Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు రూ.78వేల వరకు సబ్సిడీ
సౌర విద్యుత్ (solar power) వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం సరికొత్త పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాని అమలు దిశగా మరో ముందడుగు పడింది. ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PM-Surya Ghar: Mufti Bijli Yojna)’కు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘కేఆర్ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా?’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా రూపొందించలేదని కేంద్ర జల్శక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరాం తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు, నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) విధివిధానాలపై ఆయన వివరణ ఇచ్చారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని భారాసకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పందించారు. ‘‘మీకు ధైర్యముంటే సీఎం, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయండి.. నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం కలిసి మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి తేల్చుకుందాం’’ అని ప్రతి సవాల్ విసిరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. సైకిల్కి ఎదురొస్తే.. తొక్కుకుంటూ ముందుకెళ్లడమే..!: నారా భువనేశ్వరి
సైకిల్కి ఎదురొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి ఎన్నికల్లో తెదేపా (TDP) జెండా ఎగురవేద్దామని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పిలుపునిచ్చారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో ఆమె గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. తెదేపాలోనే కొనసాగుతా: మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్
మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ను కలిశారు. విజయవాడ తెదేపా లోక్సభ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని ఆయన్ను లోకేశ్ వద్దకు తీసుకెళ్లారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్ఖాన్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగడతానని.. పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కేసీఆర్ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్రెడ్డి
కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం భారాస అధినేత కేసీఆర్కు ఉంటే మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల కన్నీటి గాథలు చెబుతూ పోతే చాంతాడంత ఉంటుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. దీపిక లాంటి ఆడపిల్ల కావాలి: రణ్వీర్ సింగ్
బాలీవుడ్ కపుల్ దీపికా(Deepika Padukone)-రణ్వీర్ (Ranveer Singh) తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రణ్వీర్ తనకు దీపిక లాంటి ఆడపిల్ల కావాలని ఆశపడుతున్నట్లు చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) ప్రీరిలీజ్ ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు నటుడు నాగబాబు (Naga Babu) తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు.. కొనసాగుతున్న పోలీసుల విచారణ
రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. 12వ నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్ లిషిత పరారీలో ఉండగా.. 3 రోజుల క్రితం ఆమె ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. ఆమె ఇంట్లో లేదని లిషిత సోదరి కుషిత పీఎస్కు వచ్చి నోటీసులకు సమాధానం ఇచ్చారు. విచారణకు లిషిత కచ్చితంగా రావాలని ఆమె సోదరికి పోలీసులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. నిజం తెలియాలనే ఇప్పుడు బయటకు వెల్లడించా: హనుమ విహారి
రంజీ ట్రోఫీ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై ఇటీవల సంచలన విషయాలను వెల్లడించిన భారత క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) హాట్ టాపిక్గా మారిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!