Chiranjeevi: చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor) కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అది త్వరలోనే జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రాజీవ్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇచ్చారు.
నాకు క్లాసికల్స్ ఇష్టం!
‘‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ మెగాస్టార్ అవుతానని అనుకోలేదు. కానీ, మంచి స్థానంలో ఉంటానని అనుకున్నా. ఎందుకంటే నా ప్రతిభపై నమ్మకం ఉంది. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. అభిమానుల ప్రేమను కొలవలేను. నా అభిమానులు మాస్ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. నన్ను చాలా పైకి తీసుకెళ్లింది. అందులోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్లు, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు.
అందుకే కమర్షియల్స్
‘‘ప్రేక్షకులు రెండు రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారని అర్థమైంది. కె.బాలచందర్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ చేశాం. నాకు మంచి పేరు వచ్చింది. అయితే, ప్రొడ్యూసర్గా నా తమ్ముడికి లాభాలు రాలేదు. నేను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ప్రతీ దాన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే నిదానంగా కమర్షియల్ వైపు వెళ్లాల్సివచ్చింది. ‘దంగల్’ లాంటి సినిమాలు చేయొచ్చుగా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేవారు. కానీ, నిర్మాతలు సంతోషంగా ఉండలేరు. నేను చేసే కమర్షియల్ సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు నేనూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తా. ఏదైనా ఒకరోజు కుదరకపోతే ఆ రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలోనూ నియమాలు పాటిస్తా’’
ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్ సినిమా!
‘‘షూటింగ్ ఉన్న రోజు నేను చాలా హుషారుగా ఉంటాను. లేకపోతే ఆ రోజంతా నిస్సారంగా ఉంటుంది. పని చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే రోజూ పని చేయమని నా భార్య సలహా ఇస్తుంది. మెయిన్ క్యారెక్టర్ సెట్లో ఉంటే సినిమా బాగా వస్తుంది. నటీనటులు క్యార్వాన్లు ఎక్కువగా వాడకండి. సెట్లోనే ఉండండి. అప్పుడు దర్శకులు, టెక్నీషియన్ల కష్టం తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రెడిట్ ఎస్.ఎస్.రాజమౌళికి దక్కుతుంది. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్ సినిమా. రాజమౌళి, సుకుమార్, రిషబ్శెట్టి, అట్లీ, లోకేష్ కనగరాజ్ దక్షిణాది సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చారు. నిర్మాతలు, దర్శకులు కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది’’
‘సైరా’ నష్టాలనే మిగిల్చింది!
‘‘చరణ్తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచె భావోద్వేగంగా అనిపించింది. శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండో భాగంగా చరణ్, జాన్వీ నటిస్తే చూడాలని ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే స్వయంగా రావాలి. నాకు ఫ్రీడమ్ ఫైటర్గా చేయాలని ఉండేది. ‘సైరా’ చేశాను. ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నిలిచింది. మిగిలినచోట్ల బాగానే ఆడింది. నాకు బాధ లేదు. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే, ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఎలాంటి అంచనాలు లేవు. యువ దర్శకులకు నా గురించి, నేను ఏ సినిమాలో, ఏ స్టైల్లో నటిస్తే బాగుంటుందో వాళ్లకు తెలుసు’’
అభిమానులు దర్శకులైతే..
‘‘కొన్ని రోజుల కిందట రజనీకాంత్ నాతో ఒక మాట చెప్పారు. ‘మనం పని చేయాలనుకున్న లెజండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులు ఉన్నారు. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులు అయితే, వారిపైనే ఆధారపడటమే. మనల్ని ఎలా చూపించాలో వాళ్లకు బాగా తెలుసు’ అన్నారు. బాబీతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చేశా. అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్గానూ బాగా హిట్టయింది. ఇప్పుడు ‘విశ్వంభర’ చేస్తున్నా. వశిష్ట కూడా నాకు పెద్ద అభిమాని. వాళ్లు కచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తారు.
ఆ సంతృప్తి చాలు
‘మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తార’ని అడగ్గా.. ‘‘మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (తేజ సజ్జను చూపిస్తూ..)ని చూశారా.? అతను హను-మాన్’ చేశాడు. 25 ఏళ్ల కిందట బాలనటుడిగా తను కెరీర్ను ప్రారంభించాడు. నాతోనూ సినిమాలు చేశాడు. ‘ఇంద్ర’లోనూ నటించాడు. తనకు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నన్ను చాలా ఇష్టపడేవాడు. నా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేవాడు. అలాగే తను పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ‘హను-మాన్’ మూవీ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. కానీ, అతను ఈ సినిమా చేశాక నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే నేను తనని వేరుగా చూడటం లేదు. అతను నా ప్రయాణంలో ఒక భాగం. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్ భారతదేశం అతడి నటనను మెచ్చుకుంటోంది’’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం