Like Share Subscribe: చిరంజీవి రూపంలో అద్భుతం జరిగింది: మేర్లపాక గాంధీ
దర్శకుడు మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ. తన కొత్త చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్’ గురించి గాంధీ పంచుకున్న విశేషాలివీ..
హైదరాబాద్: ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘ఎక్స్ప్రెస్ రాజా’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi). ఆయన తాజా చిత్రం ‘లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్’ (Like Share & Subscribe). సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గాంధీ మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..
* ఈ కథాలోచన ఎప్పుడు వచ్చింది?
గాంధీ: లాక్డౌన్లో ఈ సినిమా ఆలోచన వచ్చింది. ఆ సమయంలో ట్రావెలింగ్కు సంబంధించిన వీడియోలను బాగా చూసేవాణ్ని. ట్రావెల్ వ్లాగ్స్ను చూస్తున్నప్పుడు మనమూ ఆయా ప్రదేశాలకు వెళ్లినట్టు ఉంటుంది. కొన్ని ఆసక్తికర ప్రాంతాలు, వాటి చరిత్ర గురించి కొందరు వ్యక్తులు వివరించిన తీరు నన్ను ఆకర్షించింది. అలా యూట్యూబర్ కథను తెరపైకి తీసుకొస్తే బాగుంటుందనిపించింది. ట్రావెల్ వ్లాగర్ ఎదుర్కొనే సమస్యలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం.
* ఈ స్టోరీ విన్నాక నిర్మాత స్పందనేంటి?
గాంధీ: వెంకట్ బోయనపల్లి నిర్మాణ సంస్థలో ఎప్పుడో ఓ సినిమా చేయాలనుకున్నా. అది ‘లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్’తో కుదిరింది. ఈ కథ, టైటిల్ ఆయన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నా మీద నమ్మకంతో దేనికీ రాజీపడకుండా సినిమా నిర్మించారు.
* ఈ కాన్సెప్ట్ కొన్ని వర్గాల ప్రేక్షకులకే కనెక్ట్ అయ్యేలా ఉంది కదా?
గాంధీ: అలాంటి సందేహమే వద్దండీ. ఈ సినిమా అన్ని వర్గాలను తప్పకుండా అలరిస్తుంది. ఈ కథ అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకుంది. హీరోహీరోయిన్లు ట్రావెల్ వ్లాగర్లుగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరం. సమాజంలో నెలకొన్న ఓ సమస్యను అంతర్లీనంగా ప్రస్తావిస్తూ కథను ఎంటర్టైనర్గా తీర్చిదిద్దా. ప్రతి పదిహేను నిమిషాలకు స్క్రీన్ప్లే సరికొత్తగా ఉంటుంది.
* థియేటర్కు వెళ్లి చిన్న చిత్రాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే భయం ఉందా?
గాంధీ: ఆ భయం ఉంది. ఆ కారణంతోనే మా సినిమాని వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నాం. ఎక్కువ మంది ప్రేక్షకులను ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకురావాలనేది మా లక్ష్యం. సినిమా బాగుందనే టాక్ వస్తే.. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వెళ్తారు.
* సంతోష్, అబ్దుల్లా గురించి ఏం చెబుతారు?
గాంధీ: సంతోష్ శోభన్ నేనూ కలిసి గతంలో ‘ఏక్ మినీ కథ’ సినిమా చేశాం. అప్పుడే ఆయన నటన నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కథను ఆయనతో పంచుకోగా.. ‘నాకు నచ్చింది.. చేద్దాం’ అని అన్నారు. సంతోష్, ఫరియా ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వీరితోపాటు సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రలు కీలకం. పి. పి. ఎఫ్ అనే ఓ గ్యాంగ్కు బాస్గా బ్రహ్మాజీ కనిపిస్తారు. డీవోపీగా సుదర్శన్ నవ్వులు పంచుతారు.
* ఈ సినిమా ప్రచారానికి చిరంజీవి తోడైనట్టున్నారు?
గాంధీ: అది ఊహించని పరిణామం. తాను నటిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టీజర్లో ‘లైక్, షేర్ & సబ్స్క్రైబ్’ అనే డైలాగ్ను చిరంజీవి చెప్పారు. అందరూ ఆ క్లిప్ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలోమా టీమ్ను ట్యాగ్ చేశారు. అప్పుడు ఎంతో ఆనందించాం. చిరంజీవిగారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.
* కొత్త ప్రాజెక్టుల విశేషాలు?
గాంధీ: ప్రస్తుతం పలు స్క్రిప్టులు సిద్ధం చేసే పనిలో ఉన్నా. పెద్ద చిత్రాలనే తెరకెక్కించాలనుకుంటున్నా. ‘జవాన్’ సినిమా నిర్మాత కృష్ణ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్లలో సినిమాలు చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత