Awards for Modi: మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులివే..!
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 13 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. వీటితోపాటు పలు సంస్థలు కూడా ప్రత్యేక పురస్కారాలను ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఆ దేశం అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ (Order of the Nile)ను ఇచ్చి సత్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇప్పటివరకు 13 అవార్డులు వచ్చినట్లయ్యింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు/ఫౌండేషన్లు కూడా తమ అవార్డులతో సత్కరించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మోదీకి వచ్చిన అవార్డులను ఓసారి పరిశీలిస్తే..
ఆర్డర్ ఆఫ్ ది నైల్ : ఈజిప్టు అత్యున్నత పురస్కారమిది. దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి అందజేసి సత్కరించారు. ఈజిప్టు సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలు, ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తోంది.
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు: పపువా న్యూ గిని అత్యున్నత పురస్కారం. పసిఫిక్ ఐలాండ్ దేశాల ఐక్యతతో పాటు ‘గ్లోబల్ సౌత్’ ప్రయోజనాల కోసం కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. 2023 మేలో పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా దీన్ని ప్రదానం చేశారు.
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి: అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజి ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ ఏడాది మేలో అక్కడ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీన్ని అందుకున్నారు.
ఎబాకల్ అవార్డ్: పపువా న్యూ గిని పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురంగెల్ ఎస్ విప్స్ జూనియర్ ‘ఎబాకల్ అవార్డు’తో సత్కరించారు. ఆ దేశంలో ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఈ అవార్డును అందుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో: భూటన్ అత్యున్నత పౌర పురస్కారం ఇది. దీనిని 2021లో భూటాన్ అందజేసింది. కరోనా సమయంలో అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు ప్రకటించింది.
లీజియన్ ఆఫ్ మెరిట్: అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది. సేవలు, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తికి దీన్ని ప్రకటిస్తారు. 2020లో దీనిని అందుకున్నారు.
కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్: బహ్రెయిన్ పురస్కారం. 2019లో ఈ అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్ దేశం అందించింది.
ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్: మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం. దీన్ని 2019లో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది.
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ: రష్యా అత్యున్నత పౌర పురస్కారం. 2019లో ఇచ్చారు.
ఆర్డర్ ఆఫ్ జయేద్: ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2019లో అందుకున్నారు.
గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా: విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2018లో పాలస్తీనా ఈ అవార్డును అందజేసింది.
స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్: అఫ్గానిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని 2016లో అందుకున్నారు.
ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్: సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో దీనిని ఇచ్చారు.
వీటితోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రధాని మోదీకి అవార్డులు ఇచ్చి సత్కరించాయి.
అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ రంగంలో ‘గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు’ను ప్రధాని మోదీకి కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ (CERA) 2021లో అందించింది.
స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి ‘గ్లోబల్ గోల్కీపర్’ అవార్డును బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అందజేసింది.
పర్యావరణానికి సంబంధించి ఐరాస అందించే అత్యున్నత పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ 2018లో వరించింది.
ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు ‘సియోల్ పీస్ ప్రైజ్’ను అందజేస్తారు. 2018లో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!