బీసీఏలో గ్రాడ్యుయేషన్‌ చేసి.. ‘సమోసా వాలా’గా ఎదిగి!

Eenadu icon
By National News Team Updated : 02 Nov 2025 22:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బీసీఏ పూర్తిచేసిన ఓ యువకుడు చిన్న మొత్తంలో వ్యాపారం ప్రారంభించి, అతి తక్కువ సమయంలోనే పాపులర్‌ అయ్యాడు. కోర్బాకు చెందిన మానేశ్వర్ ఉద్యోగాన్ని వదిలి ‘బీసీఏ తందూరీ సమోసా వాలా’ పేరిట వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు నగరంలో ఫేమస్‌ ఫుడ్‌స్టాల్‌ యజమానిగా ఎదిగి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక కొంతకాలం దుర్గ్‌, రాయ్‌పుర్‌లో ఉద్యోగం చేశాడు. కానీ ఎక్కువ పని గంటలు, తక్కువ జీతం, కుటుంబానికి సమయం ఇవ్వలేకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. ఆ సమయంలో సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.

లోకల్‌ మార్కెట్‌ను పరిశీలించి.. తందూరీ సమోసాలు విక్రయించే ఆలోచన చేశాడు. 2018లో భార్యతో కలిసి చిన్న స్థాయిలో తోపుడు బండిపై వ్యాపారం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే మానేశ్వర్‌ వ్యాపారం ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం ఆయన 2-3 మంది సిబ్బందిని పెట్టి వారికి నెలకు రూ.10-15 వేలు చెల్లిస్తున్నాడు. తన బండికి ఆ పేరు పెట్టడంతో ప్రజలు ఆసక్తితో ఆగి.. రుచి చూసి వెళ్తారని ఆయన చెప్పారు. రోజూ సాయంత్రం కోర్బా చౌపాటీ వద్ద అతడి సమోసా బండి కస్టమర్లకు హాట్‌స్పాట్‌గా మారిందని కస్టమర్లు చెబుతున్నారు.

-ఈటీవీ భారత్‌

Tags :
Published : 02 Nov 2025 21:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని