JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
పుణెలోని ఓ గణేశ్ మండపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో భాజపా (BJP) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అక్కడే ఉన్నారు.
పుణె : భాజపా (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda) ప్రమాదం తప్పింది. పుణెలోని సానే గురూజీ తరుణ్ మిత్ర మండల్ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఆయన పూజలు చేస్తుండగా.. ఆ మండపం మంటల్లో చిక్కుకుంది. గణేశుడి మండపాన్ని ఉజ్జయిని మహాకాళి ఆలయ నమూనాలో రూపొందించారు. దాని శిఖర భాగంలో మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడకు వచ్చిన నడ్డా ఈ సమాచారం తెలియగానే వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను పక్కకు తీసుకెళ్లినట్లు తెలిసింది. మంటలు ఎగసిపడిన కాసేపటికే భారీ వర్షం కురిసింది. దాంతో నిమిషాల వ్యవధిలో మంటలను ఆర్పివేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను మండప నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.
గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ
అంతకముందు జేపీ నడ్డా ముంబయిలోని పలు గణేశ్ మండపాలను దర్శించుకుని, పూజలు చేశారు. తొలుత ఆయన గిర్గావ్లోని కేశవ్జీ చాల్ గణేషోత్సవ్ మండల్లో కొలువుదీరిన విఘ్ననాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే, ముంబయి భాజపా చీఫ్ ఆశీష్ షెలార్, భాజపా జాతీయ కార్యదర్శి వినోద్ టాడ్వే ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారు చీర.. ధర రూ.2.25 లక్షలు
దిల్లీలో జరుగుతున్న 42వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో బంగారు పూత పూసిన ఓ చీర రూ.2.25 లక్షల ధర పలికింది. -
రూ.4.60 లక్షల ధర పలికిన ముర్రాజాతి గేదె
హరియాణాలోని ఝజ్జర్ జిల్లా ఖాన్పుర్కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డుస్థాయిలో రూ.4.60 లక్షలకు అమ్ముడుపోయింది. -
రన్వేపై బారాత్.. విమానంలో వివాహం
యూఏఈకి చెందిన ఓ వ్యాపారవేత్త ఆకాశవీధుల్లో తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. -
మౌలిక వసతుల విస్తరణతోనే అందరికీ చేరువగా న్యాయం
ప్రజానుకూల తీర్పులు ఇవ్వడం ద్వారా మాత్రమే అందరికీ అందుబాటులోకి న్యాయాన్ని తీసుకురాలేమని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. -
నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపు రద్దు అధికారం ఈసీకి ఉండాలి
చట్టాలను, నమోదు నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘాని(ఈసీ)కి తప్పనిసరిగా ఉండాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన వాదనల్లో పిటిషనర్ గట్టిగా కోరారు. -
గుజరాత్లో అకాల వర్షాలు
గుజరాత్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. పలు జిల్లాల్లో పిడుగులు పడి 27 మంది మృతి చెందారు. -
36 మీటర్లు పూర్తయిన తవ్వకం
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. -
మార్చి నాటికి ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం ఖరారు
అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
మహాత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడైతే, ఈ శతాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అభివర్ణించారు. -
Jagdeep Dhankar: గాంధీ మహా పురుషుడు.. మోదీ యుగ పురుషుడు: ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్
ప్రముఖ జైన మత గురువు, ఆధ్యాత్మిక వేత్త శ్రీమద్ రాజ్చంద్రాజీ జయంతి వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
రామేశ్వరం ఎక్స్ప్రెస్కు తప్పిన పెను ప్రమాదం
-
Ravi Shastri: 2024 పొట్టి కప్పులో భారత్ గట్టి పోటీదారు: రవిశాస్త్రి
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
-
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
-
ఏపీలో ఎయిర్ఫైబర్ సేవలు విస్తరించిన జియో
-
Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు