Shilpa: ఆఫ్ స్క్రీన్లో సౌందర్యని చూస్తే ఆశ్చర్యపోతారు..: శిల్ప
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, తొలి తెలుగు సీరియల్ నటి శిల్ప ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన అనుభవాలను పంచుకున్నారు.
తొలి తెలుగు టెలివిజన్ కథానాయిక, ఎన్నో సినిమాల్లో నటించిన చక్కటి నటి, వందల చిత్రాలకు డబ్బింగ్ చెప్పి పదికి పైగా నంది అవార్డులను సొంతం చేసుకున్నారు శిల్ప. తెలుగు సినిమాలో డబ్బింగ్ అనేది ఒక గ్రంథమైతే.. అందులో బంగారు అక్షరాలతో లిఖించగలిగిన పేజీ ఆమె సొంతం. ఆమె ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె చెప్పిన విశేషాలు మీకోసం..
తొలి తెలుగు టీవీ సీరియల్లో నటించడం ఎలా అనిపించింది?
శిల్ప: నా అసలు పేరు మైత్రేయి. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లోనే. నేను నటించిన తొలి సీరియల్ ‘అనగనగా ఒక శోభ’. అది దూరదర్శన్లో టెలికాస్ట్ అయి గతేడాది అక్టోబర్కు 37 ఏళ్లు పూర్తయింది. అందులో హీరోగా ప్రదీప్ను ఎంపిక చేశారు. హీరోయిన్ కోసం 26 మంది అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించి నన్ను ఓకే చేశారు. ఆ సమయంలో నాకు చీరకట్టుకోవడం కూడా తెలియదు. ఇంట్లో అమ్మ ప్రోత్సహించారు. కానీ, నాన్న ఆడిషన్స్కు వెళ్లడానికి అంగీకరించలేదు. ‘నేను సెలక్ట్ కాకపోతే మీరు చెప్పింది వింటా.. ఈ రంగంవైపు చూడను’ అని నాన్నకు చెప్పి ఆడిషన్స్కు వచ్చా. వాళ్లు ఓకే చేశారు. అలా అందులో అవకాశం వచ్చింది.
‘అనగనగా ఒక శోభ’ సీరియల్ గురించి చెప్పండి?
శిల్ప: హిందీలో ‘రజనీ’ అనే సీరియల్ను తెలుగులో ‘అనగనగా ఒక శోభ’ పేరుతో తీశారు. దూరదర్శన్లో 13వారాలు టెలికాస్ట్ అయింది. పద్మనాభం గారు నా తండ్రి పాత్ర వేశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దీనికి సంభాషణలు రాశారు.
మైత్రేయి..శిల్పగా ఎలా మారారు? మీరు చేసిన రెండో సీరియల్ ఏది?
శిల్ప: మైత్రేయి.. అని పిలవడం కష్టంగా ఉంటుందన్నారు. ఆరోజుల్లో ‘ఎస్’ అక్షరంతో పేరు ఉంటే కెరీర్ చాలా బాగుంటుందని సెంటిమెంట్ ఉంది. అందుకే శిల్ప అని మార్చారు. ‘అనగనగా ఒక శోభ’ చివరి మూడు ఎపిసోడ్లు ఉందనగా నాకు రెండో సీరియల్ ‘బుచ్చిబాబు’లో అవకాశం వచ్చింది.
టెలివిజన్ నుంచి సినిమా రంగానికి ఎలా వెళ్లారు?
శిల్ప: సినిమాలు అంటే మా నాన్న అసలు అంగీకరించరని నాకు తెలుసు. అందుకే ఆ ఆలోచన కూడా రాలేదు. సీరియల్స్లో నా నటన మెచ్చి జంధ్యాల, కె.విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు సినిమాల్లో అవకాశమిచ్చారు. అలా నా దగ్గరకు వచ్చిన వాటిలో నటించాను. నేనెప్పుడూ సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడగలేదు. సీరియల్స్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చా.
హీరోయిన్గా ఎక్కువ సినిమాల్లో చేయాలని అనిపించలేదా?
శిల్ప: ఎప్పుడూ అనుకోలేదు. నాకు చేతినిండా సీరియల్స్ ఉండేవి. పైగా హీరోయిన్గా చేయాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాలి. నాకు అలా వెళ్లడం కుదరదు. అందుకే ఆసక్తి చూపించలేదు. నాకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా ‘ఆపద్బాంధవుడు’. అందులో నేను నటించడమే కాకుండా.. ఇద్దరికి డబ్బింగ్ చెప్పా.
సీరియల్స్, సినిమాల్లో చేస్తూనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
శిల్ప: నాకు నటిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కువ పేరు వస్తుందని జీవితంలో అనుకోలేదు. డబ్బింగ్ చెప్పాలని మా నాన్నే నన్ను ప్రోత్సాహించారు. ‘అమ్మ’ సినిమాలో కావ్యకు మొదట చెప్పాను. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక్కోరోజు మూడు సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సింగిల్ టేక్లో చెప్పేస్తాను.
ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు?
శిల్ప: వెయ్యి సినిమాల వరకు రికార్డు రాసుకున్నాను. ఆ తర్వాత రిజిస్టర్ పోయింది. 12 నంది అవార్డులు వచ్చాయి. ‘పెళ్లి చూపులు’ అనే సీరియల్లో ఒక్క ఎపిసోడ్ చేశా. దానికే నంది రావడం సంతోషాన్నిచ్చింది. నటిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గానే ఎక్కువ నంది అవార్డులు వచ్చాయి.
సౌందర్య(Soundarya) పట్టుబట్టి మీతో డబ్బింగ్ చెప్పించుకునే వారట నిజమేనా?
శిల్ప: నా కెరీర్లో ఎక్కువ సౌందర్య సినిమాలకే డబ్బింగ్ చెప్పా. నేను ఆవిడను కలిసింది మూడుసార్లే. వాళ్ల నాన్నగారితో ఎక్కువ పరిచయం. ఆవిడ పాత్రకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆయన స్టూడియోకు వచ్చి మాట్లాడేవారు. నా గొంతు వినిపిస్తే.. సౌందర్య వచ్చారా అనుకునే వారు.
‘అరుంధతి’ సినిమాకు డబ్బింగ్ చెప్పాక ఏమనిపించింది?
శిల్ప: ‘అరుంధతి’ (Arundhati)నాకెంతో పేరు తెచ్చింది. జేజమ్మ పాత్రకు డబ్బింగ్ చెప్పా. ఎక్కడికైనా వెళ్తే అందులోని డైలాగులు అడిగి చెప్పించుకునేవారు. ఆ సినిమాకు నంది అవార్డు వస్తుందని నేను ఆశపడ్డాను. కానీ, రాలేదు.
డబ్బింగ్లో సవాలుగా అనిపించిన పాత్ర ఏది?
శిల్ప: ‘స్వరాభిషేకం’ అనే సినిమాలో విశ్వనాథ్ గారి భార్యగా ఊర్వశి నటించారు. ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పాలన్నారు. నేను వణికిపోయాను. ఊర్వశికి చెప్పొచ్చుగానీ.. విశ్వనాథ్గారి భార్య పాత్రకు చెప్పాలనే సరికి భయం వేసింది. అలాగే ‘వీడే’ సినిమాలో విలన్ పాత్రకు, ‘క్షేత్రం’లో ప్రియమణికి చెప్పినప్పుడు కష్టంగా అనిపించింది. ‘చూడాలని ఉంది’కు డబ్బింగ్ చెప్పాలని పిలిచారు. సౌందర్య, అంజలా ఝవేరీ ఇద్దరుంటారు. నేను అంజలా ఝవేరీకి చెప్పాలన్నారు. ఎందుకని ఆరా తీస్తే.. హిందీ హీరోయిన్స్కు లిప్సింక్ బాగా చేస్తానని దర్శకనిర్మాతలు అనుకున్నారని తెలిసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది నార్త్ హీరోయిన్స్కు డబ్బింగ్ చెప్పా.
ఏ హీరోయిన్కు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంజాయ్ చేశారు?
శిల్ప: సౌందర్య. ఆమె నటించిన చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పాను. ఆవిడ ఆఫ్ స్క్రీన్లో చాలా తక్కువ మాట్లాడతారు. ఆమెను చూసిన వారు తెరపై సరదాగా ఉండే సౌందర్య.. విడిగా ఇంత సైలెంట్గా ఉంటారా అని ఆశ్చర్యపోతారు.
డబ్బింగ్లో మీకు స్ఫూర్తి ఎవరు?
శిల్ప: సరిత, రోజారమణి వాళ్లతో కలిసి కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పా. అప్పుడు వాళ్లను చూసి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా.
మీకు ఆధ్యాత్మికత ఎక్కువని విన్నాం.. ఎన్ని దేవాలయాలకు వెళ్లారు?
శిల్ప: భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ చూడాలని నాకు కోరిక. ఇప్పటికి చాలా చూశాను. కొంచెం సమయం దొరికినా నేను గుడికి వెళ్తాను. హిమాలయాలకు దగ్గరగా ఉన్న గుడులన్నీ చూసేశాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.