దిగుతుండగా కూలిన హెలికాప్టర్‌

శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది.

Published : 04 May 2024 04:54 IST

శివసేన(యూబీటీ) నేత సుష్మాను తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో ఘటన

రాయ్‌గఢ్‌: శివసేన(యూబీటీ) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. రాయ్‌గఢ్‌ జిల్లాలోని మహాడ్‌ నగరంలో శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో తాత్కాలిక హెలిపాడ్‌లో ల్యాండింగ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో రెక్కలు విరిగిపోవడంతో పాటు హెలిక్టాపర్‌ పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఘటనను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసిన అంధారే.. ‘‘ఈ ప్రమాదంలో పైలట్‌, కో పైలట్‌లకు పెద్దగా గాయాలు కాలేదు. కానీ, వారు షాక్‌లో ఉన్నారు’’ అని వెల్లడించారు. స్థానిక శివసేన (యూబీటీ) అభ్యర్థి అనంత్‌ గీతే తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అంధారే మహాడ్‌ వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని