఓ అమ్మాయిని వదిలి రావాలంటే ఏ తండ్రికైనా కాస్త కష్టమే. ఏడాదిన్నరగా తన కూతుర్ని చూడకపోయేసరికి ఆ తండ్రి పరితపించిపోయాడు. కూతురికి సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక్కమాట కూడా చెప్పకుండా ఉన్నపళంగా భారత్ (India) నుంచి కెనడా (Canada) బయల్దేరి వెళ్లిపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. ప్రధాని మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారం
ఈజిప్టులో పర్యటిస్తున్న నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ (Order of the Nile) దక్కింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి దీనిని అందజేసి సత్కరించారు. 1915లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని.. దేశంతోపాటు మానవాళికి విశేష సేవలందించే వివిధ దేశాల అధినేతలు, రాజులు, ఉపాధ్యక్షులకు అందిస్తున్నారు. తాజాగా మోదీకి ఈ పురస్కారం వరించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆలయంలో 10 కిలోల బంగారం మాయం.. రంగంలోకి అవినీతి నిరోధక శాఖ!
నేపాల్లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయంలో (Pashupati temple) బంగారం మాయం కావడం చర్చనీయాంశమైంది. సుమారు 100కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా.. అందులో దాదాపు 10కిలోల నగలు మాయమయ్యాయనే (Gold Missing) ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులివే..!
ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఆ దేశం అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ (Order of the Nile)ను ఇచ్చి సత్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇప్పటివరకు 13 అవార్డులు వచ్చినట్లయ్యింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు/ఫౌండేషన్లు కూడా తమ అవార్డులతో సత్కరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వాషింగ్టన్ మూమెంట్ అంటే ఇదే.. ఒకే ఫ్రేమ్లో నలుగురు ప్రముఖులు!
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎన్నో ఆసక్తికర విషయాలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), ప్రథమ మహిళ జిల్ బైడెన్ (Jill Biden) శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్కు పలువురు భారత పారిశ్రామివేత్తలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహీంద్రా అక్కడి విశేషాలను కూడా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత