Indian Army: గల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యానికి ప్రత్యేక శిక్షణ..!
గల్వాన్ ఘర్షణ అనంతరం శిక్షణలో భారత సైన్యం కీలక మార్పులు చేసింది. దళాలను మార్షల్ ఆర్ట్స్లో రాటు దేలుస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: గల్వాన్ ఘర్షణ తర్వాత నుంచి భారత సైన్యం (Indian Army) శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయా రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ ఫిట్నెస్ శిక్షణతో పాటు.. వివిధ మార్షల్ ఆర్ట్స్ను కూడా భాగం చేసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయని ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పంజాబ్ రెజిమెంట్లోని వారికి ఘాతక్, గూర్ఖా రెజిమెంట్కు కుక్రీ డ్యాన్స్, మద్రాస్ రెజిమెంట్కు కలిరిపయట్టు వంటివి నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజాబ్ రెజిమెంట్కు చెందిన సైనికులను అరుణాచల్ ప్రదేశ్లోని కిబితు ప్రాంతంలో మోహరించారు. వారు ఇటీవల కొందరు జర్నలిస్టుల ముందు మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించి చూపారు.
ఆ యూనిట్కు చెందిన మేజర్ కార్తికేయ జైస్వాల్ మాట్లాడుతూ.. స్థానిక భౌగోళిక స్వరూపం, గస్తీ సమయంలో ఎదురయ్యే సవాళ్లు భిన్నమైనవన్నారు. ‘‘వేగంగా ప్రవహించే నదులు, ముళ్లు, వర్షాలు, త్వరగా మారిపోయే వాతావరణం, ఎత్తైన శిఖరాల వంటివి ఇక్కడ ఉంటాయి. దీంతో నిత్యం శిక్షణ తప్పనిసరి. వీటిల్లో మార్షల్ ఆర్ట్స్ కూడా ఒకటి’’ అని వెల్లడించారు. ఇలాంటి అభిప్రాయాన్నే ఆ యూనిట్ కమాండింగ్ అధికారి కర్నల్ ప్రిన్స్ రోహిత్ వ్యక్తం చేశారు.
గల్వాన్ ఘర్షణ తర్వాత ఉధంపుర్లోని నార్తర్న్ కమాండ్ ఇజ్రాయెల్కు చెందిన క్రావ్ మాగా అనే మార్షల్ ఆర్ట్స్ను సైనిక శిక్షణలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆయా యూనిట్లకు లేఖలు రాసింది. ఆ తర్వాత అవి తమకు అనుబంధంగా అవసరమైన యుద్ధ విద్యను ఎంపిక చేసుకున్నాయి. ‘‘సరిహద్దుల వెంట ఘర్షణలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. మనకు ఇప్పటికే ఉన్న పలు భారతీయ మార్షల్ ఆర్ట్స్ ఆ సమయంలో సరిగ్గా సరిపోతాయి’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
45 ఏళ్ల లోపు సైనికులు శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉన్నామని నిరూపించుకునేందుకు ఇప్పటికే ప్రతి త్రైమాసికంలో బీపీఏటీ(Battle preparedness and efficiency test)ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిలో 30 ఏళ్ల లోపు వారు 5 కిలోమీటర్ల పరుగును 25 నిమిషాల్లో ముగించాలి. 30-40 మధ్య వయస్కులకు అదనంగా మరో రెండు నిమిషాల సమయం ఇస్తారు. అధికారుల ఫిట్నెస్కు సంబంధించిన నిబంధనలను కూడా సైన్యం మార్చింది. ఇవి ఇంకా అమల్లోకి రావాల్సి ఉంది.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
భారత్-చైనా సైనికుల మధ్య 2020లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు, కర్రలతో తలపడ్డారు. వాస్తవాధీన రేఖ వద్ద తుపాకుల వంటి ఆయుధాలు వినియోగించకూడదని ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యం శిక్షణలో మార్షల్ ఆర్ట్స్ను భాగం చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.