Chiranjeevi: చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor) కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అది త్వరలోనే జరగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రాజీవ్ మసంద్ అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానం ఇచ్చారు.
నాకు క్లాసికల్స్ ఇష్టం!
‘‘సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేనెప్పుడూ మెగాస్టార్ అవుతానని అనుకోలేదు. కానీ, మంచి స్థానంలో ఉంటానని అనుకున్నా. ఎందుకంటే నా ప్రతిభపై నమ్మకం ఉంది. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. దాని ఫలితమే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు. అభిమానుల ప్రేమను కొలవలేను. నా అభిమానులు మాస్ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారు. నాకేమో క్లాసికల్ సినిమాలు చేయాలని ఉండేది. ‘ఖైదీ’ నాకు స్టార్ స్టేటస్ ఇచ్చింది. నన్ను చాలా పైకి తీసుకెళ్లింది. అందులోని యాక్షన్ సీన్స్, డ్యాన్స్లు, భావోద్వేగ సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘శుభలేఖ’లాంటి చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించారు.
అందుకే కమర్షియల్స్
‘‘ప్రేక్షకులు రెండు రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడతారని అర్థమైంది. కె.బాలచందర్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ చేశాం. నాకు మంచి పేరు వచ్చింది. అయితే, ప్రొడ్యూసర్గా నా తమ్ముడికి లాభాలు రాలేదు. నేను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ప్రతీ దాన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకే నిదానంగా కమర్షియల్ వైపు వెళ్లాల్సివచ్చింది. ‘దంగల్’ లాంటి సినిమాలు చేయొచ్చుగా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనేవారు. కానీ, నిర్మాతలు సంతోషంగా ఉండలేరు. నేను చేసే కమర్షియల్ సినిమాలు చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు నేనూ ప్రతిరోజూ వ్యాయామం చేస్తా. ఏదైనా ఒకరోజు కుదరకపోతే ఆ రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలోనూ నియమాలు పాటిస్తా’’
ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్ సినిమా!
‘‘షూటింగ్ ఉన్న రోజు నేను చాలా హుషారుగా ఉంటాను. లేకపోతే ఆ రోజంతా నిస్సారంగా ఉంటుంది. పని చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే రోజూ పని చేయమని నా భార్య సలహా ఇస్తుంది. మెయిన్ క్యారెక్టర్ సెట్లో ఉంటే సినిమా బాగా వస్తుంది. నటీనటులు క్యార్వాన్లు ఎక్కువగా వాడకండి. సెట్లోనే ఉండండి. అప్పుడు దర్శకులు, టెక్నీషియన్ల కష్టం తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రెడిట్ ఎస్.ఎస్.రాజమౌళికి దక్కుతుంది. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నదంతా ఇండియన్ సినిమా. రాజమౌళి, సుకుమార్, రిషబ్శెట్టి, అట్లీ, లోకేష్ కనగరాజ్ దక్షిణాది సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చారు. నిర్మాతలు, దర్శకులు కలిసికట్టుగా పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది’’
‘సైరా’ నష్టాలనే మిగిల్చింది!
‘‘చరణ్తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కొంచె భావోద్వేగంగా అనిపించింది. శ్రీదేవి గుర్తుకువచ్చింది. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. ‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండో భాగంగా చరణ్, జాన్వీ నటిస్తే చూడాలని ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలు, సినిమాలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పలేను. మనం ఎదురుచూసే పాత్రలు ప్రతిసారీ రావు. వాటంతట అవే స్వయంగా రావాలి. నాకు ఫ్రీడమ్ ఫైటర్గా చేయాలని ఉండేది. ‘సైరా’ చేశాను. ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నిలిచింది. మిగిలినచోట్ల బాగానే ఆడింది. నాకు బాధ లేదు. ఆ సినిమా వల్ల చాలానే నష్టపోయాం. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే, ప్రొడ్యూసర్ జేబు ఖాళీ అవుతుంది. మంచి కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నా. నాకు ఎలాంటి అంచనాలు లేవు. యువ దర్శకులకు నా గురించి, నేను ఏ సినిమాలో, ఏ స్టైల్లో నటిస్తే బాగుంటుందో వాళ్లకు తెలుసు’’
అభిమానులు దర్శకులైతే..
‘‘కొన్ని రోజుల కిందట రజనీకాంత్ నాతో ఒక మాట చెప్పారు. ‘మనం పని చేయాలనుకున్న లెజండరీ దర్శకులంతా ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా కొత్త దర్శకులు ఉన్నారు. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులు అయితే, వారిపైనే ఆధారపడటమే. మనల్ని ఎలా చూపించాలో వాళ్లకు బాగా తెలుసు’ అన్నారు. బాబీతో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ చేశా. అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్గానూ బాగా హిట్టయింది. ఇప్పుడు ‘విశ్వంభర’ చేస్తున్నా. వశిష్ట కూడా నాకు పెద్ద అభిమాని. వాళ్లు కచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తారు.
ఆ సంతృప్తి చాలు
‘మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తార’ని అడగ్గా.. ‘‘మీరు అక్కడ కూర్చొన్న వ్యక్తి (తేజ సజ్జను చూపిస్తూ..)ని చూశారా.? అతను హను-మాన్’ చేశాడు. 25 ఏళ్ల కిందట బాలనటుడిగా తను కెరీర్ను ప్రారంభించాడు. నాతోనూ సినిమాలు చేశాడు. ‘ఇంద్ర’లోనూ నటించాడు. తనకు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నన్ను చాలా ఇష్టపడేవాడు. నా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేవాడు. అలాగే తను పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ‘హను-మాన్’ మూవీ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. కానీ, అతను ఈ సినిమా చేశాక నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే నేను తనని వేరుగా చూడటం లేదు. అతను నా ప్రయాణంలో ఒక భాగం. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్ భారతదేశం అతడి నటనను మెచ్చుకుంటోంది’’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!