Varun Gandhi: సాగు చట్టాల రద్దు ఓకే.. మోదీజీ ఈ డిమాండ్లు కూడా తీర్చండి: వరుణ్ గాంధీ లేఖ
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు ఆది నుంచి తన మద్దతు తెలుపుతున్న భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా మరోసారి ఈ విషయంపై
దిల్లీ: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు ఆది నుంచి తన మద్దతు తెలుపుతున్న భాజపా ఎంపీ వరుణ్ గాంధీ.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్న ప్రధాని మోదీ నిన్న చేసిన ప్రకటనను స్వాగతించిన ఆయన.. కేంద్రం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. కనీస మద్దతు ధరపై రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు. లేదంటే అన్నదాతల ఉద్యమం ఆగదని అభిప్రాయపడ్డారు. లఖింపూర్ ఖేరిలో చోటుచేసుకున్న ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి వరుణ్ బహిరంగ లేఖ రాశారు.
రూ.కోటి పరిహారం ఇవ్వండి..
‘‘సాగు చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని గత ఏడాది కాలంగా అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభించింది. చట్టాలను రద్దు చేస్తామని మీరు(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు. అయితే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఈ ఉద్యమంలో పోరాడుతూ 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ ఈ నిర్ణయం(చట్టాల రద్దుపై) గనుక ముందే తీసుకుంటే.. ఆ అమాయక ప్రాణాలను పోగొట్టుకునేవాళ్లం కాదుగా. అందువల్ల నేను కోరుతున్నది ఏంటంటే.. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించి, ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వండి. అంతేగాక, ఉద్యమంలో భాగంగా రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ కొట్టేయండి’’ అని వరుణ్ గాంధీ డిమాండ్ చేశారు.
అప్పటిదాకా ఉద్యమం ఆగదు..
‘‘మన దేశంలో 85శాతం మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే. వారికి సాధికారత దక్కాలంటే వారి పంటలకు తగిన మద్దతు ధర లభించాలి. అందుకే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను పరిష్కరించేంతవరకు వారి ఉద్యమం ఆగదు. అందువల్ల రైతుల పంటకు చట్టపరమైన మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వం అంగీకరించాలని కోరుతున్నా. ఇది వారికి ఆర్థికపరమైన భద్రత కల్పిస్తుంది’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
లఖింపుర్ ఘటనపై చర్యలు తీసుకోండి..
‘‘ఆందోళన చేస్తోన్న రైతులపై చాలా మంది రాజకీయ నేతలు రెచ్చగొట్టే, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 3న లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనల్లో రైతు సోదరులు మరణించారు. ఆ హృదయవిదారక ఘటన.. మన ప్రజాస్వామ్యంపై మాయని మచ్చగా మారింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. అప్పుడే ఘటనపై పారదర్శకమైన విచారణకు వీలవుతుంది’’ అని వరుణ్ లేఖలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు