Shilpa: ఆఫ్ స్క్రీన్లో సౌందర్యని చూస్తే ఆశ్చర్యపోతారు..: శిల్ప
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, తొలి తెలుగు సీరియల్ నటి శిల్ప ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన అనుభవాలను పంచుకున్నారు.
తొలి తెలుగు టెలివిజన్ కథానాయిక, ఎన్నో సినిమాల్లో నటించిన చక్కటి నటి, వందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పి పదికి పైగా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు శిల్ప. తెలుగు సినిమాలో డబ్బింగ్ అనేది ఒక గ్రంథమైతే.. అందులో బంగారు అక్షరాలతో లిఖించగలిగిన పేజీ ఆమె సొంతం. ఆమె ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన విశేషాలు మీకోసం..
తొలి తెలుగు టీవీ సీరియల్లో నటించడం ఎలా అనిపించింది?
శిల్ప: నా అసలు పేరు మైత్రేయి. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే. నేను నటించిన తొలి సీరియల్ ‘అనగనగా ఒక శోభ’. అది దూరదర్శన్లో టెలికాస్ట్ అయి గతేడాది అక్టోబర్కు 37 ఏళ్లు పూర్తయింది. అందులో హీరోగా ప్రదీప్ను ఎంపిక చేశారు. హీరోయిన్ కోసం 26 మంది అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించి నన్ను ఓకే చేశారు. ఆ సమయంలో నాకు చీరకట్టుకోవడం కూడా తెలియదు. ఇంట్లో అమ్మ ప్రోత్సహించారు. కానీ, నాన్న ఆడిషన్స్కు వెళ్లడానికి అంగీకరించలేదు. ‘నేను సెలక్ట్ కాకపోతే మీరు చెప్పింది వింటా.. ఈ రంగంవైపు చూడను’ అని నాన్నకు చెప్పి ఆడిషన్స్కు వచ్చా. వాళ్లు ఓకే చేశారు. అలా అందులో అవకాశం వచ్చింది.
‘అనగనగా ఒక శోభ’ సీరియల్ గురించి చెప్పండి?
శిల్ప: హిందీలో ‘రజనీ’ అనే సీరియల్ను తెలుగులో ‘అనగనగా ఒక శోభ’ పేరుతో తీశారు. దూరదర్శన్లో 13వారాలు టెలికాస్ట్ అయింది. పద్మనాభం గారు నా తండ్రి పాత్ర వేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దీనికి సంభాషణలు రాశారు.
మైత్రేయి..శిల్పగా ఎలా మారారు? మీరు చేసిన రెండో సీరియల్ ఏది?
శిల్ప: మైత్రేయి.. అని పిలవడం కష్టంగా ఉంటుందన్నారు. ఆరోజుల్లో ‘ఎస్’ అక్షరంతో పేరు ఉంటే కెరీర్ చాలా బాగుంటుందని సెంటిమెంట్ ఉంది. అందుకే శిల్ప అని మార్చారు. ‘అనగనగా ఒక శోభ’ చివరి మూడు ఎపిసోడ్లు ఉందనగా నాకు రెండో సీరియల్ ‘బుచ్చిబాబు’లో అవకాశం వచ్చింది.
టెలివిజన్ నుంచి సినిమా రంగానికి ఎలా వెళ్లారు?
శిల్ప: సినిమాలు అంటే మా నాన్న అసలు అంగీకరించరని నాకు తెలుసు. అందుకే ఆ ఆలోచన కూడా రాలేదు. సీరియల్స్లో నా నటన మెచ్చి జంధ్యాల, కె.విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు సినిమాల్లో అవకాశమిచ్చారు. అలా నా దగ్గరకు వచ్చిన వాటిలో నటించాను. నేనెప్పుడూ సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడగలేదు. సీరియల్స్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చా.
హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో చేయాలని అనిపించలేదా?
శిల్ప: ఎప్పుడూ అనుకోలేదు. నాకు చేతినిండా సీరియల్స్ ఉండేవి. పైగా హీరోయిన్గా చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాలి. నాకు అలా వెళ్లడం కుదరదు. అందుకే ఆసక్తి చూపించలేదు. నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఆపద్బాంధవుడు’. అందులో నేను నటించడమే కాకుండా.. ఇద్దరికి డబ్బింగ్ చెప్పా.
సీరియల్స్, సినిమాల్లో చేస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
శిల్ప: నాకు నటిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కువ పేరు వస్తుందని జీవితంలో అనుకోలేదు. డబ్బింగ్ చెప్పాలని మా నాన్నే నన్ను ప్రోత్సాహించారు. ‘అమ్మ’ సినిమాలో కావ్యకు మొదట చెప్పాను. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక్కోరోజు మూడు సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సింగిల్ టేక్లో చెప్పేస్తాను.
ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు?
శిల్ప: వెయ్యి సినిమాల వరకు రికార్డు రాసుకున్నాను. ఆ తర్వాత రిజిస్టర్ పోయింది. 12 నంది అవార్డులు వచ్చాయి. ‘పెళ్లి చూపులు’ అనే సీరియల్లో ఒక్క ఎపిసోడ్ చేశా. దానికే నంది రావడం సంతోషాన్నిచ్చింది. నటిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఎక్కువ నంది అవార్డులు వచ్చాయి.
సౌందర్య(Soundarya) పట్టుబట్టి మీతో డబ్బింగ్ చెప్పించుకునే వారట నిజమేనా?
శిల్ప: నా కెరీర్లో ఎక్కువ సౌందర్య సినిమాలకే డబ్బింగ్ చెప్పా. నేను ఆవిడను కలిసింది మూడుసార్లే. వాళ్ల నాన్నగారితో ఎక్కువ పరిచయం. ఆవిడ పాత్రకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆయన స్టూడియోకు వచ్చి మాట్లాడేవారు. నా గొంతు వినిపిస్తే.. సౌందర్య వచ్చారా అనుకునే వారు.
‘అరుంధతి’ సినిమాకు డబ్బింగ్ చెప్పాక ఏమనిపించింది?
శిల్ప: ‘అరుంధతి’ (Arundhati)నాకెంతో పేరు తెచ్చింది. జేజమ్మ పాత్రకు డబ్బింగ్ చెప్పా. ఎక్కడికైనా వెళ్తే అందులోని డైలాగులు అడిగి చెప్పించుకునేవారు. ఆ సినిమాకు నంది అవార్డు వస్తుందని నేను ఆశపడ్డాను. కానీ, రాలేదు.
డబ్బింగ్లో సవాలుగా అనిపించిన పాత్ర ఏది?
శిల్ప: ‘స్వరాభిషేకం’ అనే సినిమాలో విశ్వనాథ్ గారి భార్యగా ఊర్వశి నటించారు. ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పాలన్నారు. నేను వణికిపోయాను. ఊర్వశికి చెప్పొచ్చుగానీ.. విశ్వనాథ్గారి భార్య పాత్రకు చెప్పాలనే సరికి భయం వేసింది. అలాగే ‘వీడే’ సినిమాలో విలన్ పాత్రకు, ‘క్షేత్రం’లో ప్రియమణికి చెప్పినప్పుడు కష్టంగా అనిపించింది. ‘చూడాలని ఉంది’కు డబ్బింగ్ చెప్పాలని పిలిచారు. సౌందర్య, అంజలా ఝవేరీ ఇద్దరుంటారు. నేను అంజలా ఝవేరీకి చెప్పాలన్నారు. ఎందుకని ఆరా తీస్తే.. హిందీ హీరోయిన్స్కు లిప్సింక్ బాగా చేస్తానని దర్శకనిర్మాతలు అనుకున్నారని తెలిసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది నార్త్ హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పా.
ఏ హీరోయిన్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంజాయ్ చేశారు?
శిల్ప: సౌందర్య. ఆమె నటించిన చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పాను. ఆవిడ ఆఫ్ స్క్రీన్లో చాలా తక్కువ మాట్లాడతారు. ఆమెను చూసిన వారు తెరపై సరదాగా ఉండే సౌందర్య.. విడిగా ఇంత సైలెంట్గా ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
డబ్బింగ్లో మీకు స్ఫూర్తి ఎవరు?
శిల్ప: సరిత, రోజారమణి వాళ్లతో కలిసి కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పా. అప్పుడు వాళ్లను చూసి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా.
మీకు ఆధ్యాత్మికత ఎక్కువని విన్నాం.. ఎన్ని దేవాలయాలకు వెళ్లారు?
శిల్ప: భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూడాలని నాకు కోరిక. ఇప్పటికి చాలా చూశాను. కొంచెం సమయం దొరికినా నేను గుడికి వెళ్తాను. హిమాలయాలకు దగ్గరగా ఉన్న గుడులన్నీ చూసేశాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.