Rajeev Ratan: విజిలెన్స్‌ డీజీ రాజీవ్‌ రతన్‌ హఠాన్మరణం

విజిలెన్స్‌ డీజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ (Rajeev Ratan) కన్నుమూశారు.

Updated : 09 Apr 2024 19:01 IST

హైదరాబాద్‌: విజిలెన్స్‌ డీజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ (Rajeev Ratan) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజీవ్‌ రతన్‌ గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేశారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

రాజీవ్‌ రతన్‌ హఠాన్మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమర్థంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని