Awards for Modi: మోదీని వరించిన అంతర్జాతీయ అవార్డులివే..!
ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీకి ఇప్పటివరకు 13 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. వీటితోపాటు పలు సంస్థలు కూడా ప్రత్యేక పురస్కారాలను ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈజిప్టులో పర్యటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. ఆ దేశం అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది నైల్’ (Order of the Nile)ను ఇచ్చి సత్కరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి ఇప్పటివరకు 13 అవార్డులు వచ్చినట్లయ్యింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు/ఫౌండేషన్లు కూడా తమ అవార్డులతో సత్కరించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా గడచిన తొమ్మిదేళ్ల కాలంలో మోదీకి వచ్చిన అవార్డులను ఓసారి పరిశీలిస్తే..
ఆర్డర్ ఆఫ్ ది నైల్ : ఈజిప్టు అత్యున్నత పురస్కారమిది. దేశ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి అందజేసి సత్కరించారు. ఈజిప్టు సహా మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా దేశాధినేతలు, ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తోంది.
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లొగోహు: పపువా న్యూ గిని అత్యున్నత పురస్కారం. పసిఫిక్ ఐలాండ్ దేశాల ఐక్యతతో పాటు ‘గ్లోబల్ సౌత్’ ప్రయోజనాల కోసం కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. 2023 మేలో పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా దీన్ని ప్రదానం చేశారు.
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి: అంతర్జాతీయ స్థాయిలో నాయకత్వానికి గుర్తింపుగా ఫిజి ఈ పురస్కారాన్ని అందజేసింది. ఈ ఏడాది మేలో అక్కడ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దీన్ని అందుకున్నారు.
ఎబాకల్ అవార్డ్: పపువా న్యూ గిని పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సురంగెల్ ఎస్ విప్స్ జూనియర్ ‘ఎబాకల్ అవార్డు’తో సత్కరించారు. ఆ దేశంలో ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యం కలిగిన ఈ అవార్డును అందుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో: భూటన్ అత్యున్నత పౌర పురస్కారం ఇది. దీనిని 2021లో భూటాన్ అందజేసింది. కరోనా సమయంలో అందించిన సహకారానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని ఇచ్చినట్లు ప్రకటించింది.
లీజియన్ ఆఫ్ మెరిట్: అమెరికా సాయుధ బలగాలకు చెందిన అవార్డు ఇది. సేవలు, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తికి దీన్ని ప్రకటిస్తారు. 2020లో దీనిని అందుకున్నారు.
కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రనేసాన్స్: బహ్రెయిన్ పురస్కారం. 2019లో ఈ అత్యున్నత పురస్కారాన్ని గల్ఫ్ దేశం అందించింది.
ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్: మాల్దీవులకు చెందిన అత్యున్నత పురస్కారం. దీన్ని 2019లో మాల్దీవుల ప్రభుత్వం అందజేసింది.
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ: రష్యా అత్యున్నత పౌర పురస్కారం. 2019లో ఇచ్చారు.
ఆర్డర్ ఆఫ్ జయేద్: ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 2019లో అందుకున్నారు.
గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా: విదేశీ ప్రముఖులకు పాలస్తీనా ఇచ్చే అత్యున్నత పురస్కారం. 2018లో పాలస్తీనా ఈ అవార్డును అందజేసింది.
స్టేట్ ఆఫ్ ది ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్: అఫ్గానిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని 2016లో అందుకున్నారు.
ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్: సౌదీ అరేబియా అత్యున్నత పురస్కారం ఇది. దీన్ని ముస్లిమేతర ప్రముఖులకు సౌదీ అందజేస్తుంది. 2016లో దీనిని ఇచ్చారు.
వీటితోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రధాని మోదీకి అవార్డులు ఇచ్చి సత్కరించాయి.
అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ రంగంలో ‘గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు’ను ప్రధాని మోదీకి కేంబ్రిడ్జి ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ (CERA) 2021లో అందించింది.
స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి ‘గ్లోబల్ గోల్కీపర్’ అవార్డును బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అందజేసింది.
పర్యావరణానికి సంబంధించి ఐరాస అందించే అత్యున్నత పురస్కారం ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ 2018లో వరించింది.
ప్రపంచ శాంతితో పాటు మానవాళి సామరస్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తులకు ‘సియోల్ పీస్ ప్రైజ్’ను అందజేస్తారు. 2018లో సియోల్ పీస్ ప్రైజ్ కల్చరల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.