Morbi Trajedy: వంతెన ఫ్లోరింగ్ మార్చారు.. తీగలు వదిలేశారు..!
గుజరాత్లోని మోర్బీ నగరంలో పెను విషాదానికి కారణమైన తీగల వంతెన మరమ్మతులను అర్హత లేని కాంట్రాక్టర్లు చేపట్టినట్లు తెలిసింది. పనులు అసంపూర్తిగా చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా బ్రిడ్జిని తెరవడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది.
మోర్బీ: గుజరాత్లోని మోర్బీ నగరంలో తీగల వంతెన కూలిన దుర్ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి ఈ తీగల వంతెన మరమ్మతుల పనులు అప్పగించడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆ పనిలో కనీస అర్హత లేదని తాజాగా ప్రాసిక్యూషన్ మోర్బీ కోర్టుకు తెలిపింది.
ఈ ప్రమాదంపై దర్యాప్తు జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై మోర్బీ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదిస్తూ.. ‘‘మరమ్మతుల సమయంలో వంతెన ఫ్లోరింగ్ను మార్చారు. కానీ తీగలను మార్చకుండా వదిలేశారు. కొత్తగా వేసిన ఫ్లోరింగ్ను నాలుగు లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు. దీంతో పాత తీగలు ఈ బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసింది. ఇక ఈ మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఈ పనుల్లో ఎలాంటి ‘అర్హత’ పత్రాలు లేవు. అయినప్పటికీ 2007లో వీరికే కాంట్రాక్టు అప్పజెప్పారు. మళ్లీ 2022లోనూ వీరినే పిలిపించి మరమ్మతులు చేపించారు. దీని వెనుక కారణాలు తెలుసుకోవాల్సి ఉంది’’ అని ప్రాసిక్యూటర్ హెచ్ఎస్ పంచాల్ కోర్టుకు వివరించారు.
వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో అరెస్టయిన 9 మంది నిందితుల్లో నలుగురిని పోలీసు కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా ఐదుగురికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
పైపై మెరుగులే చేసి..
ఇక ఈ వంతెన నిర్వహణకు శాశ్వత కాంట్రాక్టు కావాలని ఒరెవా గ్రూప్ గతంలో అధికారులను డిమాండ్ చేసింది. అందుకు వారు అంగీకరించకపోవడంతో అప్పటివరకు తాత్కాలిక మరమ్మతులు చేసి వంతెనను తెరుస్తామని గతంలో ఓసారి ఆ సంస్థ మోర్బీ జిల్లా కలెక్టర్కు లేఖ రాసిందట. అందుకు సంబంధించిన లేఖ ఒకటి తాజాగా బయటికొచ్చింది. ‘‘శాశ్వత కాంట్రాక్టు ఇవ్వనంతవరకు వంతెనకు తాత్కాలిక మరమ్మతు పనులు చేసి బ్రిడ్జిని తెరుస్తాం. అప్పటివరకు ఎలాంటి మెటీరియల్ను కూడా ఆర్డర్ చేయబోం. మా డిమాండ్లు నెరవేరితేనే వంతెన పనులను పూర్తిచేస్తాం. దీనిపై పునరాలోచన చేయండి’’ అని 2020లో ఒరెవా గ్రూప్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2022లో ఒరెవా కంపెనీ, మోర్బీ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య వంతెన నిర్వహణకు ఒప్పందం జరిగింది. 15ఏళ్ల పాటు అంటే 2037 వరకు ఈ బ్రిడ్జి నిర్వహణ బాధ్యతలను అధికారులు ఆ కంపెనీకి అప్పగించారు.
అయితే ఈ మరమ్మతు పనులను కేవలం ఐదు నెలల్లోనే పూర్తిచేసి హడావుడిగా వంతెనను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికేట్లు తీసుకోకుండానే దీపావళి సమయంలో వంతెనను తిరిగి తెరిచారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఘోర విషాదం చోటుచేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు