Mortuary: మార్చురీలో మృతదేహాల కళ్లు మాయం..

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల కళ్లు మాయమయ్యాయి. ఇందుకు ఎలుకలే కారణమై ఉండొచ్చని వైద్యాధికారులు చెప్పడం గమనార్హం.

Updated : 22 Jan 2023 06:59 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఆస్పత్రిలో మృతదేహాల కళ్లు మాయమయ్యాయి. ఇందుకు ఎలుకలే కారణమై ఉండొచ్చని వైద్యాధికారులు చెప్పడం గమనార్హం. మోతీలాల్‌ అనే వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 4న వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆ తర్వాతి రోజు వైద్యుడు వచ్చి చూసేసరికి ఓ కన్ను మాయమైంది.

ఫ్రీజర్‌ సరిగా పని చేయకపోవడంతో మృతదేహాన్ని బయటే ఉంచాల్సి వచ్చిందని అందువల్ల ఎలుకలు కన్ను ఎత్తుకుపోయి ఉండొచ్చని అక్కడి వైద్యులు వివరణ ఇచ్చారు. ఈ నెల 19న ఇదే తరహా ఘటన మళ్లీ జరిగింది. రమేశ్‌ అహివార్‌ అనే వ్యక్తి మృతదేహాన్ని ఈ నెల 17న ఫ్రీజర్లో భద్రపరిచారు. 19న డాక్టర్‌ ఫ్రీజర్‌ను తెరచి చూసేసరికి ఒక కన్ను మాయమైంది. ఫ్రీజర్‌లో ఉంచినా కన్ను ఎలా మాయమైందో అర్థం కావడం లేదని రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెల్లడించారు. ఎలుకలే కన్నును ఎత్తుకుపోయి ఉంటాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని