Chiranjeevi: ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).
ఇంటర్నెట్డెస్క్: తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలు హైదరాబాద్లో ఆదివారం సాయంత్రం జరిగాయి. ఈ కార్యక్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi), నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. కెరీర్, విమర్శలు, కుటుంబం గురించి పలు ప్రశ్నలు అడిగారు.
ఈ స్థాయికి వస్తారని, పద్మభూషణ్ అందుకుంటారని ఎప్పుడైనా ఊహించారా?
చిరంజీవి: ఈ స్థాయికి రావాలని కలులు కన్నాను. అది ఒక్కరోజులో మొదలైంది కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అప్పట్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న రోజులు ఉన్నాయి. తోటి విద్యార్థులు నాపై ప్రశంసలు కురిపించేవారు. వారి మాటలు విని నేనెంతో గర్వపడేవాడిని. నటుడిగా మారాలనే బీజం అప్పుడు పడింది. సెలబ్రిటీ అయితే అందరూ మనల్నే చూస్తారని అర్థమైంది. దాని కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా.
సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ఇంట్లోవాళ్లు ఎలా ఫీలయ్యారు?
చిరంజీవి: నా అదృష్టం కొద్దీ మా నాన్న గారికి సినిమా రంగం అంటే ఇష్టం. నా నిర్ణయం ఆయనకు నచ్చింది.. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కాస్త సందేహించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడంతోపాటు ఐసీఏడబ్ల్యూ చేయమన్నారు. ఆయన కోసం నైట్ కాలేజీలో చేరా. ఆరు నెలలు చదువు పక్కనపెట్టేసి.. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ కొనసాగించా. అక్కడ ఉన్నప్పుడే మొదటి ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే వరుస అవకాశాలొచ్చాయి. ఫొటోలతో ఆఫీస్ల చుట్టూ తిరిగే పరిస్థితి మాత్రం భగవంతుడు నాకు కల్పించలేదని గర్వంగా చెప్పగలను.
మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?
చిరంజీవి: ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నా స్నేహితుడు సుధాకర్కు భారతీరాజా చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. అదే సమయంలో వాడికి ‘పునాదిరాళ్లు’లోనూ ఆఫర్ వచ్చింది. ఇందులో యాక్ట్ చేస్తే.. తన చిత్రంలో ఛాన్స్ ఇవ్వనని భారతీ రాజా చెప్పడంతో సుధాకర్కు ఏం చేయాలో అర్థం కాలేదు. ‘పునాదిరాళ్లు’ టీమ్తో మాట్లాడి నో చెప్పడానికి నన్ను కూడా వెంట తీసుకువెళ్లాడు. వాళ్లతో మాట్లాడి వచ్చేస్తుంటే.. ‘‘సరే.. నువ్వు యాక్ట్ చెయ్. మాకు ఎవరూ దొరకడం లేదు’’ అని నన్ను అడిగారు. ఇంటికి కూడా వచ్చేశారు. నా పేరు మార్చుకుని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అది చేస్తున్న సమయంలోనే నా నటన చూసి ‘ప్రాణం ఖరీదు’లో అవకాశం ఇచ్చారు.
కెరీర్లో మీరు ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి?
చిరంజీవి: జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు, ఎత్తుపల్లాలు, సవాళ్లు ఉంటాయి. అవన్నీ తట్టుకుని నేనూ ఇక్కడికి వచ్చిన వాడినే. ‘న్యాయం కావాలి’ సెట్లో చోటుచేసుకున్న ఓ సంఘటన నన్నెంతో మార్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శారద రీఎంట్రీ ఇచ్చారు. చిత్రీకరణలో భాగంగా అందరూ పొజిషన్స్లో నిల్చొన్నారు. క్రాంతికుమార్ కెమెరా ఆపరేట్ చేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో నేను కూడా పొజిషన్లో నిల్చొన్నా. దీంతో క్రాంతికుమార్ నాపై కేకలు వేశారు. ‘‘పిలిస్తే గానీ రారా? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా? సూపర్స్టార్ అనుకుంటున్నారా?’’ అని అందరి ముందు నన్ను తిట్టారు. చాలా బాధగా అనిపించింది. ఆరోజు భోజనం చేయలేదు. ఆయన మాటలు నా మనసుని తాకాయి. సూపర్స్టార్ అయ్యి చూపించాలనుకున్నా. అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నా. ఈస్థాయికి వచ్చా.
మీరెప్పుడైనా ట్రోలింగ్ ఎదుర్కొన్నారా? వాటిని ఎలా అధిగమించారు?
చిరంజీవి: కెరీర్లో తొలి అడుగులు వేసే సమయంలో.. ‘‘మనం రాణించగలమా? లేదా’’ అని బిక్కుబిక్కుమని ఉంటాం. అలాంటి సమయంలో సానుకూల వాతావరణం ఉన్న చోటే ఉండాలి. సినిమాల్లోకి నేనింకా రాలేదు. మద్రాస్లో ఉన్నప్పుడు స్నేహితుడితో కలిసి పాండిబజార్ వెళ్లా. అక్కడి వాళ్లు నన్ను చూసి.. ‘‘ఏంటి సినిమాల్లో చేయడానికి వచ్చావా? హీరోగా చేస్తావా?’’ అని హేళన చేశారు. వాళ్ల మాటలు విని ఎంతో బాధపడ్డా. ఆ సంఘటన తర్వాత నేను మళ్లీ అక్కడికి వెళ్లలేదు. నెగెటివిటీ ఉన్న చోటకు వెళ్తే మనం మరింత కుంగుబాటుకు గురి అవుతాం.
మీ ‘ఫ్యామిలీ స్టార్’ ఎవరు?
చిరంజీవి: మా నాన్న. ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే దాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. మా అమ్మకు ఐదుగురు చెల్లెళ్లు. మా తాతయ్య చనిపోయాక.. నాన్నే వారి బాధ్యత తీసుకుని వచ్చిన జీతంలోనే వారికి పెళ్లిళ్లు చేశారు. మా కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా.. పలు సందర్భాల్లో అందరూ ఒకచోట కలిసేలా నేనూ సురేఖ ప్లాన్ చేస్తుంటాం. అలా కలవడం వల్ల మనలో ఉండే చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయనిపిస్తుంది.
ఎలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడుతుంటారు?
చిరంజీవి: చెబితే నవ్వుతారు. ‘మిక్కీ హౌస్’ కామిక్ చిత్రాలు చూస్తా. జాకీ చాన్ చిత్రాలు, మనసుకి ఆహ్లాదంగా అనిపించే చిత్రాలే చూస్తా.
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నాకు షాంపూ అయిపోతే నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా, మీకు కూడా అలవాట్లు ఉన్నాయా?
చిరంజీవి: మావాళ్లు ఇంట్లో లైట్స్ అని ఆన్ చేసి వెళ్లిపోతుంటారు. నేనే వాటిని ఆఫ్ చేస్తుంటా. గీజర్ ఆన్ చేస్తారు.. మర్చిపోతారు. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్లో యాప్ పెట్టుకున్నా. చరణ్ ఉదయాన్నే బ్యాంకాక్ వెళ్లాడు. తన ఫ్లోర్లో లైట్స్ అన్ని ఆన్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఆఫ్ చేశా. దీన్నే మధ్యతరగతి మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. షాంపూ అయిపోతే ఆ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా. సోప్ చివరకు వచ్చాక.. చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి వాడుతుంటా. పొదుపు చేయడం అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్