Allu Arjun: పుష్ప-3... క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
‘పుష్ప: ది రూల్’ సీక్వెల్పై అల్లు అర్జున్ స్పందించారు.
హైదరాబాద్: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప: ది రూల్ (Pushpa:The Rule). ఆగస్టు 15న విడుదల కానుంది. గతంలో పుష్ప 3కు సీక్వెల్ రానుందనే వార్తలు వచ్చాయి. జర్మనీలో జరుగుతున్న బెర్లిన్ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ‘పుష్ప: ది రైజ్’ను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ సీక్వెల్పై స్పందించారు.
‘‘విదేశాల్లోని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా. అక్కడి వారు ఎలాంటి సినిమాలు చూస్తారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. పార్ట్ 3కి అన్నీ అనుకూలంగా ఉంటే తీసే అవకాశాలున్నాయి. కథను కొనసాగించాలని అనుకుంటున్నాం. దీనిని తెరకెక్కించేందుకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే ఈ చిత్రంలో పాత్రలు వాటి మధ్య సంఘర్షణ మరింత బలంగా ఉంటుంది. ముఖ్యంగా పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ల క్యారెక్టరైజేషన్, తెరపై వాటి ఎగ్జిక్యూషన్, వారికి ఎదురయ్యే పరిస్థితులు థ్రిల్లింగ్ ఉంటాయి. ఈ సినిమా తర్వాత చాలా ఆసక్తికర ప్రాజెక్ట్లు వరుసలో ఉన్నాయి. ప్రతి సినిమా భారీదనంతో ఉంటుంది’’ అని వెల్లడించారు.
మరోవైపు రష్మిక (Rashmika) ఓ ఇంటర్య్వూలో పుష్ప2 గురించి మాట్లాడారు. ‘‘పుష్ప 2 అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలుసు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా చేయాలనే తపన మాలో ఉంది. పుష్ప ముగింపు లేని కథ, ఎలా అయినా దీనిని రూపొందించవచ్చు’’ అని అన్నారు.
2021లో విడుదలై సూపర్హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise)కి సీక్వెల్గా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రంలో నటనకుగానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాఫ్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..